దాదాపు దశాబ్ద కాలం నుంచి హీరో అల్లు అర్జున్కు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పడట్లేదన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రతి మెగా హీరో సినిమా వేడుకలోనూ పవన్ కోసం అభిమానులు అదే పనిగా నినాదాలు చేస్తుండడంతో ఒళ్లు మండి బన్నీ వారికి చెప్పను బ్రదర్ అని కౌంటర్ ఇవ్వడంతో మొదలైంది ఈ గొడవ.
తర్వాత తర్వాత మెగా గొడుగు నుంచి బయటికి వెళ్లి సొంత ఇమేజ్ కోసం బన్నీ ప్రయత్నం చేయడం.. చిరు, పవన్ల గురించి మాట్లాడ్డం తగ్గించేయడం.. తనకు తాను పెద్ద స్టార్గా ఫీలవడం లాంటి కారణాలు చూపించి పవన్ ఫ్యాన్స్ తన మీద వ్యతిరేకతను మరింత పెంచుకున్నారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. 2024 ఎన్నికల ముంగిట వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా రవి కోసం బన్నీ ప్రచారానికి వెళ్లడంతో ఇరువురి మధ్య గ్యాప్ కాస్తా ఆగాథంగా మారింది. అది ఎంతకీ పూడని విధంగా తయారైంది. ఇప్పుడు బన్నీ పేరెత్తితే పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
ఇలాంటి టైంలో బన్నీ చేసిన పని.. పవన్ అభిమానుల్లో మరింత మంట పుట్టించాడు. నిన్న అతను దురంధర్: ది రివెంజ్ సినిమాను కొనియాడుతూ ఒక పోస్టు పెట్టాడు. బన్నీ ఇలా తనకేదైనా సినిమా నచ్చితే తన అభిప్రాయం చెబుతూ, టీంను కొనియాడుతూ పోస్టు పెట్టడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు దురంధర్-2 పోస్టు పెట్టిన టైమింగే పవన్ అభిమానులకు నచ్చలేదు.
ఎందుకంటే ఈ చిత్రంతో పాటే పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజైంది. ఈ సందర్భంగా చాలామంది టాలీవుడ్ సెలబ్రెటీలు పవన్కు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. అలాగే సెలబ్రెటీల రివ్యూలు కూడా వస్తున్నాయి. కానీ బన్నీ మాత్రం పవన్కు విష్ చేయలేదు. అలాగే ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్నీ చెప్పలేదు. ఇది అతడి ఛాయిస్ అనుకోవచ్చు. కానీ పవన్ అభిమానులు మాత్రం దీన్ని కవ్వింపు చర్యగానే చూస్తున్నారు.
ఎన్నికలప్పుడు వైసీపీ అభ్యర్థి ప్రచారం కోసం వెళ్లడాన్ని దీంతో పోలుస్తున్నారు. పవన్ సినిమాకు పోటీగా ఉన్న చిత్రానికి ఎలివేషన్ ఇస్తూ పోస్టు పెట్టడం కావాలని చేసిన పనే అంటూ అతణ్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఎటాక్ చేస్తున్న వారికి బన్నీ మద్దతుదారులు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. చూస్తుంటే ఈ గొడవ ఎంతకీ తెగేలా లేదు.
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఇప్పటికే పాలక మండలి కూడా రద్దయింది. ప్రత్యేక అధికారి పాలనలోకి…
ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…
ఇటీవల సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. బొద్దింకల పార్టీగా ప్రారంభమై.. ఒక వైపు…
మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.…