హైదరాబాద్లో ఒక బార్ ఓనర్ అత్యాశ అతన్ని కటకటాల పాలు చేసింది. బ్యాంకును మోసం చేసి దర్జాగా తిరుగుతున్న ‘మల్లికా ఇన్ బార్ అండ్ రెస్టారెంట్’ యజమాని ఎల్. శ్రీనివాస్ గౌడ్కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో అతనికి ఏకంగా ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పు చెప్పింది. బ్యాంకును బురిడీ కొట్టించి లక్షలు వెనకేసిన పాపానికి ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.
అసలు ఇతను చేసిన స్కామ్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఫెడరల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి సొంత తల్లి ఆస్తి పత్రాలనే ఫోర్జరీ చేశాడు. అక్కడితో ఆగకుండా, బ్యాంకు వాళ్లను నమ్మించడానికి తన తల్లి స్థానంలో వేరే మహిళను (Imposter) తల్లిగా నటించేలా చేసి సంతకాలు పెట్టించాడు. ఇంటి రెనోవేషన్ కోసం అని చెప్పి డబ్బు తీసుకుని, దాన్ని వేరే పనులకు మళ్లించాడు. ఇలా బ్యాంకుకు దాదాపు రూ. 44.8 లక్షల వరకు టోపీ పెట్టాడు.
తప్పు చేయడమే కాదు, చట్టానికి దొరక్కుండా తప్పించుకోవడానికి ఇతను సినిమా రేంజ్ డ్రామా ఆడాడు. కోర్టు విచారణకు హాజరుకాకుండా ఎగవేస్తూ పోలీసులకే చుక్కలు చూపించాడు. దీంతో కోర్టు ఇతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు రంగంలోకి దిగి, కొన్ని వారాల పాటు నిఘా పెట్టి, పక్కా ప్లాన్తో అక్టోబర్లో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు.
జైలుకు వెళ్లకుండా బెయిల్ కోసం ఇతను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కోర్టు అతని బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. విచారణలో సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో నేరం రుజువైంది. మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద శ్రీనివాస్ గౌడ్కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, అతనికి మరియు అతని సంస్థకు కలిపి రూ. 25,000 జరిమానా విధించారు. బ్యాంకులను మోసం చేసి, దొంగ పత్రాలతో లోన్లు తీసుకుని తప్పించుకోవచ్చని అనుకునే వారికి ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక. ఈడీ అధికారులు ఎంత సీరియస్గా నిఘా పెడతారో, తప్పు చేస్తే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది.
This post was last modified on November 26, 2025 7:03 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…