Trends

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల మధ్య కూర్చున్న ఒక వ్యక్తిని చూసి బస్టాండ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే అతను మహిళ కాదు, ఒక యువకుడని తేలడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బస్టాండ్ ఆవరణలో మహిళల కోసం కేటాయించిన సీట్లలో ఒక వ్యక్తి బుర్ఖా ధరించి కూర్చున్నాడు. అతని నడక, ప్రవర్తనలో తేడా గమనించిన అక్కడి సిబ్బంది అతన్ని నిలదీశారు. అతను ఒక పురుషుడని గుర్తించిన తర్వాత, అసలు ఎందుకు బుర్ఖా వేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

అయితే ఆ యువకుడు మాత్రం దేనికీ సరైన సమాధానం చెప్పకుండా, ఏదో లోకంలో ఉన్నట్లు నవ్వుతూ సమాధానాన్ని దాటవేశాడు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం పొందడానికే అతను ఈ వేషం వేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ డబ్బులు మిగిల్చుకోవడానికి ఇలాంటి వింత వేషధారణతో బస్సు ఎక్కాలని ప్లాన్ చేశాడా అనే కోణంలో స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

పోలీసులు ఎంత అడుగుతున్నా ఆ యువకుడు మాత్రం సూటిగా సమాధానం చెప్పడం లేదు. ఏదో సరదా కోసం చేశాడా లేక నిజంగానే ఫ్రీ బస్ కోసమే ఇలా వేషం మార్చాడా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.

పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఈ వింత వేషధారణ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం ఫ్రీ బస్ కోసమే అయితే ఇంత సాహసం చేస్తారా అని కొందరు అంటుంటే, ఇంకేదైనా కారణం ఉందేమోనని మరికొందరు అనుమానిస్తున్నారు.

Kumar

Recent Posts

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

14 minutes ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

23 minutes ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

3 hours ago

వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు… మొక్కు చెల్లించుకున్న రైతు

తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…

3 hours ago

బంగారం బుకింగ్స్ ఎందుకు బాగున్నాయి

మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…

3 hours ago

‘రాజురామను టార్చర్ చేసిన వాళ్లకు, ఉగ్రవాదులకు తేడా లేదు’

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్‌, మాజీ ఎంపీ.. ప్ర‌స్తుత ఉండి శాస‌న‌స‌భ్యుడు ర‌ఘురామ‌కృష్ణ‌రాజును క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేసిన కేసులో హైకోర్టు సంచ‌ల‌న…

4 hours ago