టీడీపీ యువనాయకుడు, మంత్రి నారా లోకేష్ ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు ఏం చేస్తున్నారో, ఏం చేయాలని భావిస్తున్నారో తనకు వివరాలతో నివేదికలు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన ఆదేశించారు. తాజాగా పార్టీ పరిస్థితులపై స్పందించిన నారా లోకేష్ ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు.
ఈ నెల 1న జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అనంతరం రైతన్నా మీకోసం కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యేలును, మంత్రులను పాల్గొనాలని సీఎం స్వయంగా సూచించారు. అయితే మొత్తం 45 మంది వరకు ఎమ్మెల్యేలు పాల్గొనలేదు.
దీనిపై సమీక్షించిన నారా లోకേഷ് ఆ ఎమ్మెల్యేల తీరు పట్ల అసంతృప్తి చాటారు. ఈ 45 మందిలో గత మూడు నెలలుగా ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గొనని ఎమ్మెల్యేల జాబితా తీసుకున్నారు. వీరి సంఖ్య 23. వీరి నుంచి పూర్తి వివరాలు సేకరించి సమర్పించాలని లోకేష్ ఆదేశించారు.
గత మూడు నెలలుగా పార్టీ తరఫున కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని లోకేష్ పదేపదే చెబుతున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయంపై దృష్టి పెట్టినా, కొందరు ఎమ్మెల్యేలలో మార్పులు కనిపించడం లేదని రాష్ట్ర స్థాయి నేతలు లోకేష్కు వెల్లడించారు. దీంతో ఆగ్రహించిన లోకేష్ ఆయా ఎమ్మెల్యేల వివరాలు వెంటనే ఇవ్వాలని స్పష్టంగా చెప్పారు.
ఇదిలా ఉండగా పార్టీ సభ్యత్వం ఉన్నప్పుడే మరణించిన కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము అందించాలని, వారిని పరామర్శించాలని లోకేష్ గతంలో సూచించారు. కానీ 75 నుంచి 80 మంది కార్యకర్తల కుటుంబాలకు ఇంకా పర్యవసానాలు అందకపోవడం, ఫైళ్లు ఎమ్మెల్యే కార్యాలయాల్లోనే పేరుకుపోవడం ఆయనను మరింత కోపానికి గురిచేసింది.
త్వరలోనే నివేదికలు సమర్పించాలని, లేకపోతే చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించారు.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…