మొన్న ఏడాది వచ్చిన వరుణ్ తేజ్ ‘మట్కా’ని సామాన్య ప్రేక్షకులు మర్చిపోయి ఉండొచ్చు కానీ అభిమానులకు మాత్రం పీడకలలా నిలిచిపోయింది. పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా జనాన్ని కనీస స్థాయిలో మెప్పించలేక డిజాస్టర్ అయ్యింది. మట్కా డాన్ గా పేరొందిన రతన్ ఖత్రి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని మెప్పించేలా చూపించడంలో ఫెయిలయ్యారు. తాజాగా ఇదే కథతో ‘మట్కా కింగ్’ వెబ్ సిరీస్ వచ్చింది.
1965 నుంచి 1975 మధ్య కాలాన్ని నేపధ్యంగా తీసుకున్నారు. పత్తి వ్యాపారం మాటున జూదం నిర్వహించే లాల్ జీ(గుల్షన్ గ్రోవర్) దగ్గర గుమస్తాగా పని చేసే బ్రిజ్ భట్టి (విజయ్ వర్మ) డబ్బు అవసరమై విభేదాలు తెచ్చుకుని స్వంతంగా మట్కా బిజినెస్ మొదలుపెడతాడు. పది ఇరవై పైసలతో మొదలుపెట్టి లక్షలు కోట్ల టర్న్ ఓవర్ కు చేరుకుంటాడు. ప్రభుత్వాలు సైతం ఏం చేయలేని మాఫియా సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు. చివరిని అతని ప్రయాణం ఏమయ్యిందనేది అసలు స్టోరీ.
ఇక్కడ సింపుల్ గా చెప్పినా అసలు సిరీస్ లో చాలా డెప్త్ ఉంటుంది. బ్రిజ్ భట్టి ఒక్కో ఇటుకను పేరుస్తూ, నిజాయితీగా ఉంటూ పేదోళ్ల మనసులు గెలుచుకోవడం, తన నల్ల డబ్బుని వైట్ లో మార్చుకోవడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాటరీ టికెట్లను వాడుకోవడం లాంటివి బాగా పేలాయి. ఎనిమిది ఎపిసోడ్లు ఒక్కొక్కటి సుమారు యాభై నిమిషాల నిడివి ఉండటంతో కొంత స్లోగా అనిపించినా చివరి దాకా చూడొచ్చు అనిపించేలా చేయడంలో దర్శకుడు నాగరాజ్ మంజులే సక్సెసయ్యాడు.
తెలుగులో తీసిన మట్కా, ఇప్పుడీ మట్కా కింగ్ కానీ ఎక్కడా రతన్ ఖత్రీ లైఫ్ ని తీసుకున్నామని చెప్పలేదు. కానీ అప్పటి పరిస్థితుల మీద అవగాహన ఉన్నవాళ్లకు ఇది ఎవరి గురించో అర్థమైపోతుంది. నటుడిగా విజయ్ వర్మ ఈ పాత్రకు పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించుకున్నాడు. క్యాస్టింగ్ చాలా బాగా కుదిరింది. ఆర్ట్ వర్క్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే స్కామ్ 1992తో పోలిస్తే మాత్రం అంత డెప్త్, ఇంటెన్సిటీ ఇందులో తగ్గిందని చెప్పాలి. అయినా సరే వన్ టైం వాచ్ విభాగంలో వేయొచ్చు.
This post was last modified on April 20, 2026 12:20 pm
నిన్న కీలకమైన వీకెండ్ పూర్తయ్యింది. శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్ ఆశలన్నీ సండే మీద పెట్టుకుని ప్రమోషన్లు…
సమ్మర్ సీజన్ లో ఏప్రిల్ చివరి వారం సినిమాలకు చాలా మంచి టైం. వేసవి పీక్స్ లో ఉండటంతో పాటు…
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…