పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ గత వారం విడుదల కావాల్సిన ‘టాక్సిక్’ మూవీ వాయిదా పడిందని.. ఆ వారంలో ఉగాది, రంజాన్ పండుగలు ఉన్నాయని టెంప్ట్ అయి విడుదలను ఒక వారం ముందుకు జరిపారు. కానీ ‘దురంధర్: ది రివెంజ్’ నుంచి వచ్చే ముప్పును టీం పసిగట్టలేకపోయింది.
హిందీ సినిమా కదా అని దాన్ని తక్కువ అంచనా వేసింది. ఫలితంగా సినిమాకు గట్టి దెబ్బే తగిలింది. ఓవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు ఆశించిన టాక్ రాలేదు. మరోవైపు ‘దురంధర్-2’కు టాక్ అదిరిపోయింది. ఫలితంగా ‘ఉస్తాద్’ మీద ప్రతికూల ప్రభావం గట్టిగానే పడింది. వీకెండ్ వరకు వసూళ్లు ఓకే కానీ.. తర్వాత సినిమా చల్లబడిపోయింది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు బాగా పడిపోయాయి. సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేసింది.
ఐతే ఈ వీకెండ్లో పెద్ద రిలీజ్లు లేకపోవడం ‘ఉస్తాద్’కు కలిసొచ్చే విషయం. ‘కోర్టు’ జంట నటించిన ‘బ్యాండ్ మేళం’ అనే చిన్న సినిమా ఒకటి రిలీజవుతోంది. దీంతో పాటు డబ్బింగ్ సినిమాలు యూత్, హ్యాపీ రాజ్ వస్తున్నాయి. ఇవి ఏమేర ప్రభావం చూపుతాయన్నది సందేహమే. శుక్రవారం శ్రీరామనవమి సెలవు ఉంది. తర్వాతి రెండు రోజులు వీకెండ్. ఇది బాక్సాఫీస్ పరంగా బాగా కలిసొచ్చే విషయం.
వీక్ డేస్లో ఎంత వీక్ అయినప్పటికీ.. ఈ మూడు రోజులు మంచి వసూళ్లు రాబట్టడానికి ‘ఉస్తాద్’కు అవకాశం ఉంది. కొత్త సినిమాలను మించి దీన్నే తెలుగు ప్రేక్షకులు ప్రిఫర్ చేసే అవకాశముంది. కాబట్టి ‘ఉస్తాద్’ రన్ అయిపోయినట్లు కాదు. ఒక రకంగా ఇది ఆ సినిమాకు లాస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు.
బయ్యర్లు ఆల్రెడీ నష్టాలకు రెడీ అయిపోయారు. కానీ నష్టాల శాతం ఎంత మేర తగ్గుతుందో ఈ వీకెండ్ నిర్ణయిస్తుంది. సోమవారం నుంచి మాత్రం వసూళ్లు ఆశించడానికి ఉండదు. ఈ ఆదివారంతో రన్ దాదాపు ముగిసినట్లే. ఈలోపు ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేయగలుగుతుందో చూడాలి.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…