2029లో జరిగే ఎన్నికలకు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్పటి నుంచే ఆయుధాలను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి పదును కూడాపెంచుకుంటున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. దీని లో ప్రధానంగా గత ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్గ్తో టీడీపీ వైసీపీని ఎలా అయితే.. దెబ్బ కొట్టిందో.. ఇప్పుడు తిరుమల లడ్డూ వ్యవహారాన్ని కూడా అదే కోణంలో చూస్తోంది. దీనిని వచ్చే ఎన్నికల వరకు.. ప్రజల మధ్య చర్చకు ఉంచాలన్నది టీడీపీ పక్కా వ్యూహం.
దీనికి తోడు.. తాజాగా బీసీ రిజర్వేషన్ అంశం కూడా.. టీడీపీకి కలిసివస్తుందని నాయకులు చెబుతున్నా రు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతున్న అధికార పక్షంఎమ్మెల్యేలు.. తమకు ఆయుధాలు రెడీగా ఉన్నాయని.. మళ్లీ విజయం తమదేనని చెబుతున్నారు. బీసీల రిజర్వేషన్ను కూటమి సర్కారు 34 శాతానికి పెంచడం ఖాయం. దీనిపై వైసీపీ యాగీ చేయడమూ ఖాయమనేనని అంచనా వేస్తున్నారు. ఇలా జరిగితే.. దీనిని ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలని టీడీపీ ప్లాన్ చేసిందని అంటున్నారు.
బీసీ వ్యతిరేకి ఎవరు? బీసీలకు అనుకూలం ఎవరు అనే చర్చను ప్రజల మధ్యకు తీసుకువచ్చి వైసీపీకి బలమైన షాక్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, ఇప్పటికే రాష్ట్రంలో బీసీల ఓటు బ్యాంకు.. ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్ ద్వారా వారిని తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదిటీడీపీ వ్యూహం. అదేస మయంలో పెట్టుబడుల కల్పనకు పెద్దపీ ట వేస్తున్న సర్కారు… వైసీపీ హయాంలో పెట్టబడిదారును ఎలా తరిమి కొట్టారో.. ప్రజలకు వివరిస్తూనే ఉంది. దీనిని మరింత పెంచనున్నట్టు కూడా నాయకులు చెబుతున్నారు.
ఇక, మద్యం కుంభకోణం కేసు వైసీపీని వచ్చే ఎన్నికల వరకు ఉక్కిరి బిక్కిరి చేయనుంది. ఈ కేసు విచా రణ ఇంకా సగం కూడా పూర్తి కాలేదని.. సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగానే చెప్పడం.. నిన్న మొన్నటి వరకు 3500 కోట్లు తిన్నారన్న అధికారులకు కౌంటర్ గా ఇప్పుడు 10 వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్ప డం ద్వారా.. వైసీపీని ఇరకాటంలో పడేశారు. దీంతో పాటు.. జగనన్న ఇళ్ల విషయంలో వైసీపీ నాయకులు చేసిన అవినీతిని కూడా ఈ నెలలో తెరమీదికి తీసుకురానున్నారు. ఇవి… ప్రధానంగా టీడీపీకి ఎన్నికల అస్త్రాలుగా మారనున్నాయన్నది ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. దీనికి కౌంటర్లు వెతుక్కోవడం.. వైసీపీ వంతు. మరి ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on March 7, 2026 8:17 am
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…
ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్.…
సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా... లింగ బేధానికి దిక్కే లేకున్నా.. మగ పిల్లలే కావాలి... ఆడపిల్లలు వద్దన్న భావన ఇంకా పూర్తిగా కనుమరుగు కాలేదు. అందుకు నిదర్శనమే…
విలక్షణమైన కథలు ఎంచుకుంటాడని పేరున్న అడివి శేష్ సినిమా వచ్చి చాలా కాలమయ్యింది. హిట్ 2 ది సెకండ్ కేస్…