Trends

సునామీ సుడిగుండంలో జపాన్

జపాన్ లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. జపాన్ లోని ఉత్తర ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో కూడిన ఈ భూకంపం కారణంగా ఆ దేశంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం కారణంగా పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టాలేమీ సంభవించకున్నా…7.4 తీవ్రతతో భూమి కంపించడం జపాన్ వాసులను భయభ్రాంతులకు గురి చేసింది. అంతేకాకుండా ఈ భూకంపం నేపథ్యంలో సముద్రపు అలలు ఏకంగా 10 అడుగుల మేర ఎగిరిపడే ప్రమాదం ఉందంటూ ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

భూకంపం తర్వాత పరిస్థితులను సమీక్షించిన జపాన్ అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది. తీరప్రాంతాల్లోని ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యల కింద ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని సూచించింది. సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తు మేర ఎగిరిపడే ప్రమాదం ఉందని, ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఎత్తైన ప్రదేశాలే మంచిదని వెల్లడించింది. ఈ సూచనలు సునామీ హెచ్చరికల కిందకే వస్తాయని చెప్పాలి. 10 అడుగుల మేర అలలు ఎగసిపడతాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. భారీ నష్టం సంభవించే ప్రమాదం లేకపోలేదన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇక భూకంపం ఉత్తర జపాన్ లో సంభవించగా… దాని కేంద్రం జపాన్ రాజధాని టోక్యోకు వందల మైళ్ల దూరంలో ఉన్నట్టుగా గుర్తించారు. భూకంప తీవ్రత 7.4గా నమోదు అయ్యిందని జపాన్ అధికారికంగా ప్రకటించగా… ఆ తీవ్రత  7.5గా ఉందని మరికొన్ని సంస్థలు వెల్లడించాయి. ఇక భూకంపం జపాన్ ఉత్తర తీరంలో సంభవించగా.. సునామీ ప్రభావం ఆ దేశ ఈశాన్య తీరంలో ఉండనున్నట్లుగా సమాచారం. మొత్తంగా సునామీ హెచ్చరికల నేపథ్యంలో జపాన్ ప్రజలు తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారు.

Kumar

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

17 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

23 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

37 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago