Trends

విజయవాడలో కలకలం.. ఉగ్ర భావజాల నెట్‌వర్క్ బహిర్గతం

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో ఉగ్ర భావజాల కార్యకలాపాలపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విజయవాడకు చెందిన ముగ్గురు యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సొహైల్ బేగ్, మహమ్మద్ దానిష్ ‘అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్’ పేరుతో ఒక గుప్త గ్రూపును ఏర్పాటు చేసి, యువతలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం (సీఐ సెల్) గుర్తించింది.

జిహాద్ కోసం యువతను సిద్ధం చేయడమే వీరి ప్రధాన లక్ష్యంగా దర్యాప్తులో తేలింది. దర్యాప్తు ప్రకారం, ఈ ముగ్గురు నిషేధిత ఉగ్రవాద సంస్థలైన అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ , ఐసిస్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్ల మార్గదర్శకత్వంలో ‘గజ్వా-ఏ-హింద్’ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.

దేశంలోని పలు రాష్ట్రాలకు వీరి నెట్‌వర్క్ విస్తరించినట్లు కూడా తేలింది. అంతేకాకుండా, ఉగ్రవాద శిక్షణ కోసం త్వరలోనే పాకిస్థాన్‌కు వెళ్లే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు గుర్తించారు. సోమవారం విజయవాడలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు.

విజయవాడలో ఓలా, ర్యాపిడో బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రహమతుల్లా, అంతర్జాతీయ ఉగ్రవాద నేతల విద్వేషపూరిత వీడియోలను చూస్తూ తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితుడయ్యాడు. సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద సంస్థల ఖాతాలను అనుసరించడమే కాకుండా, సంబంధిత వీడియోలను పంచుకుంటూ ప్రచారం సాగించాడు.

భవానీపురానికి చెందిన మహమ్మద్ దానిష్, మహంతిపురానికి చెందిన మీర్జా సొహైల్ బేగ్‌లతో కలిసి ఈ కార్యకలాపాలను విస్తరించాడు. విదేశీ హ్యాండ్లర్ ‘అల్-హకీం షుకూర్’తో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం పెంచుకుని, అతని సూచనల మేరకు బిహార్‌కు చెందిన షాద్మన్ దిల్కుష్, హైదరాబాద్‌కు చెందిన సైదా బేగంతో సంబంధాలు నెలకొల్పాడు.

అనంతరం ‘బెన్‌ఎక్స్ కామ్’ గ్రూప్ ద్వారా ఐసిస్‌కు అనుబంధంగా ఉన్న అజ్మానుల్లా ఖాన్ (బిహార్), లక్కీ అహ్మద్ (దిల్లీ), మీర్ ఆసిఫ్ అలీ (పశ్చిమబెంగాల్), జీషాన్ (రాజస్థాన్), అబ్దుల్ సలామ్ (కర్ణాటక), షారుక్ ఖాన్, షియాక్ ఫియాజ్ ఉర్ రెహ్మాన్ (మహారాష్ట్ర) తదితరులతో సంబంధాలు పెంచుకున్నట్లు తేలింది.

సామాజిక మాధ్యమాల్లో మాస్కులు ధరించి ‘ముజాహిదీన్లు’గా ప్రకటించుకుంటూ పోస్టులు పెట్టిన వీరు, ఒసామా బిన్ లాడెన్ వీడియోలను అనుకరిస్తూ వేషధారణ, ప్రవర్తనలో మార్పులు సాధన చేసినట్లు గుర్తించారు. జాతీయ చిహ్నాలను అవమానిస్తూ, ఐసిస్‌కు మద్దతుగా ప్రచారం చేయడం, ఇతర మతాలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు.

భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చాలన్న లక్ష్యంతో యువతను తీవ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ప్రభావితం చేసి, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ వంటి దేశాలకు పంపించి మిలిటెంట్ శిక్షణ పొందేలా ప్రేరేపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

This post was last modified on March 25, 2026 9:58 am

Share
Show comments
Published by
Kumar
Tags: VIjayawada

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

44 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

53 minutes ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

5 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

5 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

6 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

6 hours ago