Trends

బ్యాంక్ లను మోసం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?

హైదరాబాద్‌లో ఒక బార్ ఓనర్ అత్యాశ అతన్ని కటకటాల పాలు చేసింది. బ్యాంకును మోసం చేసి దర్జాగా తిరుగుతున్న ‘మల్లికా ఇన్ బార్ అండ్ రెస్టారెంట్’ యజమాని ఎల్. శ్రీనివాస్ గౌడ్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో అతనికి ఏకంగా ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పు చెప్పింది. బ్యాంకును బురిడీ కొట్టించి లక్షలు వెనకేసిన పాపానికి ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

అసలు ఇతను చేసిన స్కామ్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఫెడరల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి సొంత తల్లి ఆస్తి పత్రాలనే ఫోర్జరీ చేశాడు. అక్కడితో ఆగకుండా, బ్యాంకు వాళ్లను నమ్మించడానికి తన తల్లి స్థానంలో వేరే మహిళను (Imposter) తల్లిగా నటించేలా చేసి సంతకాలు పెట్టించాడు. ఇంటి రెనోవేషన్ కోసం అని చెప్పి డబ్బు తీసుకుని, దాన్ని వేరే పనులకు మళ్లించాడు. ఇలా బ్యాంకుకు దాదాపు రూ. 44.8 లక్షల వరకు టోపీ పెట్టాడు.

తప్పు చేయడమే కాదు, చట్టానికి దొరక్కుండా తప్పించుకోవడానికి ఇతను సినిమా రేంజ్ డ్రామా ఆడాడు. కోర్టు విచారణకు హాజరుకాకుండా ఎగవేస్తూ పోలీసులకే చుక్కలు చూపించాడు. దీంతో కోర్టు ఇతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు రంగంలోకి దిగి, కొన్ని వారాల పాటు నిఘా పెట్టి, పక్కా ప్లాన్‌తో అక్టోబర్‌లో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు.

జైలుకు వెళ్లకుండా బెయిల్ కోసం ఇతను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కోర్టు అతని బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. విచారణలో సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో నేరం రుజువైంది. మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద శ్రీనివాస్ గౌడ్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, అతనికి మరియు అతని సంస్థకు కలిపి రూ. 25,000 జరిమానా విధించారు. బ్యాంకులను మోసం చేసి, దొంగ పత్రాలతో లోన్లు తీసుకుని తప్పించుకోవచ్చని అనుకునే వారికి ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక. ఈడీ అధికారులు ఎంత సీరియస్‌గా నిఘా పెడతారో, తప్పు చేస్తే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది.

This post was last modified on November 26, 2025 7:03 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

9 minutes ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

2 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

2 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago