Trends

విజయవాడలో కలకలం.. ఉగ్ర భావజాల నెట్‌వర్క్ బహిర్గతం

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉగ్ర భావజాల కార్యకలాపాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో ఒక గుప్త గ్రూపును ఏర్పాటు చేసి, యువతలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) గుర్తించింది.

జిహాద్ కోసం యువతను సిద్ధం చేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా దర్యాప్తులో తేలింది. దర్యాప్తు ప్రకారం, ఈ ముగ్గురు నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ , ఐసిస్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో ‘గజ్వా-ఏ-హింద్’ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

దేశంలోని పలు రాష్ట్రాలకు వీరి నెట్‌వర్క్ విస్తరించినట్లు కూడా తేలింది. అంతేకాకుండా, ఉగ్రవాద శిక్షణ కోసం త్వరలోనే పాకిస్థాన్‌కు వెళ్లే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు గుర్తించారు. సోమవారం విజయవాడలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడలో ఓలా, ర్యాపిడో బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రహమతుల్లా, అంతర్జాతీయ ఉగ్రవాద నేతల విద్వేషపూరిత వీడియోలను చూస్తూ తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద సంస్థల ఖాతాలను అనుసరించడమే కాకుండా, సంబంధిత వీడియోలను పంచుకుంటూ ప్రచారం సాగించాడు.

భవానీపురానికి చెందిన మహమ్మద్ దానిష్, మహంతిపురానికి చెందిన మీర్జా సొహైల్ బేగ్‌లతో కలిసి ఈ కార్యకలాపాలను విస్తరించాడు. విదేశీ హ్యాండ్లర్ ‘అల్-హకీం షుకూర్’తో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకుని, అతని సూచనల మేరకు బిహార్‌కు చెందిన షాద్మన్ దిల్కుష్, హైదరాబాద్‌కు చెందిన సైదా బేగంతో సంబంధాలు నెలకొల్పాడు.

అనంతరం ‘బెన్‌ఎక్స్ కామ్’ గ్రూప్ ద్వారా ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న అజ్మానుల్లా ఖాన్ (బిహార్), లక్కీ అహ్మద్ (దిల్లీ), మీర్ ఆసిఫ్ అలీ (పశ్చిమబెంగాల్), జీషాన్ (రాజస్థాన్), అబ్దుల్ సలామ్ (కర్ణాటక), షారుక్ ఖాన్, షియాక్ ఫియాజ్ ఉర్ రెహ్మాన్ (మహారాష్ట్ర) తదితరులతో సంబంధాలు పెంచుకున్నట్లు తేలింది.

సామాజిక మాధ్యమాల్లో మాస్కులు ధరించి ‘ముజాహిదీన్లు’గా ప్రకటించుకుంటూ పోస్టులు పెట్టిన వీరు, ఒసామా బిన్ లాడెన్ వీడియోలను అనుకరిస్తూ వేషధారణ, ప్రవర్తనలో మార్పులు సాధన చేసినట్లు గుర్తించారు. జాతీయ చిహ్నాలను అవమానిస్తూ, ఐసిస్‌కు మద్దతుగా ప్రచారం చేయడం, ఇతర మతాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.

భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న లక్ష్యంతో యువతను తీవ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ప్రభావితం చేసి, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ వంటి దేశాలకు పంపించి మిలిటెంట్ శిక్షణ పొందేలా ప్రేరేపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

This post was last modified on March 25, 2026 9:58 am

Share
Show comments
Published by
Kumar
Tags: VIjayawada

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

54 minutes ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

2 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

2 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago