Trends

ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం… కేటీఆర్ అనుమానాలు

నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన మంటలు బిల్డింగ్ లోని అన్ని ఫ్లోర్లకూ వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

ఈ ల్యాబ్‌లోనే ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్, ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించిన ఆధారాలు, కొన్నేళ్ల నుంచి భద్రపరిచిన పలు కేసులకు సంబంధించిన ఆడియో, వీడియో ఫైల్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పలు కీలక కేసుల్లో ఆధారాలన్నీ ఇక్కడి కంప్యూటర్లలోనే భద్రపరిచినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికమైన స్పష్టత రావాల్సి ఉంది.

అయితే, హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు చెలరేగడం, భవనంలోని అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించడం వంటి పరిణామాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నేటు కేసుకు సంబంధించిన వాయిస్ నోట్ లు, ఆధారాలు ఈ ల్యాబ్ లోనే ఉన్నాయని తాను అనుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, దానిని కప్పిబుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఎఫ్ ఎస్ ఎల్ సిబ్బంది అధికారికంగా స్పందించాల్సి ఉంది.

This post was last modified on February 7, 2026 2:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…

9 minutes ago

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

1 hour ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

3 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

4 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

6 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

6 hours ago