పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు.. తమపై చేస్తున్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు సరఫరా, గ్యాస్ రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. కొన్నిదేశాల్లో చమురు నిల్వలు అడుగంటి.. కార్యకలాపాలను నిలిపేసుకున్నారు. మరికొన్ని దేశాల్లో ప్రభుత్వ ఆఫీసులకు వేళలు మార్చారు. ఇక, మన దేశంలోనూ కట్టెల పొయ్యిలు, బొగ్గుల పొయ్యిలు, కిరోసిన్ పొయ్యిలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలా.. తీవ్ర ప్రభావం చూపిన హోర్ముజ్ జలసంధిని తాజాగా ఇరాన్ తెరిచింది.
కారణమేంటి?
అయితే.. ఇలా 40 రోజులకుపైగానే తీవ్ర చర్చనీయాంశం అయిన హోర్ముజ్ జలసంధిని తాజాగా శుక్రవారం సాయంత్రం భారత కాలమానం ప్రకారం.. 4 గంటల సమయంలో తెరవడానికి కీలక కారణం.. లెబనాన్. ఈ దేశంపై ఇటీవల ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. లెబనాన్.. ఇరాన్కు మిత్రదేశం కావడంతో ఆ దేశంపై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేసింది. అమెరికాతో తమకు ఒప్పందం కుదిరినా.. కుదరకపోయినా.. హోర్ముజ్ విషయంలో లెబనాన్పై దాడులు ఆపితేనే నిర్ణయం తీసుకుంటామని ఇరాన్ ప్రకటించింది.
ఈ క్రమంలో తాజాగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను 10 రోజలు పాటు నిలుపుదల చేస్తూ..ఇరు దేశాల మధ్య ఓ అగ్రిమెంటు కుదిరింది. దీనిని లెబనాన్ ధ్రువీకరించడంతో తాజాగా ఇరాన్.. హోర్ముజ్ జలసంధిని తెరిచింది. అంతేకాదు.. ఇప్పటి వరకు తన మిత్ర దేశాలకు మాత్రమే ఈ మార్గం గుండా అనుమతులు ఇచ్చిన ఇరాన్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు అనుమతి ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే.. ఈఅనుమతులు లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని స్పష్టం చేసింది. దీనిని బట్టి 10 రోజుల పాటు హోర్ముజ్ను తెరిచి ఉంచనున్నారు.
ఎంత కీలకం?
ఈ జలసంధి.. ప్రపంచ దేశాలకు అత్యంత కీలకం. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ముడిచమురు ఉత్పత్తి ఉన్నా.. అక్కడ ఖరీదు ఎక్కువ. పైగా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ.. పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాల్లో భారీగా చమురు ఉత్పత్తి ఉంటుంది. పైగా ఇక్కడ చమురు ధరలు తక్కువ.. జల రవాణా కూడా చౌక. దీంతో పర్షియన్ గల్ఫ్(పర్షియా భాష మాట్లాడే దేశాల కూటమి)లో మరింత ఎక్కువగా రవాణా జరుగుతుంది. అందుకే హోర్ముజ్ జలసంధి అన్ని దేశాలకు కీలకం. ప్రస్తుతం భారత్కు చెందిన 15 నౌకలు, 4500 మంది సిబ్బంది.. ఇక్కడ చిక్కుకుపోగా.. తాజాగా నిబంధనలు సడలించడంతో వారంతా భారత్కు చేరుకుంటారని విదేశాంగ శాఖ పేర్కొంది.
This post was last modified on April 17, 2026 8:28 pm
డీలిమిటేషన్, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు లోక్ సభలో వీగిపోయిన నేపథ్యంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఆ విశ్లేషణలన్నింటిలో ఒకటి మాత్రం…
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లకు ఉద్దేశించిన బిల్లులకు పార్లమెంటులో చుక్కెదురైంది. డీలిమిటేషన్, మహిళా బిల్లులకు ఆమోదం…
మతపరంగా రిజర్వేషన్లను కల్పించేది లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో తెగేసి చెప్పారు. మహిళా బిల్లు…
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కొత్త మూవీ సంబరాల ఏటిగట్టు ఇప్పటిదాకా విడుదల తేదీ ఖరారు చేసుకోలేదు. ఫిలిం…
మలయాళ హీరో టొవినో థామస్ ఈ మధ్య తెలుగు మీడియాలో బాగానే నానాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ అవకాశాన్ని వదులుకున్నానని,…
అడివి శేష్ డెకాయిట్ రెండో వారంలోకి అడుగు పెట్టింది. మిక్స్డ్ టాక్ తోనూ కలెక్షన్లు వచ్చేలా చేసుకోవడం ద్వారా శేష్…