నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన మంటలు బిల్డింగ్ లోని అన్ని ఫ్లోర్లకూ వ్యాపించాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.
ఈ ల్యాబ్లోనే ఓటుకు నోటు ఆడియో, వీడియో ఫైల్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలు, కొన్నేళ్ల నుంచి భద్రపరిచిన పలు కేసులకు సంబంధించిన ఆడియో, వీడియో ఫైల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పలు కీలక కేసుల్లో ఆధారాలన్నీ ఇక్కడి కంప్యూటర్లలోనే భద్రపరిచినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికమైన స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు చెలరేగడం, భవనంలోని అన్ని ఫ్లోర్లకు మంటలు వ్యాపించడం వంటి పరిణామాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో సంచలనం రేపిన ఓటుకు నేటు కేసుకు సంబంధించిన వాయిస్ నోట్ లు, ఆధారాలు ఈ ల్యాబ్ లోనే ఉన్నాయని తాను అనుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, దానిని కప్పిబుచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తోందని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, ఎఫ్ ఎస్ ఎల్ సిబ్బంది అధికారికంగా స్పందించాల్సి ఉంది.
This post was last modified on February 7, 2026 2:07 pm
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…
ఒక హీరో చేయాల్సిన సినిమా ఇంకో హీరో చేతికి వెళ్లడం సినీ పరిశ్రమలో కామన్ వ్యవహారం. ఇలా మిస్ అయిన…
ఇరవై ఏడు సంవత్సరాల క్రితం వచ్చిన దేవి సినిమాకు టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. అమ్మోరు లాంటి…
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై అదే పార్టీ నుంచి ఎంపీగా విజయం దక్కించుకుని.. ప్రస్తుతం…
తాము నిర్మించే సినిమాలు ఎంత నష్టం తెచ్చిపెట్టినా… తమను ఎంతగా కుదేలు చేసినా.. వాటి గురించి ఓపెన్ అవ్వడానికి నిర్మాతలు…
వైసీపీలో మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి శకం ప్రారంభం అవుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్..…