పెళ్లంటే ఆడంబరాలకు మారు పేరుగా మారిపోయిన రోజులు ఇవి. ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే.. ఎంత ఘనంగా చేసుకుంటే అంత గొప్ప అన్నట్లు అయిపోయింది. పెద్దగా డబ్బులు లేని వాళ్లు సైతం అప్పులు చేసి అయినా ఘనంగా పెళ్లిళ్లు చేయడానికి చూస్తున్నారు. ఇలా చేయడం కరెక్టా కాదా అన్నది వేరే చర్చ.
కుటుంబంలో ఎన్నో ఏళ్లకు ఒకసారి జరిగే శుభకార్యాన్ని కొంచెం ఘనంగా చేసుకుంటే తప్పేంటి అనే ప్రశ్న తలెత్తుతుంది. సరిగా పెళ్లి చేయకపోతే చెడ్డ పేరు వస్తుందనే భయాలు కూడా ఉంటాయి. ఐతే కొందరు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా.. తమ హోదా గురించి ఆలోచించకుండా సింపుల్గా వివాహ వేడుకను పూర్తి చేస్తారు. తాజాగా ఇద్దరు ఉన్నతాధికారులు ఇదే పని చేశారు.
తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి.. ఐపీఎస్ అధికారిణి శేషాద్రిని రెడ్డి తమ వివాహాన్ని ఏమాత్రం ఆడంబరం లేకుండా చాలా సింపుల్గా చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వీళ్లిద్దరూ భద్రాత్రి భువనగిరి జిల్లా.. హైదరాబాద్ సమీపంలోని చౌటుప్పల్లో దండలు మార్చుకుని పెళ్లి తంతును పూర్తి చేశారు.
ఇందుకు చౌటుప్పల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వేదికగా నిలిచింది. శ్రీకాంత్, శేషాద్రిని తమ కుటుంబాలకు చెందిన కొద్ది మంది సభ్యుల సమక్షంలో సింపుల్గా పెళ్లి చేసుకున్న వీడియో వైరల్ అయింది. కుటుంబ సభ్యుల చప్పట్లే వారికి మేళతాళాలయ్యాయి.
కొందరు సీనియర్ అధికారులు కూడా ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం శేషాద్రిని రెడ్డి ఖుత్బుల్లాపూర్ డీసీపీగా ఉన్నారు. ఆమె స్వస్థలం లింగారెడ్డి గూడెం. శ్రీకాంత్ రెడ్డి స్వస్థలం కడప. ఆయన ఐఏఎస్ శిక్షణలో ఉన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న ఈ జంటపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల జల్లు కురుస్తోంది.
This post was last modified on January 24, 2026 6:57 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…