పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అక్కడి అభిమానులకు ఒక చేదు వార్త చెప్పింది. ఈ ఏడాది జరగబోయే పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్లను స్టేడియాలకు వచ్చి చూడటం కుదరదని స్పష్టం చేసింది. దేశంలో నెలకొన్న తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది. మార్చి 26 నుంచి మే 3 వరకు జరిగే ఈ టోర్నీని కేవలం టీవీల్లో మాత్రమే చూసి ఆనందించాలని అభిమానులకు సూచించింది.
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నిల్వలు అట్టడుగుకు చేరుకోవడంతో ఇంధనాన్ని ఆదా చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. వేలాది మంది అభిమానులు ప్రతిరోజూ స్టేడియాలకు రావడం వల్ల భారీగా ఇంధనం ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకే పీసీబీతో చర్చించి, ఈసారి ప్రేక్షకులను అనుమతించకూడదని నిర్ణయించింది.
కేవలం ప్రేక్షకులపై ఆంక్షలు విధించడమే కాకుండా, వేదికల సంఖ్యను కూడా తగ్గించేశారు. గతంలో ఆరు నగరాల్లో జరగాల్సిన మ్యాచ్లను ఇప్పుడు కేవలం లాహోర్, కరాచీలకు మాత్రమే పరిమితం చేశారు. రోజుకు సగటున 30 వేల మంది ప్రేక్షకులు, సిబ్బంది ప్రయాణించడం వల్ల ఇంధన వనరులపై విపరీతమైన భారం పడుతుందని పీసీబీ తన ప్రకటనలో పేర్కొంది. ఖర్చు తగ్గించుకోవడానికి దేశంలో ఇప్పటికే పాఠశాలలకు రెండు వారాల పాటు సెలవులు కూడా ప్రకటించారు.
పాకిస్థాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఆదివారం ఒక్కరోజే హై ఆక్టేన్ ఇంధన ధరలను ఏకంగా 60 శాతం పెంచేశారు. దీనివల్ల నెలకు అదనంగా 900 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి అందాల్సిన 7 బిలియన్ డాలర్ల ప్యాకేజీ గురించి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలను తట్టుకోవడానికి రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
This post was last modified on March 23, 2026 3:11 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…