తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతపై ఇప్పటికే చర్చ సాగుతున్న నేపథ్యంలో దీనికి మరింత సెగ పెంచేలా.. గురువారం పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ కొత్త జంట.. తిరుమల శ్రీవారి ఆలయం మహా గోపురం ముందు..ఫొటో , వీడియో షూట్ చేసుకుంది. దీంతో పాటు.. కొందరు యూట్యూబర్లు.. ఇక్కడే రీల్స్ చేశారు. ఈ ఘటనలపై తీవ్ర విమర్శలు రావడంతో తిరుమల తిరుపతి అధికారులు చర్యలు ప్రారంభించారు.
దీంతో పాటు.. వైసీపీ ఎమ్మెల్సీ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ సహచరి దివ్వెల మాధురి మరో బిగ్ బాస్ ఫేమ్.. తనూజలు తిరుమల కొండపై కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. గురువారం తనూజ పుట్టిన రోజు కావడంతో తిరుమల పరిసరాల్లోని ఓ గెస్ట్ హౌస్లో వేడుకలు నిర్వహించారు. అయితే.. తిరుమల పరిసరాల్లో కేకులు కట్ చేయడాన్ని పాలక మండలి గతంలోనే నిషేధించింది. ఇది మన సంస్కృతి కాదని.. విదేశీ సంస్కృతి అని అప్పట్లోనే తెలిపింది.
అయినప్పటికీ.. దివ్వెల మాధురి, తనూజలు పుట్టిన రోజు వేడుకల పేరుతో ఇక్కడ కేక్ కట్ చేశారు. అంతేకాదు.. విదేశీ సంప్రదాయంలో వేడుకలు నిర్వహించారు. దీనిని వీడియోలు తీసి.. సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టు చేశారు. ఈ వ్యవహారం వెలుగు చూడగానే.. అధికారులు హుటాహుటిన స్పందించారు. తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల నిబంధనలు, ఆచారాలకు విరుద్ధంగా విదేశీ సంప్రదాయంలో జరిగిన కార్యక్రమంపై కేసు నమోదు చేశారు.
అయితే.. మాధురి బలవంతంతోనే తాను తిరుమలకు వచ్చానని తనూజ చెప్పినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందగానే తనూజకు ఫోన్ చేశామని.. ఆమె తన ప్రమేయం ఏమీ లేదని.. వాస్తవానికి పుట్టిన రోజు వేడుకను హైదరాబాద్ లో నిర్వహించాలని అనుకున్నట్టు తెలిపారని పోలీసులు చెప్పారు.
కానీ, మాధురి బలవంతంతోనే తాను తిరుమలకు వచ్చినట్టు పేర్కొన్నారని వెల్లడించారు. కేక్ విషయం కూడా తనకు సర్ప్రైజేనని ఆమె చెప్పారని పేర్కొన్నారు. ఇక, మాధురి ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉన్నట్టు తెలిపారు.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…