దాదాపు దశాబ్ద కాలం నుంచి హీరో అల్లు అర్జున్కు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పడట్లేదన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రతి మెగా హీరో సినిమా వేడుకలోనూ పవన్ కోసం అభిమానులు అదే పనిగా నినాదాలు చేస్తుండడంతో ఒళ్లు మండి బన్నీ వారికి చెప్పను బ్రదర్ అని కౌంటర్ ఇవ్వడంతో మొదలైంది ఈ గొడవ.
తర్వాత తర్వాత మెగా గొడుగు నుంచి బయటికి వెళ్లి సొంత ఇమేజ్ కోసం బన్నీ ప్రయత్నం చేయడం.. చిరు, పవన్ల గురించి మాట్లాడ్డం తగ్గించేయడం.. తనకు తాను పెద్ద స్టార్గా ఫీలవడం లాంటి కారణాలు చూపించి పవన్ ఫ్యాన్స్ తన మీద వ్యతిరేకతను మరింత పెంచుకున్నారు.
ఇవన్నీ ఒకెత్తయితే.. 2024 ఎన్నికల ముంగిట వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పా రవి కోసం బన్నీ ప్రచారానికి వెళ్లడంతో ఇరువురి మధ్య గ్యాప్ కాస్తా ఆగాథంగా మారింది. అది ఎంతకీ పూడని విధంగా తయారైంది. ఇప్పుడు బన్నీ పేరెత్తితే పవన్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
ఇలాంటి టైంలో బన్నీ చేసిన పని.. పవన్ అభిమానుల్లో మరింత మంట పుట్టించాడు. నిన్న అతను దురంధర్: ది రివెంజ్ సినిమాను కొనియాడుతూ ఒక పోస్టు పెట్టాడు. బన్నీ ఇలా తనకేదైనా సినిమా నచ్చితే తన అభిప్రాయం చెబుతూ, టీంను కొనియాడుతూ పోస్టు పెట్టడం కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు దురంధర్-2 పోస్టు పెట్టిన టైమింగే పవన్ అభిమానులకు నచ్చలేదు.
ఎందుకంటే ఈ చిత్రంతో పాటే పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజైంది. ఈ సందర్భంగా చాలామంది టాలీవుడ్ సెలబ్రెటీలు పవన్కు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెట్టారు. అలాగే సెలబ్రెటీల రివ్యూలు కూడా వస్తున్నాయి. కానీ బన్నీ మాత్రం పవన్కు విష్ చేయలేదు. అలాగే ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్నీ చెప్పలేదు. ఇది అతడి ఛాయిస్ అనుకోవచ్చు. కానీ పవన్ అభిమానులు మాత్రం దీన్ని కవ్వింపు చర్యగానే చూస్తున్నారు.
ఎన్నికలప్పుడు వైసీపీ అభ్యర్థి ప్రచారం కోసం వెళ్లడాన్ని దీంతో పోలుస్తున్నారు. పవన్ సినిమాకు పోటీగా ఉన్న చిత్రానికి ఎలివేషన్ ఇస్తూ పోస్టు పెట్టడం కావాలని చేసిన పనే అంటూ అతణ్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలా ఎటాక్ చేస్తున్న వారికి బన్నీ మద్దతుదారులు కూడా గట్టిగానే బదులిస్తున్నారు. చూస్తుంటే ఈ గొడవ ఎంతకీ తెగేలా లేదు.
This post was last modified on March 20, 2026 10:50 am
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ తన పూజ గదిలో ఉన్న బొమ్మలపై సోషల్ మీడియాలో వస్తున్న…
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…