Trends

యుద్ధ సమయంలోనూ పసిడి ధర ఎలా తగ్గింది?

సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు బంగారం ధరలు ఇంకా పెరుగుతాయని అందరూ భావిస్తారు. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి ఇలాంటి సమయంలో డిమాండ్ పెరిగి, ధరలు వేలల్లో పెరగడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ప్రస్తుత ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల్లో సీన్ రివర్స్ అయ్యింది. ధరలు పెరగకపోగా, స్వల్పంగా తగ్గడం వెనుక ఉన్న అసలు కారణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది భారీ పతనం కాకపోయినా, పెరగాల్సిన సమయంలో తగ్గడమే ఇక్కడ అసలు ట్విస్ట్.

మార్కెట్ లెక్కల ప్రకారం, బుధవారం నాడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,64,510గా ఉంటే, గురువారం ఉదయానికి అది రూ.1,63,530 వద్దకు చేరింది. అంటే దాదాపు రూ.980 మేర ధర తగ్గింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,50,800 నుంచి రూ.1,49,900 కు పడిపోయింది. యుద్ధం జరుగుతున్నప్పుడు వేలల్లో పెరగాల్సిన బంగారం, ఇలా వందల రూపాయల మేర తగ్గడం ఇన్వెస్టర్ల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పు అని అర్ధమవుతుంది.

ఈ వింత పరిణామానికి ప్రధాన కారణం మార్కెట్లో నగదు అవసరం పెరగడమే అనే అభిప్రాయాలు వస్తున్నాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతున్నప్పుడు లేదా అనిశ్చితి నెలకొన్నప్పుడు, పెద్ద మదుపర్లు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మి నగదుగా మార్చుకుంటారు. అత్యవసర పరిస్థితుల్లో బంగారం కంటే చేతిలో డబ్బు ఉండటమే మేలని భావించి అమ్మకాలు పెంచడం వల్ల మార్కెట్లో బంగారం సరఫరా పెరిగి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఇది ఒక రకమైన ‘లిక్విడిటీ క్రైసిస్’ వల్ల జరుగుతున్న మార్పని విశ్లేషకులు చెబుతున్నారు.

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలిస్తే, 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.780 తగ్గి రూ.1,22,650 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి నెలకొన్నప్పుడు ధరలు ఇష్టమొచ్చినట్లు మారుతుంటాయి. పెరగాల్సిన సమయంలో ధరలు తగ్గడం పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చినా, ఇది మార్కెట్లో ఉన్న గందరగోళాన్ని మరోసారి హైలెట్ చేసింది. వేలల్లో పెరిగే బంగారం ఇలా వందల్లో తగ్గడం కూడా ఒక రకంగా గమనించదగ్గ మార్పే.

యుద్ధ వాతావరణం వల్ల గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన మార్గాల కోసం వెతుకుతున్నారు. అంతర్జాతీయ గోల్డ్ మార్కెట్‌లో ధరలు పతనం కావడం దేశీయ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపింది. దీనివల్ల ఎప్పుడూ లేని విధంగా యుద్ధం జరుగుతున్నా పసిడి ధరలు నేలచూపులు చూస్తున్నాయి.

ఇన్వెస్టర్లు తమ గోల్డ్ రిజర్వ్‌లను వదులుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా ఏ స్థాయిలో మార్పులు తీసుకువస్తాయో చూడాలి. కొనేవారికి ఇది మంచి అవకాశంగా అనిపించినా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వస్తున్న ఈ మార్పులు భవిష్యత్తులో ఎటు దారితీస్తాయో చెప్పలేం.

This post was last modified on March 5, 2026 1:22 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

34 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago