మార్చి 27 విడుదల కావాల్సిన పెద్ది వాయిదా ప్రచారం మరింత బలపడుతోంది. టీమ్ ఖండించడం లేదు కానీ డేట్ లో ఎలాంటి మార్పు లేదనే రీతిలో సంకేతాలు ఇస్తోంది. కానీ ఫ్యాన్స్ లో అనుమానాలు అలాగే ఉన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ పుట్టినరోజుని టార్గెట్ గా పెట్టుకుని దానికి అనుగుణంగానే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ రెండూ చేస్తున్నారు.
అయితే ప్రమోషన్లతో పాటు మిగిలిన పనులకు టైం సరిపోకపోయే ప్రమాదం ఉండటం, దురంధర్ 2తో కేవలం వారం గ్యాప్ లో క్లాష్ కు సిద్ధపడటం లాంటివి ఖచ్చితంగా రిస్క్ పెంచేవే. అందుకే పెద్ది నిర్ణయం ఒక కోణంలో చూస్తే లాభదాయకమే.
తాజాగా మే 1 రిలీజ్ అవకాశాలను పరిశీలనలో పెట్టారని ఇన్ సైడ్ టాక్. అదే తేదీకి అఖిల్ లెనిన్ దింపే ఆలోచనలో సితార ఎంటర్ టైన్మెంట్స్ ఉంది. అఫీషియల్ గా చెప్పలేదు. ఒకవేళ పెద్ది వచ్చే పక్షంలో తప్పుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మార్చి వీకెండ్ నిజానికి మంచి టైం. రంగస్థలం అదే వారంలో వచ్చి రికార్డులు కొల్లగొట్టింది.
ఎందుకంటే స్కూల్స్ కాలేజీల సెలవులు అప్పుడే మొదలవుతాయి. పైగా సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి థియేటర్ ఆక్యుపెన్సీలు పెరుగుతాయి. కానీ మే 1కి ఆ స్కోప్ తగ్గిపోతుంది. బళ్ళు తెరిచే సీజన్ దగ్గరగా ఉండటం, పిల్లల అడ్మిషన్ల హడావిడి లాంటి కారణాల వల్ల కుటుంబ ప్రేక్షకులను గంపగుత్తగా సినిమా హాళ్లకు రప్పించడం సులభంగా ఉండదు.
సో ఇవన్నీ ఆలోచించుకునే పనిలో పెద్ది టీమ్ ఉండే ఉంటుంది. అంతా చూసుకున్నాకే ప్రకటన ఇస్తారు తప్పించి ఇప్పటికిప్పుడు అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవచ్చు. ఇక చిరంజీవి విశ్వంభరకు జూలై 10 ఫిక్స్ చేయొచ్చని మరో టాక్. అంటే తండ్రి కొడుకుల మెగా సినిమాలు కేవలం రెండు నెలల గ్యాప్ లో వస్తాయన్న మాట.
అదే జరిగితే ఫ్యాన్స్ కి పండగే. ఎందుకంటే మార్చి చివరిలో పెద్ది ప్లేసులో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తే కనక బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో అభిమానులు ఉక్కిరిబిక్కరవుతారు. క్లారిటీ వచ్చే దాకా వీటి గురించి రకరకాల చర్చలు జరుగుతూనే ఉంటాయి కానీ కొంచెం వెయిట్ చేయక తప్పదు.
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…