నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన మంటలు బిల్డింగ్ లోని అన్ని ఫ్లోర్లకూ వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
ఈ ల్యాబ్లోనే ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు, కొన్నేళ్ల నుంచి భద్రపరిచిన పలు కేసులకు సంబంధించిన ఆడియో, వీడియో ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పలు కీలక కేసుల్లో ఆధారాలన్నీ ఇక్కడి కంప్యూటర్లలోనే భద్రపరిచినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికమైన స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు చెలరేగడం, భవనంలోని అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించడం వంటి పరిణామాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నేటు కేసుకు సంబంధించిన వాయిస్ నోట్ లు, ఆధారాలు ఈ ల్యాబ్ లోనే ఉన్నాయని తాను అనుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, దానిని కప్పిబుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఎఫ్ ఎస్ ఎల్ సిబ్బంది అధికారికంగా స్పందించాల్సి ఉంది.
This post was last modified on February 7, 2026 2:07 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…