Trends

రైలుతోనే సీక్రెట్ మిస్సైల్‌!

భారత్ రక్షణ రంగం మరో లెవెల్‌కి వెళ్లింది. DRDO సెప్టెంబర్ 24న అగ్ని ప్రైమ్ క్షిపణిని ట్రైన్‌ ఆధారిత లాంచర్‌ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది సాధారణ రైలు కాదు, ప్రత్యేకంగా మిస్సైల్‌ ప్రయోగాల కోసం తయారు చేసిన సిస్టమ్. రోడ్డు మీదనూ, రైలుపై కూడా మిస్సైల్‌ను తరలించి ప్రయోగించగల సామర్థ్యం రావడం వలన దేశ రక్షణ బలం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

రైలు లాంచర్‌ వల్ల మిస్సైల్ ఎక్కడ ఉందో శత్రువులు గమనించడం కష్టమవుతుంది. పౌర రైళ్లు మధ్యలో మిళితమై కదలడం వలన ఇది గుర్తించడానికి వీలుకాదు. అంటే ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా అగ్ని క్షిపణి ప్రయోగం జరిగిపోవచ్చు. రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ లెవెల్‌కు చేరింది.

అగ్ని ప్రైమ్ క్షిపణి మధ్యశ్రేణి దూరంలో లక్ష్యాలను సూపర్ ఖచ్చితత్వంతో తాకగలదు. ఇది అగ్ని సిరీస్‌లో అత్యాధునిక వెర్షన్. రైలు, రోడ్డు రెండింటినీ వాడుకోవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం, ఈ ప్రయోగం అన్ని లక్ష్యాలను చేరుకుంది. ఫ్యూచర్‌లో ఈ టెక్నాలజీని సర్వీసులోకి తీసుకురావడం ఖాయం అని DRDO చెబుతోంది.

ఈ సిస్టమ్‌ వలన భారత మిస్సైల్ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు కదులుతూ, దాచిపెట్టి, ఎక్కడి నుంచైనా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇది దేశ రక్షణలో రెండో దాడి (Second Strike) సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరహా పరిస్థితులలో ఇలాంటి టెక్నాలజీ శత్రువులకు పెద్ద హెచ్చరిక అవుతుంది.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఇప్పటివరకూ భారత్‌కి ఉన్న బలం ఇంకో మెట్టు పెరిగింది. రైలు మార్గాలను ఉపయోగించి మిస్సైల్ సిస్టమ్ దాచడం, తరలించడం, ప్రయోగించడం అనేది గేమ్ చేంజర్‌గా మారింది.

This post was last modified on September 25, 2025 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago