Movie News

ధనుష్ అంత పెద్ద మాట తప్పాడా

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మీద నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిలిమ్స్ 20 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేస్తూ కేసు వేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 2016లో ఈయన స్వీయ దర్శకత్వంలో నాన్ రుద్రన్ అనే సినిమా తీయడానికి సదరు ప్రొడక్షన్ హౌస్ ధనుష్ తో ఒప్పందం చేసుకుంది.

కానీ కాలం గడిచిపోతున్నా ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. తర్వాత వేరే దర్శకుడికి ఈ బాధ్యతను అప్పగిద్దామనుకుంటే ధనుష్ ఆ స్క్రిప్ట్ ని ఇవ్వకుండా మరింత కాలాయాపన చేశాడు. దీంతో ఇప్పటిదాకా జరిగిన ఆలస్యానికి నష్టపరిహారంగా అంత పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.

తమ సినిమాని పక్కనపెట్టి ధనుష్ వరసగా వేరే సినిమాలు చేస్తున్నాడని తేనాండాళ్ అధినేతలు ఆరోపిస్తున్నారు. దీని తర్వాతే ధనుష్ తన డైరెక్షన్ లో రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా, ఇడ్లి కొట్టు తీశారు. రెండోది తప్ప మిగిలిన వాటిలో ఆయనే హీరో.

కమర్షియల్ గా బాగానే వర్కౌట్ చేసుకున్నాయి. మరి నాన్ రుద్రన్ ని ఎందుకు పక్కన పెట్టారనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ధనుష్ తన 55వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా మమ్ముట్టి ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతానికి ధనుష్ టీమ్ వైపు నుంచి ఈ కాంట్రవర్సి పట్ల స్పందన లేదు. లీగల్ గా అన్ని కోణాలు విశేషించుకున్నాకే రెస్పాన్డ్ అయ్యే అవకాశముంది. అప్పుడప్పుడు ధనుష్ ఇలాంటి వాటిలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది.

ఆ మధ్య నయనతారతో కాపీ రైట్స్ విషయంలో జరిగిన రాద్ధాంతం గుర్తుండే ఉంటుంది. అంతకు ముందు వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకోవడం హైలైట్ అయ్యింది. ఇళయరాజా బయోపిక్ ప్రకటించి దాన్ని పెండింగ్ లో ఉంచడం ఇప్పటికే మ్యూజిక్ లవర్స్ లో బోలెడు డౌట్లను తీసుకొచ్చింది. ఇదంతా ఎలా ఉన్నా ముందు తేనాండాళ్ ఆరోపణలు ధనుష్ ఎలా ఎదురుకుంటారో చూడాలి. 

Kumar

Recent Posts

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

21 minutes ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

24 minutes ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

1 hour ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

1 hour ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

3 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

4 hours ago