కేరళలో ఒక హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కేవలం పది నెలల వయసున్న అలిన్ షెరిన్ అబ్రహం అనే పసికందు, తాను కన్నుమూస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఈ చిన్నారి, కేరళలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా ఒక గొప్ప చరిత్రను లిఖించింది. తన మరణంతో మరో ఆరు నెలల చిన్నారితో సహా మొత్తం ఐదుగురికి ఈ పాప కొత్త జీవితాన్ని ప్రసాదించింది.
ఫిబ్రవరి 5న జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అందరిని కలచివేసింది. కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొనడంతో అలిన్ తీవ్రంగా గాయపడింది. కొట్టాయం, తిరువల్ల ఆసుపత్రుల్లో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు.
పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ అలిన్ తల్లిదండ్రులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ ఇక తిరిగి రాదని తెలిసినా, ఆమె అవయవాల ద్వారా కనీసం మరికొందరైనా బతుకుతారనే ఆశతో దానానికి అంగీకరించారు. దీనివల్ల అలిన్ కాలేయం, రెండు కిడ్నీలు, గుండె కవాటం, రెండు కళ్లను సేకరించారు. పాప కాలేయాన్ని తిరువనంతపురంలో చావుబతుకుల్లో ఉన్న ఆరు నెలల బాబుకు విజయవంతంగా అమర్చారు.
అవయవాల తరలింపు కోసం కేరళ ప్రభుత్వం ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చి నుంచి తిరువనంతపురం వరకు సాధారణంగా ఆరు గంటలు పట్టే ప్రయాణాన్ని, పోలీసులు, ప్రజల సహకారంతో అంబులెన్స్ కేవలం 3 గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేసింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అత్యంత వేగంగా అవయవాలను చేరవేసి ఆ పసిప్రాణాలను కాపాడారు.
తీవ్ర విషాదంలో ఉండి కూడా పరుల ప్రాణాల కోసం ఆలోచించిన అలిన్ తల్లిదండ్రులకు కేరళ ఆరోగ్య మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్లో పాలుపంచుకున్న ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
This post was last modified on February 14, 2026 11:09 am
ఇటలీ వేదికగా జరుగుతున్న 2026 వింటర్ ఒలింపిక్స్లో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆటల పోటీలు మొదలైన కొన్ని…
క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సంగ్రామానికి కౌంట్డౌన్ మొదలైంది. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు…
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా…
ఏపీ ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న పోలవరం సాగునీటి ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని అమరావతి ఇక, పరుగులు పెట్టనున్నాయి. తాజాగా ప్రవేశ…
‘హిట్’ ఫ్రాంఛైజీతో మంచి గుర్తింపు సంపాదించిన దర్శకుడు శైలేష్ కొలను. కంటెంట్లో ఏది బెస్ట్ అన్నది పక్కన పెడితే.. ‘హిట్’ను…