Political News

2029 ఆయుధాలు రెడీ చేసుకుంటోన్న టీడీపీ – వైసీపీ…!

2029లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్ప‌టి నుంచే ఆయుధాల‌ను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి ప‌దును కూడాపెంచుకుంటున్నాయా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. దీని లో ప్ర‌ధానంగా గ‌త ఎన్నిక‌ల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్గ్‌తో టీడీపీ వైసీపీని ఎలా అయితే.. దెబ్బ కొట్టిందో.. ఇప్పుడు తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారాన్ని కూడా అదే కోణంలో చూస్తోంది. దీనిని వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు.. ప్ర‌జ‌ల మ‌ధ్య చర్చ‌కు ఉంచాల‌న్న‌ది టీడీపీ ప‌క్కా వ్యూహం.

దీనికి తోడు.. తాజాగా బీసీ రిజ‌ర్వేష‌న్ అంశం కూడా.. టీడీపీకి క‌లిసివ‌స్తుంద‌ని నాయ‌కులు చెబుతున్నా రు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతున్న అధికార ప‌క్షంఎమ్మెల్యేలు.. త‌మ‌కు ఆయుధాలు రెడీగా ఉన్నాయ‌ని.. మ‌ళ్లీ విజ‌యం త‌మ‌దేన‌ని చెబుతున్నారు. బీసీల రిజ‌ర్వేష‌న్‌ను కూట‌మి స‌ర్కారు 34 శాతానికి పెంచ‌డం ఖాయం. దీనిపై వైసీపీ యాగీ చేయ‌డ‌మూ ఖాయ‌మ‌నేన‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇలా జ‌రిగితే.. దీనిని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువెళ్లాల‌ని టీడీపీ ప్లాన్ చేసింద‌ని అంటున్నారు.

బీసీ వ్య‌తిరేకి ఎవ‌రు? బీసీల‌కు అనుకూలం ఎవ‌రు అనే చ‌ర్చ‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువ‌చ్చి వైసీపీకి బ‌ల‌మైన షాక్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇక‌, ఇప్ప‌టికే రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకు.. ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో రిజ‌ర్వేష‌న్ ద్వారా వారిని త‌మకు అనుకూలంగా మార్చుకోవాల‌న్న‌దిటీడీపీ వ్యూహం. అదేస మయంలో పెట్టుబ‌డుల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీ ట వేస్తున్న స‌ర్కారు… వైసీపీ హ‌యాంలో పెట్ట‌బడిదారును ఎలా త‌రిమి కొట్టారో.. ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూనే ఉంది. దీనిని మ‌రింత పెంచనున్న‌ట్టు కూడా నాయ‌కులు చెబుతున్నారు.

ఇక‌, మ‌ద్యం కుంభ‌కోణం కేసు వైసీపీని వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఉక్కిరి బిక్కిరి చేయ‌నుంది. ఈ కేసు విచా ర‌ణ ఇంకా స‌గం కూడా పూర్తి కాలేద‌ని.. సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీ వేదిక‌గానే చెప్ప‌డం.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు 3500 కోట్లు తిన్నార‌న్న అధికారుల‌కు కౌంట‌ర్ గా ఇప్పుడు 10 వేల కోట్ల అవినీతి జ‌రిగింద‌ని చెప్ప డం ద్వారా.. వైసీపీని ఇర‌కాటంలో ప‌డేశారు. దీంతో పాటు.. జ‌గ‌న‌న్న ఇళ్ల విష‌యంలో వైసీపీ నాయ‌కులు చేసిన అవినీతిని కూడా ఈ నెల‌లో తెర‌మీదికి తీసుకురానున్నారు. ఇవి… ప్ర‌ధానంగా టీడీపీకి ఎన్నికల అస్త్రాలుగా మార‌నున్నాయ‌న్న‌ది ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్న మాట‌. దీనికి కౌంట‌ర్లు వెతుక్కోవ‌డం.. వైసీపీ వంతు. మ‌రి ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on March 7, 2026 8:17 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago