కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ దిశగా హింట్స్ ఇచ్చినపుడు మరింత ఆశతో ఎదురు చూస్తారు. కేజీఎఫ్ చాప్టర్-3 విషయంలోనూ అలాంటి ఆశతోనే ఉన్నారు. 2022లో విడుదలై భారీ విజయాన్నందుకున్న కేజీఎఫ్-2 సినిమాలో హీరో కథ ముగించినట్లే ముగించి థియేటర్ల నుంచి ప్రేక్షకులు బయటికి అడుగు పెట్టబోతున్న సమయంలో చాప్టర్-3కి లీడ్ ఇచ్చి కొత్త ఆశలు రేకెత్తించాడు ప్రశాంత్ నీల్.
ఐతే ఆ సినిమా వచ్చి నాలుగేళ్లు గడిచిపోగా.. ఇప్పటిదాకా కేజీఎఫ్-3 దిశగా చిన్న అడుగు కూడా పడలేదు. ప్రశాంత్ నీల్ సలార్ పూర్తి చేసి డ్రాగన్ పనిలో నిమగ్నమయ్యాడు. దీని తర్వాత సలార్-2 చేయాల్సి ఉంది. మరోవైపు యశ్.. టాక్సిక్ సినిమా పూర్తి చేశాడు. తర్వాత రామాయణం రెండు భాగాల సంగతి చూడాల్సి ఉంది. దీంతో కేజీఎఫ్-3 నిజంగా ఉంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
టాక్సిక్ ప్రమోషన్లలో భాగంగా తాజాగా కేజీఎఫ్-3 గురించి యశ్ స్పందించాడు. ఇటు తాను.. అటు ప్రశాంత్ ఎవరి ప్రాజెక్టుల్లో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నామని, అందుకే తమ కలయికలో తర్వాతి సినిమా ఎప్పుడనేది చెప్పలేమని అతనన్నాడు.
ఐతే తాను, ప్రశాంత్ అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నామన్న యశ్.. తమ ఇద్దరికీ కుదిరి.. తమకు నచ్చే కథ సిద్ధమైనపుడు ఈ కాంబినేషన్లో సినిమా ఉంటుందని యశ్ తెలిపాడు. ఐతే ఆ సినిమా కేజీఎఫ్-3నేనా కాదా అన్నది అతను క్లారిటీ ఇవ్వలేదు. అన్ని కుదిరి కథ నచ్చితే సినిమా చేసే అవకాశమున్నట్లుగా మాట్లాడాడు.
మొత్తానికి యశ్ మాటల్ని బట్టి చూస్తే సమీప భవిష్యత్తులో ప్రశాంత్ నీల్తో సినిమా ఉండే అవకాశం కనిపించడం లేదు. వీళ్లిద్దరూ కలిసినా అది కేజీఎఫ్-3తోనే అని కూడా చెప్పలేం. కాబట్టి ఈ మెగా సీక్వెల్ మీద అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టుకోకపోవడం మంచిది. 2018లో వచ్చిన కేజీఎఫ్ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబడితే.. 2022లో రిలీజ్ అయిన దీని సీక్వెల్ రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది.
విషయం చిన్నదే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేయలేనిది.. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…
బేబీ సినిమాతో పెద్ద సంచలనమే రేపాడు దర్శక నిర్మాత సాయిరాజేష్. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణవి చైతన్య, ఆనంద్…
హైదరాబాద్ను డ్రగ్స్ మహమ్మారి వెంటాడుతోంది. ఇటు ప్రభుత్వం, అటు పోలీసులు అనుక్షణం డ్రగ్స్ కట్టడికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఏదో ఒక…
ఏపీలో కూటమిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గత రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెదవి విప్పి.. కూటమి ప్రభుత్వం సాధించిన…
ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…