నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన మంటలు బిల్డింగ్ లోని అన్ని ఫ్లోర్లకూ వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
ఈ ల్యాబ్లోనే ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు, కొన్నేళ్ల నుంచి భద్రపరిచిన పలు కేసులకు సంబంధించిన ఆడియో, వీడియో ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పలు కీలక కేసుల్లో ఆధారాలన్నీ ఇక్కడి కంప్యూటర్లలోనే భద్రపరిచినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికమైన స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు చెలరేగడం, భవనంలోని అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించడం వంటి పరిణామాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నేటు కేసుకు సంబంధించిన వాయిస్ నోట్ లు, ఆధారాలు ఈ ల్యాబ్ లోనే ఉన్నాయని తాను అనుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, దానిని కప్పిబుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఎఫ్ ఎస్ ఎల్ సిబ్బంది అధికారికంగా స్పందించాల్సి ఉంది.
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…
పెద్దగా అంచనాలు లేకుండా గత ఏడాది డిసెంబర్ లో దురంధర్ విడుదలైనప్పుడు ఎవరూ దాని సునామిని ఊహించలేదు. వంద కోట్లు…
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…