కేరళలో ఒక హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కేవలం పది నెలల వయసున్న అలిన్ షెరిన్ అబ్రహం అనే పసికందు, తాను కన్నుమూస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఈ చిన్నారి, కేరళలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా ఒక గొప్ప చరిత్రను లిఖించింది. తన మరణంతో మరో ఆరు నెలల చిన్నారితో సహా మొత్తం ఐదుగురికి ఈ పాప కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
ఫిబ్రవరి 5న జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అందరిని కలచివేసింది. కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొనడంతో అలిన్ తీవ్రంగా గాయపడింది. కొట్టాయం, తిరువల్ల ఆసుపత్రుల్లో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ అలిన్ తల్లిదండ్రులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ ఇక తిరిగి రాదని తెలిసినా, ఆమె అవయవాల ద్వారా కనీసం మరికొందరైనా బతుకుతారనే ఆశతో దానానికి అంగీకరించారు. దీనివల్ల అలిన్ కాలేయం, రెండు కిడ్నీలు, గుండె కవాటం, రెండు కళ్లను సేకరించారు. పాప కాలేయాన్ని తిరువనంతపురంలో చావుబతుకుల్లో ఉన్న ఆరు నెలల బాబుకు విజయవంతంగా అమర్చారు.
అవయవాల తరలింపు కోసం కేరళ ప్రభుత్వం ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చి నుంచి తిరువనంతపురం వరకు సాధారణంగా ఆరు గంటలు పట్టే ప్రయాణాన్ని, పోలీసులు, ప్రజల సహకారంతో అంబులెన్స్ కేవలం 3 గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేసింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అత్యంత వేగంగా అవయవాలను చేరవేసి ఆ పసిప్రాణాలను కాపాడారు.
తీవ్ర విషాదంలో ఉండి కూడా పరుల ప్రాణాల కోసం ఆలోచించిన అలిన్ తల్లిదండ్రులకు కేరళ ఆరోగ్య మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్లో పాలుపంచుకున్న ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
తెలుగు తమిళ భాషల్లో ఫాలోయింగ్ ఉన్న హీరో ప్రదీప్ రంగనాధన్ వరస విజయాలకు బ్రేక్ వేస్తూ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ…
ఐపీఎల్ అంటేనే చివరి బంతి వరకు ఉండే ఉత్కంఠ. కానీ ఈసారి ఆ మజా పూర్తిగా తగ్గిపోయింది. పరుగుల వరద…
నిజామాబాద్లో నటరాజ్ అనే ఒక సింగిల్ స్క్రీన్. దాని లీజ్ మార్పు గొడవ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ ఎస్వీసీ…
ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు..…
పాలన విషయంలో మంత్రి లోకేష్ పక్కా ప్లానింగ్తో వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయాలను విధానపరమైన అంశాలను కలగాపులగం…
పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…