తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల మధ్య కూర్చున్న ఒక వ్యక్తిని చూసి బస్టాండ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే అతను మహిళ కాదు, ఒక యువకుడని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బస్టాండ్ ఆవరణలో మహిళల కోసం కేటాయించిన సీట్లలో ఒక వ్యక్తి బుర్ఖా ధరించి కూర్చున్నాడు. అతని నడక, ప్రవర్తనలో తేడా గమనించిన అక్కడి సిబ్బంది అతన్ని నిలదీశారు. అతను ఒక పురుషుడని గుర్తించిన తర్వాత, అసలు ఎందుకు బుర్ఖా వేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
అయితే ఆ యువకుడు మాత్రం దేనికీ సరైన సమాధానం చెప్పకుండా, ఏదో లోకంలో ఉన్నట్లు నవ్వుతూ సమాధానాన్ని దాటవేశాడు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పొందడానికే అతను ఈ వేషం వేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలాంటి వింత వేషధారణతో బస్సు ఎక్కాలని ప్లాన్ చేశాడా అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
పోలీసులు ఎంత అడుగుతున్నా ఆ యువకుడు మాత్రం సూటిగా సమాధానం చెప్పడం లేదు. ఏదో సరదా కోసం చేశాడా లేక నిజంగానే ఫ్రీ బస్ కోసమే ఇలా వేషం మార్చాడా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ వింత వేషధారణ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. కేవలం ఫ్రీ బస్ కోసమే అయితే ఇంత సాహసం చేస్తారా అని కొందరు అంటుంటే, ఇంకేదైనా కారణం ఉందేమోనని మరికొందరు అనుమానిస్తున్నారు.
This post was last modified on February 18, 2026 2:13 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…
ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్లో గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ఒక రోబో డాగ్ ఇప్పుడు పెద్ద వివాదానికి…