Political News

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. వీటిలో తెలంగాణకు చెందిన రెండు స్థానాలు ఉన్నాయి. బీఆర్ ఎస్‌కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ముగియనుంది.

ఇక, అసెంబ్లీలో శాసన సభ్యుల సంఖ్య ఆధారంగా జరగనున్న ఈ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్‌కు బలం తక్కువగా ఉన్నందున ఈ రెండు స్థానాలు కూడా అధికార పార్టీ కాంగ్రెస్‌కే దక్కనున్నాయి. అయితే వీటిలో ఎవ‌రిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో బలమైన గళం వినిపించాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో మరోసారి అభిషేక్ మను సింఘ్వీకే అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. పైగా ఈయన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కూడా. దీంతో తరచుగా కాంగ్రెస్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను మరోసారి ప్రోత్సహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే మరో సీటు అంశం ఇప్పుడు దోబూచులాడుతోంది.

ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ సీటును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. పైగా గత ఏడాది జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఆయన పోటీ చేశారు. అయితే ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అప్పట్లోనే ఆయనకు పదవిపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్పట్లో, “సుదర్శన్ రెడ్డి గెలుస్తారా లేదా అనేది మాకు తెలుసు. ఆయనకు బలమైన మద్దతు ఉంటుంది,” అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఖాళీ అయిన సీటును ఆయనకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

This post was last modified on February 18, 2026 1:40 pm

Share

Recent Posts

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

4 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

4 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

5 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

5 hours ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

6 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

7 hours ago