Trends

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి వడ్డించిన పెరుగులో పురుగులు కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ తక్షణమే స్పందించింది. ఆహార నాణ్యత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC)కి రూ. 10 లక్షల జరిమానా విధించడమే కాకుండా, సదరు సర్వీస్ ప్రొవైడర్‌కు రూ. 50 లక్షల భారీ పెనాల్టీ వేసింది.

రితేష్ కుమార్ సింగ్ అనే ప్రయాణికుడు మార్చి 15న ఈ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తనకు వడ్డించిన భోజనంలో పురుగులను గుర్తించారు. వెంటనే తన మొబైల్ ఫోన్‌లో పెరుగు గిన్నెలో పురుగులు కదులుతున్న దృశ్యాలను రికార్డ్ చేశారు. అక్కడే ఉన్న ట్రైన్ మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు, అధికారులు వచ్చి తనిఖీ చేస్తున్న దృశ్యాలను కూడా వీడియో తీశారు. ఇతర ప్రయాణికులు కూడా అక్కడికి చేరుకుని అధికారులను నిలదీయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో చర్చకు దారితీయడంతో రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. ప్రయాణికుల భద్రత, ఆహార నాణ్యత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని స్పష్టం చేసింది. నాసిరకం భోజనాన్ని అందించిన సదరు సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్ట్‌ను తక్షణమే రద్దు చేయాలని ఆదేశించింది. భారీ జరిమానాలు విధించడం ద్వారా ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా కఠిన సంకేతాలను పంపింది.

వందే భారత్ లాంటి ప్రతిష్టాత్మక రైళ్లలో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి చోట కూడా ఇలాంటి అశుభ్రమైన ఆహారం వడ్డించడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తనిఖీ సమయంలో కూడా పురుగులు స్పష్టంగా కనిపిస్తుండటంతో కేటరింగ్ విభాగానికి బాధ్యత లేదనే విమర్శలు వస్తున్నాయి. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు.

దీంతో అతన్ని అందరూ అపరిచితుడు సినిమాలోని రామానుజం పాత్రతో పోలుస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటువంటి సంధర్భాల్లో మనకెందుకులే అని వదిలేసే ఈరోజుల్లో ఇంత పట్టుతో రైల్వే శాఖను కదిలించాడని మెచ్చుకుంటున్నారు.

Kumar

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

30 minutes ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

2 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

3 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

4 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

5 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

6 hours ago