Trends

శ్రీవారి భ‌క్తులూ… ఇదేనా స్వామిపై మీ భ‌క్తి?

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా పూజలు అందుకునే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు అనేక వ్యయ‌ ప్రయాసలకు ఓర్చుకుని తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి పట్ల భక్తి ప్రప‌త్తులను చాటుకుంటారు. అయితే, తాజాగా తిరుమల శ్రీవారి భక్తులు వ్యవహరిస్తున్న తీరు పట్ల దేవస్థానం అధికారులు, అదేవిధంగా పాలకమండలి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

శ్రీవారి భక్తులు హుండీలలో సమర్పించే కానుకల విషయంలో పాలకమండలి అదేవిధంగా అధికారులు కూడా ఇబ్బందులు పడే పరిస్థితితో పాటు భక్తులను అనుమానించే దుస్థితి కూడా ఏర్పడిందని చెబుతున్నారు.

దీనికి ప్రధాన కారణం, కేంద్ర ప్రభుత్వం 2015 -16 మధ్య రద్దు చేసిన 500, వెయ్యి రూపాయల నోట్లను సమర్పించడంతోపాటు గత రెండేళ్ల కిందట రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లను కూడా ఇప్పటికీ హుండీల‌లో భక్తులు సమర్పిస్తున్నారు. ఈ విధానం సరికాదనేది టీటీడీ పాలకమండలితో పాటు అధికారులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటు పైకి చెప్పలేక, ఇటు ఈ విషయాన్ని సర్దుబాటు చేసుకోలేక నానా ప్రయాస పడుతున్నారు. టిటిడి అధికారిక లెక్కల ప్రకారం రద్దుచేసిన 500, వెయ్యి రూపాయల నోట్లు ఏకంగా 400 వందల కోట్ల రూపాయల పైబడి టిటిడి ఖజానాలో మూలుగుతున్నాయి.

వీటిని తీసుకునేందుకు అటు బ్యాంకులు మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన పాత నోట్లను భద్రపరిచేందుకు నెల నెల తిరుమల తిరుపతి దేవస్థానం రెండు లక్షల రూపాయలను ఖర్చు చేస్తోంది.

మరోవైపు రెండు సంవత్సరాల కిందట రద్దు చేసిన రెండు వేల రూపాయల నోట్లును ఇప్పటికీ భక్తులు హుండీలలో సమర్పిస్తున్నారు. వీటి విలువ ప్రతి నెల 30 నుంచి 50 లక్షల రూపాయల మధ్య ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ నోట్లను కూడా బ్యాంకులు తీసుకోవడం లేదని తద్వారా వాటిని కూడా భద్రపరచాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు స్వామి పట్ల భక్తి ప్రభత్రులను చాటుకోవాలి తప్ప కానుకల హుండీని తమకు అనుకూలంగా మలుచుకోవ‌ద్ద‌ని సూచిస్తున్నారు.

తమ అవసరాలు తీర్చుకునేందుకు వినియోగించుకోరాదని పాలకమండలి విజ్ఞప్తి చేస్తోంది. స్వామి ప‌ట్ల భ‌క్తి ఉన్న‌వారుఎవ‌రూ ఇలా చేయ‌ర‌ని.. పేర్కొంది. ఈ విష‌యంలో భ‌క్తులు ఆలోచ‌న చేయాల‌ని పాల‌క మండ‌లి స‌హా అధికారులు చెబుతున్నారు.

Kumar

Recent Posts

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

2 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

3 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

5 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

5 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

7 hours ago

రవితేజ సేఫ్ గేమ్ ఆడతారా

మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…

7 hours ago