కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ దిశగా హింట్స్ ఇచ్చినపుడు మరింత ఆశతో ఎదురు చూస్తారు. కేజీఎఫ్ చాప్టర్-3 విషయంలోనూ అలాంటి ఆశతోనే ఉన్నారు. 2022లో విడుదలై భారీ విజయాన్నందుకున్న కేజీఎఫ్-2 సినిమాలో హీరో కథ ముగించినట్లే ముగించి థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటికి అడుగు పెట్టబోతున్న సమయంలో చాప్టర్-3కి లీడ్ ఇచ్చి కొత్త ఆశలు రేకెత్తించాడు ప్రశాంత్ నీల్.
ఐతే ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు గడిచిపోగా.. ఇప్పటిదాకా కేజీఎఫ్-3 దిశగా చిన్న అడుగు కూడా పడలేదు. ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేసి డ్రాగన్ పనిలో నిమగ్నమయ్యాడు. దీని తర్వాత సలార్-2 చేయాల్సి ఉంది. మరోవైపు యశ్.. టాక్సిక్ సినిమా పూర్తి చేశాడు. తర్వాత రామాయణం రెండు భాగాల సంగతి చూడాల్సి ఉంది. దీంతో కేజీఎఫ్-3 నిజంగా ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా కేజీఎఫ్-3 గురించి యశ్ స్పందించాడు. ఇటు తాను.. అటు ప్రశాంత్ ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నామని, అందుకే తమ కలయికలో తర్వాతి సినిమా ఎప్పుడనేది చెప్పలేమని అతనన్నాడు.
ఐతే తాను, ప్రశాంత్ అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నామన్న యశ్.. తమ ఇద్దరికీ కుదిరి.. తమకు నచ్చే కథ సిద్ధమైనపుడు ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందని యశ్ తెలిపాడు. ఐతే ఆ సినిమా కేజీఎఫ్-3నేనా కాదా అన్నది అతను క్లారిటీ ఇవ్వలేదు. అన్ని కుదిరి కథ నచ్చితే సినిమా చేసే అవకాశమున్నట్లుగా మాట్లాడాడు.
మొత్తానికి యశ్ మాటల్ని బట్టి చూస్తే సమీప భవిష్యత్తులో ప్రశాంత్ నీల్తో సినిమా ఉండే అవకాశం కనిపించడం లేదు. వీళ్లిద్దరూ కలిసినా అది కేజీఎఫ్-3తోనే అని కూడా చెప్పలేం. కాబట్టి ఈ మెగా సీక్వెల్ మీద అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడం మంచిది. 2018లో వచ్చిన కేజీఎఫ్ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే.. 2022లో రిలీజ్ అయిన దీని సీక్వెల్ రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.
This post was last modified on April 22, 2026 8:40 am
కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన ఫలితాలు అందుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ సంపాదిస్తాయి. టీవీల్లో, ఆన్ లైన్లో గొప్ప ఆదరణ…
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలను పునర్విభించి .. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం ఆశలు ప్రస్తుత సమావేశాల్లో నెరవేరేలా కనిపించడం…
తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…
ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…