ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు, లైట్ బాయ్స్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళను దేవుళ్ళుగా భావించేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఓ సందర్భాల్లో కింద కూర్చుంటే, కొందరు ప్రొడ్యూసర్లు వాళ్ళ ముందే కుర్చీల్లో ఉన్నా ఏమి అనుకోకుండా పరస్పరం సంస్కారం చూపించిన గొప్ప రోజులు ఒకప్పుడు ఉండేవి.
కానీ ఇప్పుడు అలా లేదు. స్టార్లు, డైరెక్టర్లకు భయపడే రోజులు వచ్చాయి. వందల కోట్లు పెడుతున్నా, ఎంత అగ్ర నిర్మాత అయినా సరే వీళ్ళ మాటను జవదాటే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణముంది.
ఇటీవలే ప్రముఖ సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కూర్గ్ లో నిర్మించిన రిసార్ట్, స్పాలను ప్రారంభించేందుకు తెలుగు తమిళ ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వాళ్లలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నారు. ఇందులో పాల్గొన్న దిల్ రాజు కొన్ని చేదు నిజాలు చెప్పారు.
ఒకప్పుడు నిర్మాతలు అందరినీ శాసించే వారని, కానీ ఇప్పుడు డబ్బులు తీసుకున్న వాళ్లే ఇచ్చిన వాళ్ళను శాసించే స్టేజికి వచ్చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు దిల్ హిందీ రీమేక్ హక్కులను ఉచితంగా ఇవ్వాలనుకున్న ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. సింపుల్ గా చెప్పినా ఆయన మాటల్లో నిగూడార్థం ఉంది.
ప్యాన్ ఇండియా మార్కెట్ లో నిర్మాతలు నలిగిపోతున్నారు. కోట్లకు కోట్లు మంచి నీళ్ళలా ఖర్చువుతున్నా అనుకున్న టైంకి సినిమాలు రిలీజ్ చేయలేక, వాటి మీద వడ్డీలు కట్టలేక, వాయిదాలు, కోర్టు కేసులంటూ మాములు నరకం చూడటం లేదు.
ఇంత భరించినా సినిమా ఏ మాత్రం అటుఇటు అయినా మళ్ళీ పెట్టుబడి పుట్టలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎందరో. చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు కనిపిస్తాయి. దిల్ రాజు అన్నట్టు ఒకప్పటి రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుంటుందో. వినడానికి సొంపుగా ఉన్నా ఇప్పుడప్పుడే ఇవన్నీ మారేది కాదు కానీ, హీరోలు, దర్శకుల ఆలోచనా ధోరణి ఎంతో కొంత ఛేంజ్ వస్తే మంచిదే.
వైసీపీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత.. జగన్.. పీఏసీకి…
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…