Trends

భూపరిహారంతో హెలికాఫ్టర్ కొంటున్న రైతు

ఊహకు అందని పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఒక ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోవటం.. దానికి పరిహారంగా వచ్చే డబ్బుల విషయంలో రైతులు సంత్రప్తిగా ఉండటం కనిపించదు. అందుకు భిన్నంగా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న భూములకు పరిహారంగా ఇస్తున్న మొత్తం భారీగా ఉండటమే కాదు.. వారి పరిస్థితులు ఇప్పుడు అంచనాలకు అందని రీతిలో ఉంటాయన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ప్రముఖ జాతీయ మీడియా సంస్థ పబ్లిష్ చేసిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే.. భూపరిహారం కింద ఒక రైతుకు అందుతున్న మొత్తం అక్షరాల రూ.15 కోట్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు.

కట్ చేస్తే.. ఇంత భారీగా పరిహారం అందుతున్న రైతు ఆ మొత్తాన్ని ఏం చేద్దామనుకుంటున్నాడు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. దిమ్మ తిరిగే షాకింగ్ మాట సదరు రైతు నుంచి వస్తుందని చెబుతన్నారు. ఇంతకూ ఆ రైతు కొనాలని ప్లాన్ చేస్తున్న వస్తువ మరేమిటో కాదు.. ఏకంగా ఒక హెలికాఫ్టర్. అవును.. తనకు వచ్చే భారీ మొత్తంతో ఒక హెలికప్టర్ ను కొనుగోలు చేయటమే కాదు.. తన మిత్రులతో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇంతకూ ఏ ప్రాజెక్టులో భాగంగా ఇంత భారీగా భూపరిహారం లభిస్తోంది? అదెక్కడ ఉంది? లాంటి అంశాల్లోకి వెళితే..

జేవార్ లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ మొదటి దశను తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభింరారు. ఉత్తరప్రదేవ్ కు ఒక మైలురాయిగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టు కోసం సేకరిస్తున్న భూములకు భారీగా పరిహారం అందినట్లుగా చెబుతున్నారు. దీంతో.. రాత్రికి రాత్రి యూపీ రైతులు పలువురు కోటీశ్వరులుగా మారటమే కాదు.. వారు కలలో కూడా ఊహించనంత భారీ మొత్తాలు వారికి పరిహారం రూపంలో లభించినట్లుగా చెబుతున్నారు. ఈ ఎయిర్ పోర్టు ప్రాజెక్టుతో అక్కడి గ్రామీణ ముఖచిత్రం పూర్తిగా మారుతుందని చెబుతున్నారు.

అనేక కుటుంబాల ఆర్థికస్థితిగతులు పూర్తిగా మారిపోవటం ఖాయమంటున్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణం నేపథ్యంలో పెద్ద ఎత్తున శ్రామికశక్తి అవసరం కావటంతో.. కొత్త ఉపాధి అవకాశాల జోరు భారీగా ఉంది. దీంతో అందుతున్న ఆదాయం విలాసవంతమైన వాటి కోసం ఖర్చు చేయాలన్న ఆలోచనను కొందరు చెప్పటం గమనార్హం. అయితే.. భూ పరిహారం పేరుతో దక్కే డబ్బులను వీలైనంత వరకు పెట్టుబడులుగా పెట్టాలే తప్పించి.. విలాసవంతమైన ఖర్చులకు పెడితే.. తర్వాతి కాలంలో చింతించాల్సి వస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Kumar

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

2 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

2 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

4 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

4 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

5 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

5 hours ago