ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తన పాత బలహీనతలను మళ్ళీ బయటపెట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన తొలి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. లక్ష్యం భారీగానే ఉన్నట్లు అనిపించినా, బెంగళూరు బ్యాటర్ల జోరు ముందు అది ఏమాత్రం సరిపోలేదు. ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ ఒక్కడే 38 బంతుల్లో 80 పరుగులు (8 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. చివర్లో అనికేత్ వర్మ 18 బంతుల్లో 43 పరుగులతో మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ స్కోరు 200 దాటింది. అయితే స్టార్ ఓపెనర్లైన ట్రావిస్ హెడ్ (11), అభిషేక్ శర్మ (7) విఫలం కావడం జట్టును దెబ్బతీసింది. నితీష్ కుమార్ రెడ్డి (1) కూడా ఆకట్టుకోలేకపోయాడు. హెన్రిచ్ క్లాసెన్ (31) కాసేపు నిలకడగా ఆడినా భారీ స్కోరు చేయలేకపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ తలో మూడు వికెట్లతో హైదరాబాద్ నడ్డి విరిచారు.
హైదరాబాద్ బౌలింగ్ విభాగం ఈసారి కూడా అత్యంత బలహీనంగా కనిపించింది. బెంగళూరు చిన్న గ్రౌండ్ కావడం ఆర్సీబీ బ్యాటర్లకు వరంగా మారింది. విరాట్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపం చూపిస్తూ 38 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా దేవదత్ పడిక్కల్ 26 బంతుల్లోనే 61 పరుగులు చేసి ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. రజత్ పాటిదార్ (31) కూడా వేగంగా ఆడటంతో మ్యాచ్ హైదరాబాద్ చేతుల్లోంచి నిమిషాల్లో జారిపోయింది.
ఫీల్డింగ్ విషయంలో హైదరాబాద్ ఆటతీరు మరీ దారుణంగా ఉంది. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ చేయడం ఆర్సీబీకి కలిసొచ్చింది. ముఖ్యంగా కోహ్లీ వంటి ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. బౌలర్లలో ఈషాన్ మలింగ 2 ఓవర్లలో 35 పరుగులు ఇవ్వగా, హర్షల్ పటేల్ 2.4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్లు తీయడంలోనే కాకుండా, పరుగులు నియంత్రించడంలో కూడా ఎస్ఆర్హెచ్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.
This post was last modified on March 29, 2026 12:00 am
సంక్రాంతికి విడుదల కావాల్సిన జన నాయకుడు వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కాక అభిమానులు నిన్నా మొన్నటి…
వైసీపీ తరఫున తరచుగా మీడియా ముందుకు వచ్చే మాజీ మంత్రి పేర్నినాని.. అమరావతి రాజధానిపై మళ్లీ పాత రికార్డే వినిపించారు.…
కొత్త సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే రిలీజయ్యాయి కానీ ఆ స్థాయిలో థియేటర్లలో జనాలు లేక బయ్యర్ల టెన్షన్ కొనసాగుతోంది. 'బ్యాండ్…
నవ్యాంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతే కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలంటూ కూటమి సర్కారు ప్రవేశపెట్టిన…
ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకు చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి తిరిగి బయటికి వచ్చేది పవన్ కళ్యాణ్…
సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే పై ప్రశ్నకు ఔననే సమాధానం వస్తుంది. లెనిన్ కొత్త విడుదల తేదీని జూన్ 26కి…