Trends

మ్యాచ్ ఫిక్సింగ్ రచ్చ మొదలు

​ఐపీఎల్ 2026 సీజన్ సగం కూడా పూర్తికాకముందే సోషల్ మీడియాలో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అనే పదం గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయకపోవడం, ఆపై కుల్దీప్ రనౌట్ అవ్వడం తీవ్ర చర్చకు దారితీసింది. కుల్దీప్ రనౌట్ విజువల్స్ సరిగ్గా చూపించలేదని కొందరు, గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా పాడు చేసుకున్నారని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ గందరగోళం వెనుక అసలు కారణం క్రికెట్ మీద ప్రేమ కంటే.. ఆ మ్యాచ్‌పై కాసిన ‘బెట్టింగ్’ కష్టాల్లోకి నెట్టేస్తోందన్నది చేదు నిజం. ఢిల్లీ లైనప్ చూసి అది ఈజీ విక్టరీ అని బెట్టింగ్ కాసిన వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు.

​కేవలం ఢిల్లీ మ్యాచ్ మాత్రమే కాదు, మొన్నటి ముంబై వర్సెస్ రాజస్థాన్ పోరు కూడా బెట్టింగ్ రాయుళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ముంబై తన పవర్‌ఫుల్ బ్యాటింగ్ లైనప్‌తో రాజస్థాన్ కుర్రాళ్లను ఈజీగా ఓడిస్తుందని చాలామంది ముంబైపై భారీగా బెట్స్ వేశారు. కానీ సీన్ కట్ చేస్తే.. అనుభవం లేని వైభవ్, జైస్వాల్ లాంటి కుర్రాళ్లు ముంబై దిగ్గజాలనే వణికించారు. క్రికెట్ అనేది అంచనాలకు అందని ఆట అని ఈ రెండు మ్యాచ్‌లు నిరూపించాయి. బెట్టింగ్ అనేది ఒక తెలివైన స్ట్రాటజీ అని భ్రమపడే వారికి ఈ ఫలితాలు ఒక గుణపాఠమే. చివరి బంతి వరకు ఏం జరుగుతుందో తెలియని ఆటలో డబ్బులు పణంగా పెట్టడం అంటే ఆత్మహత్యతో సమానం.

​ప్రభుత్వం ఎన్ని బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేసినా, పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నా.. ఏదో ఒక రూపంలో ఈ దందా కొనసాగుతూనే ఉంది. ఇల్లీగల్ వెబ్‌సైట్లు యథేచ్ఛగా నడుస్తూ యువతను ఆకర్షిస్తున్నాయి. ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయిపోవచ్చనే ఆశతో వేల రూపాయలు తగలేస్తూ, అప్పుల పాలై ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఐపీఎల్ అనేది ఒక ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే, కానీ దాన్ని ఒక జూదంలా మార్చుకోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లలో జరిగిన అనూహ్య పరిణామాలను గమనిస్తే.. బెట్టింగ్ అనేది ఎంత డేంజర్ అనేది స్పష్టమవుతోంది.

​నిజానికి మైదానంలో ఆటగాళ్లు తమ శాయశక్తులా పోరాడుతుంటారు. కానీ బెట్టింగ్ ఓడిపోయిన వారు దాన్ని ‘ఫిక్సింగ్’ అని ముద్ర వేసి తమ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తుంటారు. డేవిడ్ మిల్లర్ సింగిల్ తీయకపోవడం వెనుక అతని సొంత స్ట్రాటజీ ఉండవచ్చు, కానీ దాన్ని బెట్టింగ్ కోణంలో చూసినప్పుడు అది అనుమానాస్పదంగా కనిపిస్తుంది. యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఈ ఇల్లీగల్ సైట్లు మిమ్మల్ని గెలిపించడానికి లేవు, మీ జేబులు ఖాళీ చేయడానికే ఉన్నాయి. గెలుపు ఎవరిదో తెలియని అనిశ్చితిలో కష్టార్జితాన్ని పణంగా పెట్టడం ఏమాత్రం క్షేమకరం కాదు.

This post was last modified on April 9, 2026 11:05 am

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

6 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago