అమెరికాలో ఐటీ ఉద్యోగం అనేది చాలామందికి ఒక కల. కానీ ఆ కలను సాకారం చేసుకోవడానికి కొందరు ఎంచుకుంటున్న అడ్డదారులు ఇప్పుడు నిజాయితీగా చదివేవారి పాలిట శాపంగా మారుతున్నాయి. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఒక తెలుగు యువతి కారులో కూర్చుని జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుండగా, పక్కన ఉన్న ఫోన్లో ఎవరో ఆన్సర్లు పంపిస్తుంటే చూసి చదవడం అందులో క్లియర్గా కనిపిస్తోంది.
ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ ‘లిప్ సింక్’ లేదా ‘ప్రాక్సీ’ ఇంటర్వ్యూలు అనేవి ఇప్పుడు కొత్తేమీ కాదు. ప్రస్తుతం ఇది చాలామంది చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఇలా వైరల్ అవ్వడం ఇదే తొలిసారి. H 1B వీసా ఉన్న అభ్యర్థులే ఇలాంటి పనులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తుండటంతో, అమెరికాలోని కంపెనీలు భారతీయ టెక్కీలపై అనుమానపు చూపులు చూస్తున్నాయి. ఇలాంటి చీటింగ్ వల్ల స్కిల్ ఉన్న వారికి అన్యాయం జరుగుతోందని టెక్కీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
H-1B వీసా అనేది హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కోసం ఉద్దేశించినది. కానీ కొంతమంది ఇలాంటి ఫ్రాడ్స్ చేసి ఆ సిస్టమ్నే దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు వైరల్ అవ్వడం వల్ల ట్రంప్ లాంటి పాలకులు వీసా నిబంధనలను మరింత కఠినం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వీసాల జారీలో చాలా ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి ఘటనలు వారికి కొత్త అస్త్రాన్ని ఇచ్చినట్లవుతుంది.
నిజానికి ఇంటర్వ్యూ పాస్ అవ్వడం ఒకెత్తు అయితే, జాబ్ వచ్చాక సర్వైవ్ అవ్వడం ఇంకో ఎత్తు. ప్రాక్సీ ద్వారా జాబ్ కొట్టినా, అక్కడ పని చేయలేక చాలామంది దొరికిపోతుంటారు. అప్పుడు కేవలం ఉద్యోగం పోవడమే కాదు, బ్లాక్ లిస్ట్ లో పెట్టి దేశం నుంచి కూడా గెంటేస్తారు. కెరీర్ మొత్తం నాశనం అవుతుంది.
ఈ వీడియోను ఎవరు తీశారు, ఎందుకు బయటపెట్టారు అనేది పక్కన పెడితే.. ఇది మన సిస్టమ్లో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టింది. షార్ట్ కట్స్లో సక్సెస్ వెతకడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన హెచ్చరిస్తోంది. నిజాయితీగా కష్టపడితే వచ్చేది ఆలస్యం అవ్వొచ్చేమో కానీ, ఇలాంటి అవమానాలు మాత్రం ఎదురుకావని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on December 1, 2025 11:49 am
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…