భారత్ రక్షణ రంగం మరో లెవెల్కి వెళ్లింది. DRDO సెప్టెంబర్ 24న అగ్ని ప్రైమ్ క్షిపణిని ట్రైన్ ఆధారిత లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది సాధారణ రైలు కాదు, ప్రత్యేకంగా మిస్సైల్ ప్రయోగాల కోసం తయారు చేసిన సిస్టమ్. రోడ్డు మీదనూ, రైలుపై కూడా మిస్సైల్ను తరలించి ప్రయోగించగల సామర్థ్యం రావడం వలన దేశ రక్షణ బలం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
రైలు లాంచర్ వల్ల మిస్సైల్ ఎక్కడ ఉందో శత్రువులు గమనించడం కష్టమవుతుంది. పౌర రైళ్లు మధ్యలో మిళితమై కదలడం వలన ఇది గుర్తించడానికి వీలుకాదు. అంటే ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా అగ్ని క్షిపణి ప్రయోగం జరిగిపోవచ్చు. రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ లెవెల్కు చేరింది.
అగ్ని ప్రైమ్ క్షిపణి మధ్యశ్రేణి దూరంలో లక్ష్యాలను సూపర్ ఖచ్చితత్వంతో తాకగలదు. ఇది అగ్ని సిరీస్లో అత్యాధునిక వెర్షన్. రైలు, రోడ్డు రెండింటినీ వాడుకోవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం, ఈ ప్రయోగం అన్ని లక్ష్యాలను చేరుకుంది. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీని సర్వీసులోకి తీసుకురావడం ఖాయం అని DRDO చెబుతోంది.
ఈ సిస్టమ్ వలన భారత మిస్సైల్ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు కదులుతూ, దాచిపెట్టి, ఎక్కడి నుంచైనా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇది దేశ రక్షణలో రెండో దాడి (Second Strike) సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరహా పరిస్థితులలో ఇలాంటి టెక్నాలజీ శత్రువులకు పెద్ద హెచ్చరిక అవుతుంది.
సింపుల్గా చెప్పాలంటే.. ఇప్పటివరకూ భారత్కి ఉన్న బలం ఇంకో మెట్టు పెరిగింది. రైలు మార్గాలను ఉపయోగించి మిస్సైల్ సిస్టమ్ దాచడం, తరలించడం, ప్రయోగించడం అనేది గేమ్ చేంజర్గా మారింది.
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…