కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిలిమ్స్ 20 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ కేసు వేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 2016లో ఈయన స్వీయ దర్శకత్వంలో నాన్ రుద్రన్ అనే సినిమా తీయడానికి సదరు ప్రొడక్షన్ హౌస్ ధనుష్ తో ఒప్పందం చేసుకుంది.
కానీ కాలం గడిచిపోతున్నా ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. తర్వాత వేరే దర్శకుడికి ఈ బాధ్యతను అప్పగిద్దామనుకుంటే ధనుష్ ఆ స్క్రిప్ట్ ని ఇవ్వకుండా మరింత కాలాయాపన చేశాడు. దీంతో ఇప్పటిదాకా జరిగిన ఆలస్యానికి నష్టపరిహారంగా అంత పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.
తమ సినిమాని పక్కనపెట్టి ధనుష్ వరసగా వేరే సినిమాలు చేస్తున్నాడని తేనాండాళ్ అధినేతలు ఆరోపిస్తున్నారు. దీని తర్వాతే ధనుష్ తన డైరెక్షన్ లో రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా, ఇడ్లి కొట్టు తీశారు. రెండోది తప్ప మిగిలిన వాటిలో ఆయనే హీరో.
కమర్షియల్ గా బాగానే వర్కౌట్ చేసుకున్నాయి. మరి నాన్ రుద్రన్ ని ఎందుకు పక్కన పెట్టారనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ధనుష్ తన 55వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా మమ్ముట్టి ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతానికి ధనుష్ టీమ్ వైపు నుంచి ఈ కాంట్రవర్సి పట్ల స్పందన లేదు. లీగల్ గా అన్ని కోణాలు విశేషించుకున్నాకే రెస్పాన్డ్ అయ్యే అవకాశముంది. అప్పుడప్పుడు ధనుష్ ఇలాంటి వాటిలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది.
ఆ మధ్య నయనతారతో కాపీ రైట్స్ విషయంలో జరిగిన రాద్ధాంతం గుర్తుండే ఉంటుంది. అంతకు ముందు వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకోవడం హైలైట్ అయ్యింది. ఇళయరాజా బయోపిక్ ప్రకటించి దాన్ని పెండింగ్ లో ఉంచడం ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ లో బోలెడు డౌట్లను తీసుకొచ్చింది. ఇదంతా ఎలా ఉన్నా ముందు తేనాండాళ్ ఆరోపణలు ధనుష్ ఎలా ఎదురుకుంటారో చూడాలి.
This post was last modified on February 14, 2026 10:31 am
సంక్రాంతి, దసరా లాంటి పెద్ద పండుగలను పక్కన పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజవుతున్నపుడు చిన్న సినిమాలు పోటీలో ఉండడం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…