తడబడుతూ అడుగులు వేస్తూనే.. ఎలాగోలా టీ20 ప్రపంచకప్లో ఫైనల్కు వచ్చేసింది ఇండియన్ టీం. సూపర్-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన తీరు చూస్తే.. ఇండియా సెమీస్కు వస్తుందన్న నమ్మకం కూడా లేకపోయింది. వెస్టిండీస్తో చివరి సూపర్-8 మ్యాచ్లో గెలవడమూ సందేహంగానే కనిపించింది.
కానీ సంజు శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్తో భారత జట్టు గట్టెక్కేసింది. సెమీఫైనల్లో సైతం సంజు మరో మేటి ఇన్నింగ్స్ ఆడాడు. కానీ 254 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా కూడా ఇంగ్లాండ్ అంత తేలిగ్గా ఏమీ లొంగలేదు. ఓటమి భయం కలిగించింది. ఒక దశలో మ్యాచ్ పోయినట్లే అనిపించింది కూడా. కానీ బుమ్రా అద్భుత బౌలింగ్ పుణ్యమా అని భారత్ 7 పరుగుల స్వల్ప తేడాతో నెగ్గి ఫైనల్ చేరింది.
ఐతే ఇప్పటిదాకా వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ ప్రపంచకప్ గెలవని న్యూజిలాండ్తో ఫైనల్, పైగా సొంతగడ్డపై ఆడుతున్నాం కాబట్టి ఈజీగానే కప్పు వచ్చేస్తుందనుకుంటే పొరపాటే.
న్యూజిలాండ్ ప్రతి ప్రపంచకప్లోనూ అండర్ డాగ్ లాగే బరిలోకి దిగుతుంది. కానీ ఎక్కువ సందర్భాల్లో అంచనాలను మించే ఆడుతుంది. ముఖ్యంగా ఇండియాతో ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచుల్లో ఆ జట్టుకు చాలా మంచి రికార్డుంది. 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాను ఓడించే కివీస్ ట్రోఫీ సాధించింది. ఇక 2021లో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో ఇండియాను షాకిచ్చి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.
అంతకంటే ముందు 2019లో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్కు కివీస్ ఇచ్చిన షాక్ను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. చూడ్డానికి మామూలు జట్టులా కనిపిస్తుంది కానీ.. కివీస్ సమష్టి ప్రదర్శనకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే జట్టు.
ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో సూపర్-8 వరకు కివీస్ మామూలుగానే ఆడింది. కానీ సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్గా కనిపించిన దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. 170 లక్ష్యాన్ని 13 ఓవర్లలోపే అలవోకగా ఛేదించిన ఊపుమీద ఆ జట్టు ఉంది. అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న న్యూజిలాండ్ను ఓడించాలంటే ఇండియా ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సిందే. లేదంటే మాత్రం కప్పు మీద ఆశలు నిలవవు.
This post was last modified on March 6, 2026 11:45 am
దురంధర్ 2 రివెంజ్ ఏమైనా వాయిదా పడుతుందేమో, సోలో రిలీజ్ ఎంజాయ్ చేయొచ్చని భావించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉదయం…
టిడిపి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య రేగిన వివాదం ముగిసినట్లేనా? కొలికపూడి శ్రీనివాసరావు, కేశినేని చిన్ని మధ్య నెలకొన్న విభేదాలు సమస్య…
ప్రముఖ ఎన్నారై నాయకుడు, టీడీపీ ఎన్నారై విభాగాల సమన్వయ కర్తగా ఉన్న కోమటి జయరాంకు.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో తెరకెక్కబోయే సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తారనే వార్తలు మొన్నటి దాకా చక్కర్లు…
తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ తరఫున ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే ఎంపీగా ఉన్న జాతీయ…
ఒక బ్రేక్ తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.…