అవును.. ఒక లారీ డ్రైవర్ చేసిన పని గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్నారు. నమ్మకాలకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారన్న విషయం అతడి చర్యతో మరోసారి స్పష్టమవుతుందని చెప్పాలి. తాను కోరుకున్న కోరికను తీర్చేందుకు మొక్కు కోసం ఏకంగా 151 మేకల్ని బలి ఇచ్చేసిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..
ధర్మపురి జిల్లాలోని అత్తిమరత్తూర్ గ్రామానికి చెందిన తంగరాజ్ ఒక లారీ డ్రైవర్. అతడికి భార్య హంస.. ఒక కొడుకు ఉన్నాడు. ఆరేళ్ల క్రితం తంగరాజ్ అనారోగ్యం బారిన పడ్డాడు. ఎన్ని ఆసుపత్రులకు వెళ్లినా.. ఎందరు వైద్యులకు చూపించినా అతడి అనారోగ్యం మాత్రం తగ్గలేదు. మామూలు మనిషి కాలేదు. దీంతో మరింత కుంగుబాటుకు గురయ్యాడు.
ఇలాంటి వేళ.. పెన్నాగరం సమీపంలోని బి.అగ్రహారంలో ఉన్న మారియమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కు తీసుకుంటే.. తప్పకుండా అనుకున్న పని పూర్తి అవుతుందని చెప్పిన మాటల్ని నమ్మాడు. అందుకు తగ్గట్లే..ఆ అమ్మవారి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఆరోగ్యం గురించి మొక్కుకున్నాడు. తన అనారోగ్యం కుదుట పడి.. మళ్లీ మామూలుగా అయితే 151 మేకల్ని బలి ఇస్తానని మొక్కుకున్నాడు.
అమ్మవారి మొక్కు తర్వాత.. కొద్ది రోజులకే అతడి ఆరోగ్యం కుదుటపడింది. మామూలు మనిషి అయ్యాడు. దీంతో.. అమ్మవారికి ఇచ్చిన మాటకు తగ్గట్లే తాజాగా రూ.10 లక్షలు ఖర్చుచేసి 151 మేకల్ని కొనుగోలు చేశాడు. మంగళవారం అమ్మవారి ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చి.. అమ్మవారికి బలి ఇచ్చాడు. గుడికి వచ్చిన భక్తులకు మాంసాహారంతో విందు ఇచ్చాడు. ఇంత భారీ ఎత్తున మేకల్ని బలి ఇచ్చిన వైనం స్థానికంగా సంచలనంగా మారింది. లారీ డ్రైవర్ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.
This post was last modified on September 17, 2025 12:50 pm
ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి…
గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే…
నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్…
చిన్న సినిమాలకు ప్రమోషన్లు చేసి జనాన్ని రప్పించడం కీలకం. ముఖ్యంగా కొత్త ఆర్టిస్టులతో తీస్తున్నప్పుడు ఈ రిస్క్ చాలా ఉంటుంది.…
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా పూజలు అందుకునే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని తిరుమలకు…
ఐపీఎల్ 2026 సీజన్ లో 15వ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు పసందైన వినోదాన్ని అందించింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా…