పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ గత వారం విడుదల కావాల్సిన ‘టాక్సిక్’ మూవీ వాయిదా పడిందని.. ఆ వారంలో ఉగాది, రంజాన్ పండుగలు ఉన్నాయని టెంప్ట్ అయి విడుదలను ఒక వారం ముందుకు జరిపారు. కానీ ‘దురంధర్: ది రివెంజ్’ నుంచి వచ్చే ముప్పును టీం పసిగట్టలేకపోయింది.
హిందీ సినిమా కదా అని దాన్ని తక్కువ అంచనా వేసింది. ఫలితంగా సినిమాకు గట్టి దెబ్బే తగిలింది. ఓవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ఆశించిన టాక్ రాలేదు. మరోవైపు ‘దురంధర్-2’కు టాక్ అదిరిపోయింది. ఫలితంగా ‘ఉస్తాద్’ మీద ప్రతికూల ప్రభావం గట్టిగానే పడింది. వీకెండ్ వరకు వసూళ్లు ఓకే కానీ.. తర్వాత సినిమా చల్లబడిపోయింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు బాగా పడిపోయాయి. సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేసింది.
ఐతే ఈ వీకెండ్లో పెద్ద రిలీజ్లు లేకపోవడం ‘ఉస్తాద్’కు కలిసొచ్చే విషయం. ‘కోర్టు’ జంట నటించిన ‘బ్యాండ్ మేళం’ అనే చిన్న సినిమా ఒకటి రిలీజవుతోంది. దీంతో పాటు డబ్బింగ్ సినిమాలు యూత్, హ్యాపీ రాజ్ వస్తున్నాయి. ఇవి ఏమేర ప్రభావం చూపుతాయన్నది సందేహమే. శుక్రవారం శ్రీరామనవమి సెలవు ఉంది. తర్వాతి రెండు రోజులు వీకెండ్. ఇది బాక్సాఫీస్ పరంగా బాగా కలిసొచ్చే విషయం.
వీక్ డేస్లో ఎంత వీక్ అయినప్పటికీ.. ఈ మూడు రోజులు మంచి వసూళ్లు రాబట్టడానికి ‘ఉస్తాద్’కు అవకాశం ఉంది. కొత్త సినిమాలను మించి దీన్నే తెలుగు ప్రేక్షకులు ప్రిఫర్ చేసే అవకాశముంది. కాబట్టి ‘ఉస్తాద్’ రన్ అయిపోయినట్లు కాదు. ఒక రకంగా ఇది ఆ సినిమాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
బయ్యర్లు ఆల్రెడీ నష్టాలకు రెడీ అయిపోయారు. కానీ నష్టాల శాతం ఎంత మేర తగ్గుతుందో ఈ వీకెండ్ నిర్ణయిస్తుంది. సోమవారం నుంచి మాత్రం వసూళ్లు ఆశించడానికి ఉండదు. ఈ ఆదివారంతో రన్ దాదాపు ముగిసినట్లే. ఈలోపు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేయగలుగుతుందో చూడాలి.
This post was last modified on March 26, 2026 3:05 pm
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…