Political News

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. వీటిలో తెలంగాణకు చెందిన రెండు స్థానాలు ఉన్నాయి. బీఆర్ ఎస్‌కు చెందిన కేఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రెస్‌కు చెందిన అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం ముగియనుంది.

ఇక, అసెంబ్లీలో శాసన సభ్యుల సంఖ్య ఆధారంగా జరగనున్న ఈ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ ఎస్‌కు బలం తక్కువగా ఉన్నందున ఈ రెండు స్థానాలు కూడా అధికార పార్టీ కాంగ్రెస్‌కే దక్కనున్నాయి. అయితే వీటిలో ఎవ‌రిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు కీలక చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేంద్ర స్థాయిలో బలమైన గళం వినిపించాల్సిన అవసరం ఉంది.

ఈ నేపథ్యంలో మరోసారి అభిషేక్ మను సింఘ్వీకే అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. పైగా ఈయన ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కూడా. దీంతో తరచుగా కాంగ్రెస్ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను మరోసారి ప్రోత్సహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే మరో సీటు అంశం ఇప్పుడు దోబూచులాడుతోంది.

ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ సీటును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. పైగా గత ఏడాది జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున ఆయన పోటీ చేశారు. అయితే ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి రాజ్యసభ సీటు ఇచ్చే ఆలోచన ఉన్నట్టు సమాచారం. అప్పట్లోనే ఆయనకు పదవిపై హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అప్పట్లో, “సుదర్శన్ రెడ్డి గెలుస్తారా లేదా అనేది మాకు తెలుసు. ఆయనకు బలమైన మద్దతు ఉంటుంది,” అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఖాళీ అయిన సీటును ఆయనకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Satya

Recent Posts

మళ్లీ డీటిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

1 hour ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

2 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

3 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

3 hours ago

బౌల‌ర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఓన్లీ సీబీఎన్‌: లోకేష్‌!

రాష్ట్రంలో బౌల‌ర్స్‌(ప్ర‌త్య‌ర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్ర‌బాబు నాయుడేన‌ని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుప‌తిలో జ‌రిగిన ప్ర‌భుత్వ వియోజ‌త్స‌వ…

3 hours ago

మీనాక్షికి ఊరట దక్కలేదు!

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…

3 hours ago