కేరళలో ఒక హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కేవలం పది నెలల వయసున్న అలిన్ షెరిన్ అబ్రహం అనే పసికందు, తాను కన్నుమూస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఈ చిన్నారి, కేరళలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా ఒక గొప్ప చరిత్రను లిఖించింది. తన మరణంతో మరో ఆరు నెలల చిన్నారితో సహా మొత్తం ఐదుగురికి ఈ పాప కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
ఫిబ్రవరి 5న జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అందరిని కలచివేసింది. కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొనడంతో అలిన్ తీవ్రంగా గాయపడింది. కొట్టాయం, తిరువల్ల ఆసుపత్రుల్లో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ అలిన్ తల్లిదండ్రులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ ఇక తిరిగి రాదని తెలిసినా, ఆమె అవయవాల ద్వారా కనీసం మరికొందరైనా బతుకుతారనే ఆశతో దానానికి అంగీకరించారు. దీనివల్ల అలిన్ కాలేయం, రెండు కిడ్నీలు, గుండె కవాటం, రెండు కళ్లను సేకరించారు. పాప కాలేయాన్ని తిరువనంతపురంలో చావుబతుకుల్లో ఉన్న ఆరు నెలల బాబుకు విజయవంతంగా అమర్చారు.
అవయవాల తరలింపు కోసం కేరళ ప్రభుత్వం ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చి నుంచి తిరువనంతపురం వరకు సాధారణంగా ఆరు గంటలు పట్టే ప్రయాణాన్ని, పోలీసులు, ప్రజల సహకారంతో అంబులెన్స్ కేవలం 3 గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేసింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అత్యంత వేగంగా అవయవాలను చేరవేసి ఆ పసిప్రాణాలను కాపాడారు.
తీవ్ర విషాదంలో ఉండి కూడా పరుల ప్రాణాల కోసం ఆలోచించిన అలిన్ తల్లిదండ్రులకు కేరళ ఆరోగ్య మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్లో పాలుపంచుకున్న ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
This post was last modified on February 14, 2026 11:09 am
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…