అనుకున్నట్లే తెలుగులో మరో భారీ చిత్రం.. మరోసారి రిలీజ్ డేట్ మార్చుకుంది. మార్చి చివరి వారం నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడ్డ రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’.. తాజాగా జూన్కు వాయిదా పడింది. ఈ సినిమా రెండోసారి పోస్ట్ పోన్ అవుతోందన్న వార్తలు మూడు వారాల ముందే మొదలయ్యాయి. అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అయింది. ఐతే వాయిదాకు కారణం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంటూ సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా అదే పనిగా పోస్టులు వేస్తున్నారు.
ఇది కావాలని చేస్తున్న ప్రచారమా అనే సందేహాలు కలుగుతున్నాయి. రెహమాన్ ఉండేది ఇక్కడ కాదు. సోషల్ మీడియా వార్తలను, ప్రచారాలను ఆయన పెద్దగా పట్టించుకోడు. పైగా రెహమాన్ ఎప్పుడూ కొంచెం లేటే అనే ముద్ర ఎలాగూ ఉంది. కాబట్టి సింపుల్గా వాయిదా నెపాన్ని ఆయన మీదికి తోసేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
మధ్యలో రంజాన్ మాసం వల్ల రెహమాన్ కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. మరోవైపు ‘రామాయణ’ లాంటి పెద్ద సినిమాకూ రెహమాన్ పని చేస్తున్నాడు. ఇవి వాస్తవాలే అయినా.. తన కెరీర్లోనే అత్యంత వేగంగా పని చేస్తున్న సినిమాల్లో ‘పెద్ది’ ఒకటి అన్నది తన సన్నిహిత వర్గాల సమాచారం.
ఐతే ఆయన కొంచెం ముందుగా ఔట్ పుట్ తన చేతిలో ఉండాలని కోరుకుంటారు. కానీ ‘పెద్ది’ టీం ఆ పని చేయలేకపోయింది. ఏప్రిల్ 30న రిలీజ్ అంటే రెహమాన్ తన పని పూర్తి చేసేవాడా కాదా అన్నది అనుమానమే. కానీ రెహమాన్ వైపు వర్క్ పూర్తయినా.. ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30కి రెడీ అయ్యేది కాదన్నది స్పష్టం.
ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్ వర్క్ చాలా పెండింగ్ ఉంది. సినిమాలో కీలక సన్నివేశాలకు సంబంధించి ఆ పని సమయానికి పూర్తి కాదనే ముందుగా వాయిదా ఆలోచన చేశారు. ఆ పని పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ అవగొట్టి, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ చేసి సినిమాను రిలీజ్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉండడంతోనే వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు.
ఆలస్యానికి రెహమాన్ కూడా ఒక కారణం అయితే కావచ్చు కానీ.. ఆయనే కారణం అన్నది మాత్రం వాస్తవం కాదు. కానీ తమ మీద వ్యతిరేకత రాకుండా.. బుచ్చిబాబు అండ్ టీం హమాన్ మీదికి నెపాన్ని నెట్టేసి తాము సేఫ్ అయిపోవాలని చూస్తోందా అనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.
This post was last modified on April 18, 2026 9:37 am
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…