Trends

గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట

నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవే ప్రజల మన్నలను పొందుతాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇటువంటి ఘటన ఒకటి జరిగింది.

గడ్డివాములు తగలబెట్టిన ఘటనలతో రైతుల్లో భయాందోళనలు రేపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దవడుగూరు మండలం పరిధిలో గత రెండు వారాలుగా వరుసగా జరిగిన అగ్నిప్రమాదాల వెనుక ఒకే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం, నాగసముద్రం గ్రామానికి చెందిన టపిల పెద్ద పాండురంగడు అలియాస్ సుధాకర్‌ను ఏప్రిల్ 19న అరెస్ట్ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అతడిని గుర్తించి, అక్షయ కాలనీ సమీపంలో పట్టుకున్నారు.

గత ఏప్రిల్ 12 రాత్రి వెల్పుల గంగరాజు, అదే రాత్రి జెడ్. వీరారెడ్డి గడ్డివాములు తగలబెట్టగా, ఏప్రిల్ 19న వట్టం రామేశ్వరరెడ్డి గడ్డివాములకు కూడా నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. జొన్న దుప్పలు, కొర్ర, సామ వాములు దగ్ధమవడంతో సుమారు ₹7 లక్షల నష్టం వాటిల్లింది.

విచారణలో భాగంగా, తగాదాలు ఉన్న వారిపై కక్షతో గడ్డివాములు తగలబెట్టే అలవాటు ఉన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. రెండు నెలల క్రితం తన స్వగ్రామంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలిపినట్టు పేర్కొన్నారు.

అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఎస్‌ఐ పబ్లిక్‌లో చితకబాదిన ఘటన వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్‌పీ విచారణకు ఆదేశించారు. చట్టపరమైన చర్యలే తీసుకోవాల్సిన సమయంలో ‘పోలీసు మార్క్ ట్రీట్మెంట్’ సరైనదా అనే చర్చ కొనసాగుతోంది.

Kumar

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

21 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

50 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago