భారత్ రక్షణ రంగం మరో లెవెల్కి వెళ్లింది. DRDO సెప్టెంబర్ 24న అగ్ని ప్రైమ్ క్షిపణిని ట్రైన్ ఆధారిత లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది సాధారణ రైలు కాదు, ప్రత్యేకంగా మిస్సైల్ ప్రయోగాల కోసం తయారు చేసిన సిస్టమ్. రోడ్డు మీదనూ, రైలుపై కూడా మిస్సైల్ను తరలించి ప్రయోగించగల సామర్థ్యం రావడం వలన దేశ రక్షణ బలం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
రైలు లాంచర్ వల్ల మిస్సైల్ ఎక్కడ ఉందో శత్రువులు గమనించడం కష్టమవుతుంది. పౌర రైళ్లు మధ్యలో మిళితమై కదలడం వలన ఇది గుర్తించడానికి వీలుకాదు. అంటే ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా అగ్ని క్షిపణి ప్రయోగం జరిగిపోవచ్చు. రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ లెవెల్కు చేరింది.
అగ్ని ప్రైమ్ క్షిపణి మధ్యశ్రేణి దూరంలో లక్ష్యాలను సూపర్ ఖచ్చితత్వంతో తాకగలదు. ఇది అగ్ని సిరీస్లో అత్యాధునిక వెర్షన్. రైలు, రోడ్డు రెండింటినీ వాడుకోవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం, ఈ ప్రయోగం అన్ని లక్ష్యాలను చేరుకుంది. ఫ్యూచర్లో ఈ టెక్నాలజీని సర్వీసులోకి తీసుకురావడం ఖాయం అని DRDO చెబుతోంది.
ఈ సిస్టమ్ వలన భారత మిస్సైల్ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు కదులుతూ, దాచిపెట్టి, ఎక్కడి నుంచైనా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇది దేశ రక్షణలో రెండో దాడి (Second Strike) సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరహా పరిస్థితులలో ఇలాంటి టెక్నాలజీ శత్రువులకు పెద్ద హెచ్చరిక అవుతుంది.
సింపుల్గా చెప్పాలంటే.. ఇప్పటివరకూ భారత్కి ఉన్న బలం ఇంకో మెట్టు పెరిగింది. రైలు మార్గాలను ఉపయోగించి మిస్సైల్ సిస్టమ్ దాచడం, తరలించడం, ప్రయోగించడం అనేది గేమ్ చేంజర్గా మారింది.
This post was last modified on September 25, 2025 4:59 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…