సోషల్ మీడియా యావలో పడిన చాలా మంది యువకులు, యవతులు తమ ప్రాణాలను కూడా బలి చేసుకుంటున్నారన్నది వాస్తవం. ఇలాంటి అనేక సంఘటనలు రోజూ ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. కేవలం లైకులు, వ్యూస్ కోసం యువత తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై అనేక మంది ప్రముఖులు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నారు. కేవలం రీల్స్ కోసమో.. వీడియోల కోసమో.. జీవితాలను బలి చేసుకోవడం సరికాదని చెబుతున్నారు.
తాజాగా జరిగిన ఓఘటనను ప్రస్తావిస్తూ.. హైదరాబాద్ పోలీసు కమిషనర్, సోషల్ మీడియాలో మంచి ఇన్లుఫ్యుయెన్సర్గా పేరు తెచ్చుకున్న సజ్జనార్ కూడా యువతకు మరోసారి కొన్ని సూచనలు చేశారు. లైకులు, రీల్స్ కోసం..లైఫ్ను రిస్క్లో పెట్టుకోవ ద్దని ఆయన మందలించారు.
ఇలాంటి ఘటనలతో కుటుంబాలు.. ఏకాకులు అవుతాయన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు జీవితాంతం కుమిలిపోతారన్న విషయాన్ని రీల్స్ చేస్తున్న యువత గుర్తించాలని సూచించారు. “రీల్స్ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టడం సరికాదు. యువత ఆలోచన చేయాలి.“ అని సజ్జనార్ చెప్పారు. మరి యువత వింటారా? లేదా? అనేది చూడాలి.
“సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని తపన పడే వారికి ఇదో హెచ్చరిక!! నడుస్తున్న రైలుకు వేలాడుతూ చేసే ఈ స్టంట్లు చూస్తుంటే.. ప్రాణం మీద తీపి కంటే, ఫోన్లో వచ్చే లైకుల మీద ఆశ ఎక్కువైపోయినట్టుంది. ఇలాంటి తెలివితక్కువ పనుల వల్ల ఆ యువకుడికి దక్కింది ఏంటి? కేవలం ఆస్పత్రి బెడ్ లేదా అంతిమయాత్రే కదా! మీ పిచ్చి విన్యాసాలకు ప్రాణం పోయే వరకు ఆగుతారా? ఇంట్లో మీ కోసం ఎదురుచూసే వాళ్ల గురించి కనీసం ఒక్కసారైనా ఆలోచించారా? లైకుల కోసం లైఫ్ రిస్క్ చేసేంత పిచ్చి వద్దు. ప్రాణం పోయాక ఆ రీల్స్ ఎవరూ చూడరు.. మీ కుటుంబం మాత్రం జీవితాంతం కన్నీళ్లు పెడుతుంది.“ అని సజ్జనార్ పేర్కొన్నారు.
ఏం జరిగింది?
ఓ యువకుడు కదులుతున్న రైలులో మెట్లపై నిలబడి బయటకు విహరిస్తున్నట్టుగా.. రీల్ చేస్తున్నాడు. రెండు చేతులతో డోర్ రాడ్లను పట్టుకోగా.. బాగా పూర్తిగా వెనక్కి వంగిపోయిన దశలో అతను రీల్ చేస్తున్నాడు. ఇంతలో.. ఓ విద్యుత్ స్తంభం అతనిని బలంగా ఢీకొట్టడంతో..వెంటనే కింద పడిపోయి.. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ వీడియోను సజ్జనార్ తన సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి.. యువతకు హెచ్చరికలు.. సూచనలు చేశారు.
This post was last modified on March 7, 2026 5:10 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…