భారత వాయుసేన (IAF) శక్తివంతమైన దళంగా ఎదగడానికి మరో కీలక అడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ మార్క్ 1A యుద్ధవిమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ భారీ ఒప్పందంపై సంతకం చేసింది. మొత్తం 97 విమానాల కోసం రూ.62,370 కోట్లతో ఈ కాంట్రాక్ట్ కుదిరింది. ఇది చరిత్రలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద ఒప్పందం అని తెలుస్తోంది.
ఈ ఒప్పందంలో 68 సింగిల్ సీటర్ ఫైటర్లు, 29 ట్విన్ సీటర్ ట్రైనర్లు ఉంటాయి. వీటితో పాటు వాయుసేనకు అవసరమైన అనుబంధ పరికరాలూ ఇవ్వబడతాయి. 2027-28 నుంచి ఈ విమానాల డెలివరీ ప్రారంభమవుతుంది. మొత్తం డెలివరీనీ 6 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. దీంతో వాయుసేనలో ప్రస్తుతం సేవలు ముగించబోతున్న మిగ్ – 21 జెట్స్ స్థానాన్ని తేజస్ దళం భర్తీ చేయనుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, రేపటితో చివరి రెండు మిగ్ – 21 స్క్వాడ్రన్లను రిటైర్ చేయబోతున్న తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది.
ఇప్పటికే 2021లో 83 తేజస్ విమానాల కోసం రూ.46,898 కోట్లతో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్లో ఆలస్యం జరిగింది. ఈసారి మాత్రం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఆగస్టు 19న కొత్త ఆర్డర్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాల్లో 64 శాతం పైగా దేశీయ సాంకేతికతను వినియోగించనున్నారు. కొత్తగా యూటీటిఏఎమ్ ఏఈఎస్ఏ రాడార్, ‘స్వయం రక్షా కవచ’ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, స్వదేశీ యాక్యుయేటర్లు వంటి 67 కొత్త అంశాలు చేరబోతున్నాయి.
ఈ డీల్ వల్ల దేశీయ రక్షణ రంగానికి కూడా మరింత శక్తి లభించనుంది. తేజస్ ప్రోగ్రాంలో దాదాపు 105 భారతీయ కంపెనీలు సరఫరా గొలుసులో భాగమయ్యాయి. దీని ద్వారా ప్రతి సంవత్సరం 11,750 డైరెక్ట్, ఇండైరెక్ట్ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. వాయుసేనకు కావాల్సిన ఆధునిక యుద్ధవిమానాల అవసరమే కాకుండా దేశీయ రక్షణ ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి ఇది కీలక మలుపు అవుతుంది.
ఇక ఈ ఒప్పందంతో పాటు తేజస్ కు శక్తినిచ్చే 113 ఎఫ్ – 404 ఇంజిన్ల కోసం అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ (GE)తో కూడా ఒప్పందం కుదిరింది. దానిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. మొత్తంగా ఈ నిర్ణయం వాయుసేన భవిష్యత్ దళాన్ని మరింత బలంగా మార్చే దిశగా ముందడుగుగా భావిస్తున్నారు.
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…