అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా పూజలు అందుకునే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి పట్ల భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. అయితే, తాజాగా తిరుమల శ్రీవారి భక్తులు వ్యవహరిస్తున్న తీరు పట్ల దేవస్థానం అధికారులు, అదేవిధంగా పాలకమండలి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.
శ్రీవారి భక్తులు హుండీలలో సమర్పించే కానుకల విషయంలో పాలకమండలి అదేవిధంగా అధికారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితితో పాటు భక్తులను అనుమానించే దుస్థితి కూడా ఏర్పడిందని చెబుతున్నారు.
దీనికి ప్రధాన కారణం, కేంద్ర ప్రభుత్వం 2015 -16 మధ్య రద్దు చేసిన 500, వెయ్యి రూపాయల నోట్లను సమర్పించడంతోపాటు గత రెండేళ్ల కిందట రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లను కూడా ఇప్పటికీ హుండీలలో భక్తులు సమర్పిస్తున్నారు. ఈ విధానం సరికాదనేది టీటీడీ పాలకమండలితో పాటు అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అటు పైకి చెప్పలేక, ఇటు ఈ విషయాన్ని సర్దుబాటు చేసుకోలేక నానా ప్రయాస పడుతున్నారు. టిటిడి అధికారిక లెక్కల ప్రకారం రద్దుచేసిన 500, వెయ్యి రూపాయల నోట్లు ఏకంగా 400 వందల కోట్ల రూపాయల పైబడి టిటిడి ఖజానాలో మూలుగుతున్నాయి.
వీటిని తీసుకునేందుకు అటు బ్యాంకులు మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత నోట్లను భద్రపరిచేందుకు నెల నెల తిరుమల తిరుపతి దేవస్థానం రెండు లక్షల రూపాయలను ఖర్చు చేస్తోంది.
మరోవైపు రెండు సంవత్సరాల కిందట రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లును ఇప్పటికీ భక్తులు హుండీలలో సమర్పిస్తున్నారు. వీటి విలువ ప్రతి నెల 30 నుంచి 50 లక్షల రూపాయల మధ్య ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ నోట్లను కూడా బ్యాంకులు తీసుకోవడం లేదని తద్వారా వాటిని కూడా భద్రపరచాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి పట్ల భక్తి ప్రభత్రులను చాటుకోవాలి తప్ప కానుకల హుండీని తమకు అనుకూలంగా మలుచుకోవద్దని సూచిస్తున్నారు.
తమ అవసరాలు తీర్చుకునేందుకు వినియోగించుకోరాదని పాలకమండలి విజ్ఞప్తి చేస్తోంది. స్వామి పట్ల భక్తి ఉన్నవారుఎవరూ ఇలా చేయరని.. పేర్కొంది. ఈ విషయంలో భక్తులు ఆలోచన చేయాలని పాలక మండలి సహా అధికారులు చెబుతున్నారు.
This post was last modified on April 10, 2026 7:46 am
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…
మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…