Trends

రైలుతోనే సీక్రెట్ మిస్సైల్‌!

భారత్ రక్షణ రంగం మరో లెవెల్‌కి వెళ్లింది. DRDO సెప్టెంబర్ 24న అగ్ని ప్రైమ్ క్షిపణిని ట్రైన్‌ ఆధారిత లాంచర్‌ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఇది సాధారణ రైలు కాదు, ప్రత్యేకంగా మిస్సైల్‌ ప్రయోగాల కోసం తయారు చేసిన సిస్టమ్. రోడ్డు మీదనూ, రైలుపై కూడా మిస్సైల్‌ను తరలించి ప్రయోగించగల సామర్థ్యం రావడం వలన దేశ రక్షణ బలం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

రైలు లాంచర్‌ వల్ల మిస్సైల్ ఎక్కడ ఉందో శత్రువులు గమనించడం కష్టమవుతుంది. పౌర రైళ్లు మధ్యలో మిళితమై కదలడం వలన ఇది గుర్తించడానికి వీలుకాదు. అంటే ఎక్కడి నుంచైనా ఒక్కసారిగా అగ్ని క్షిపణి ప్రయోగం జరిగిపోవచ్చు. రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఇలాంటి టెక్నాలజీ వాడుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ లెవెల్‌కు చేరింది.

అగ్ని ప్రైమ్ క్షిపణి మధ్యశ్రేణి దూరంలో లక్ష్యాలను సూపర్ ఖచ్చితత్వంతో తాకగలదు. ఇది అగ్ని సిరీస్‌లో అత్యాధునిక వెర్షన్. రైలు, రోడ్డు రెండింటినీ వాడుకోవచ్చని ఈ ప్రయోగం నిరూపించింది. రక్షణ మంత్రిత్వశాఖ ప్రకారం, ఈ ప్రయోగం అన్ని లక్ష్యాలను చేరుకుంది. ఫ్యూచర్‌లో ఈ టెక్నాలజీని సర్వీసులోకి తీసుకురావడం ఖాయం అని DRDO చెబుతోంది.

ఈ సిస్టమ్‌ వలన భారత మిస్సైల్ ఫోర్సెస్ ఎప్పటికప్పుడు కదులుతూ, దాచిపెట్టి, ఎక్కడి నుంచైనా దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇది దేశ రక్షణలో రెండో దాడి (Second Strike) సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరహా పరిస్థితులలో ఇలాంటి టెక్నాలజీ శత్రువులకు పెద్ద హెచ్చరిక అవుతుంది.

సింపుల్‌గా చెప్పాలంటే.. ఇప్పటివరకూ భారత్‌కి ఉన్న బలం ఇంకో మెట్టు పెరిగింది. రైలు మార్గాలను ఉపయోగించి మిస్సైల్ సిస్టమ్ దాచడం, తరలించడం, ప్రయోగించడం అనేది గేమ్ చేంజర్‌గా మారింది.

Satya

Recent Posts

నవీన్ పొలిశెట్టి… 5500 కోట్ల ఫ్రేమ్

నవీన్ పొలిశెట్టి నటించిన గత కొన్ని చిత్రాల్లో తన పేరు వెనుక ‘స్టార్ ఎంటర్టైనర్’ అనే ట్యాగ్ పడుతున్న సంగతి…

28 minutes ago

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్…

1 hour ago

ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు!… కొత్త చరిత్రే!

దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…

1 hour ago

OG యూనివర్స్ ఏం చూపించబోతోంది

ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…

1 hour ago

గ్రేట్ డైరెక్టర్… సిల్లీ లాజిక్

గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…

3 hours ago

సుప్రీం చెప్పింది… మోడీ క‌దిలారు: దేశ‌వ్యాప్తంగా దాడులు!

సుప్రీంకోర్టు హెచ్చ‌రిక‌లు, దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌ల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం క‌దిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…

3 hours ago