Trends

రైలుతోనే సీక్రెట్ మిస్సైల్‌!

భారత్ రక్షణ రంగం మరో లెవెల్‌కి వెళ్లింది. DRDO సెప్టెంబర్ 24న అగ్ని ప్రైమ్ క్షిపణిని ట్రైన్‌ ఆధారిత లాంచర్‌ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది సాధారణ రైలు కాదు, ప్రత్యేకంగా మిస్సైల్‌ ప్రయోగాల కోసం తయారు చేసిన సిస్టమ్. రోడ్డు మీదనూ, రైలుపై కూడా మిస్సైల్‌ను తరలించి ప్రయోగించగల సామర్థ్యం రావడం వలన దేశ రక్షణ బలం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

రైలు లాంచర్‌ వల్ల మిస్సైల్ ఎక్కడ ఉందో శత్రువులు గమనించడం కష్టమవుతుంది. పౌర రైళ్లు మధ్యలో మిళితమై కదలడం వలన ఇది గుర్తించడానికి వీలుకాదు. అంటే ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా అగ్ని క్షిపణి ప్రయోగం జరిగిపోవచ్చు. రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ లెవెల్‌కు చేరింది.

అగ్ని ప్రైమ్ క్షిపణి మధ్యశ్రేణి దూరంలో లక్ష్యాలను సూపర్ ఖచ్చితత్వంతో తాకగలదు. ఇది అగ్ని సిరీస్‌లో అత్యాధునిక వెర్షన్. రైలు, రోడ్డు రెండింటినీ వాడుకోవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం, ఈ ప్రయోగం అన్ని లక్ష్యాలను చేరుకుంది. ఫ్యూచర్‌లో ఈ టెక్నాలజీని సర్వీసులోకి తీసుకురావడం ఖాయం అని DRDO చెబుతోంది.

ఈ సిస్టమ్‌ వలన భారత మిస్సైల్ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు కదులుతూ, దాచిపెట్టి, ఎక్కడి నుంచైనా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇది దేశ రక్షణలో రెండో దాడి (Second Strike) సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరహా పరిస్థితులలో ఇలాంటి టెక్నాలజీ శత్రువులకు పెద్ద హెచ్చరిక అవుతుంది.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఇప్పటివరకూ భారత్‌కి ఉన్న బలం ఇంకో మెట్టు పెరిగింది. రైలు మార్గాలను ఉపయోగించి మిస్సైల్ సిస్టమ్ దాచడం, తరలించడం, ప్రయోగించడం అనేది గేమ్ చేంజర్‌గా మారింది.

This post was last modified on September 25, 2025 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

1 hour ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago