అవును.. ఒక లారీ డ్రైవర్ చేసిన పని గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. నమ్మకాలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారన్న విషయం అతడి చర్యతో మరోసారి స్పష్టమవుతుందని చెప్పాలి. తాను కోరుకున్న కోరికను తీర్చేందుకు మొక్కు కోసం ఏకంగా 151 మేకల్ని బలి ఇచ్చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..
ధర్మపురి జిల్లాలోని అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ ఒక లారీ డ్రైవర్. అతడికి భార్య హంస.. ఒక కొడుకు ఉన్నాడు. ఆరేళ్ల క్రితం తంగరాజ్ అనారోగ్యం బారిన పడ్డాడు. ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా.. ఎందరు వైద్యులకు చూపించినా అతడి అనారోగ్యం మాత్రం తగ్గలేదు. మామూలు మనిషి కాలేదు. దీంతో మరింత కుంగుబాటుకు గురయ్యాడు.
ఇలాంటి వేళ.. పెన్నాగరం సమీపంలోని బి.అగ్రహారంలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కు తీసుకుంటే.. తప్పకుండా అనుకున్న పని పూర్తి అవుతుందని చెప్పిన మాటల్ని నమ్మాడు. అందుకు తగ్గట్లే..ఆ అమ్మవారి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఆరోగ్యం గురించి మొక్కుకున్నాడు. తన అనారోగ్యం కుదుట పడి.. మళ్లీ మామూలుగా అయితే 151 మేకల్ని బలి ఇస్తానని మొక్కుకున్నాడు.
అమ్మవారి మొక్కు తర్వాత.. కొద్ది రోజులకే అతడి ఆరోగ్యం కుదుటపడింది. మామూలు మనిషి అయ్యాడు. దీంతో.. అమ్మవారికి ఇచ్చిన మాటకు తగ్గట్లే తాజాగా రూ.10 లక్షలు ఖర్చుచేసి 151 మేకల్ని కొనుగోలు చేశాడు. మంగళవారం అమ్మవారి ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చి.. అమ్మవారికి బలి ఇచ్చాడు. గుడికి వచ్చిన భక్తులకు మాంసాహారంతో విందు ఇచ్చాడు. ఇంత భారీ ఎత్తున మేకల్ని బలి ఇచ్చిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. లారీ డ్రైవర్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.
This post was last modified on September 17, 2025 12:50 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…