తాను హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ను 2024 సంవత్సరానికి ఉత్తమ ప్రాంతీయ తమిళ చిత్రంగా జాతీయ అవార్డుల జ్యూరీ ఎంపిక చేయడంపై వస్తున్న విమర్శలను తిప్పి కొడుతూ తమిళ స్టార్ ధనుష్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తనకు గతంలో నేషనల్ అవార్డులు రావాల్సినపుడు రాలేదని, అప్పుడు ఎవ్వరూ మద్దతుగా మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం విమర్శిస్తున్నారంటూ చేసిన వాదన మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఐతే జాతీయ అవార్డు విషయంలో ఈ స్టార్ హీరో చేసిన వ్యాఖ్యల సంగతి పక్కన పెడితే.. అతను ఏ కార్యక్రమంలో ఇలా మాట్లాడాడు, అసలక్కడ ఏం జరిగింది, ధనుష్ ఇంకా అక్కడ ఎలాంటి కామెంట్స్ చేశాడు అన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ధనుష్ తన అభిమానులతో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చాలా భారీగా హాజరైన అభిమానులతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వందల మంది అభిమానులు స్టేజ్ మీదికి రావడం.. ధనుష్కు పాదాభివందనాలు చేయడం, అతను వారిని ఆశీర్వదించడం విశేషం.
ఇక ధనుష్ మాట్లాడుతూ.. ఇక్కడికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారని, ఇలాంటి ఆకమత్యానికి ఒక శక్తి ఉందని.. దీనికి ఒక ప్రయోజనం ఉండాలని వ్యాఖ్యానించాడు. కేవలం ఆడియో వేడుకలు, కలయికలతో సరిపెట్టకుండా అందరూ కలిసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని ధనుష్ పిలుపునిచ్చాడు.
మీ మీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు, చుట్టు పక్కల కుటుంబాలకు సాయపడాలని.. మిమ్మల్ని చూసి నేను గౌరవించాలని ధనుష్ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, అభిమానులకు ఇచ్చిన సందేశాన్ని బట్టి చూస్తే.. మరో తమిళ హీరో రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. విజయ్ కూడా ఇలా అభిమానులను మొబిలైజ్ చేసి ముందుగా సేవా కార్యక్రమాలు చేయించి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఇతను కూడా ఆ బాటలోనే సాగుతున్నట్లు కనిపిస్తోంది.
This post was last modified on July 27, 2026 10:21 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…