ఉసేన్ బోల్ట్.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మనిషిగా రికార్డు నెలకొల్పిన స్ప్రింటర్. 100 మీటర్ల పరుగు, 200 మీటర్ల పరుగు, 4-100 మీటర్ల రిలే పరుగు.. ఈ మూడింట్లోనూ ప్రపంచ రికార్డులు ఈ జమైకా అథ్లెట్ సొంతం. వంద మీటర్లలో అతడి రికార్డు టైమింగ్ 9.58 సెకన్లు. ఎప్పుడో 2009లోనే అతనీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 200 మీటర్లలో కూడా అదే ఏడాది 19.19 సెకన్లతో రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటిదాకా అవి చెక్కు చెదరలేదు. వాటికి దగ్గరగా కూడా ఎవ్వరూ వెళ్లట్లేదు.
స్ప్రింట్కు అతను తెచ్చిన ఆకర్షణే వేరు. అతడికి ముందు, వెనుక ఎవ్వరూ క్రీడాభిమానులను తనలా ఉర్రూతలూగించట్లేదు. ట్రాక్ మీద అంతటి ఆధిపత్యం చూపించిన బోల్ట్.. ఇప్పుడు మెట్లు ఎక్కుతుంటే ఆయాసపడుతున్నాడట. స్టెప్స్ మీద వెళ్తుంటే ఊపిరి అందని పరిస్థితి వస్తోందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పడం చర్చనీయాంశమైంది.
బోల్ట్ 2017లో రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత అతను నెమ్మదిగా పరుగు ఆపేశాడు. పెళ్లి చేసుకుని కుటుంబ జీవనానికి పరిమితం అయిన బోల్ట్..అప్పుడప్పుడూ ప్రమోషనల్ కార్యక్రమాల్లో కనిపిస్తూ వచ్చాడు. కొన్నేళ్ల నుంచి అయితే మీడియాకు అస్సలు దొరకడం లేదు. ఐతే తాజాగా ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్కు అతను అతిథిగా హాజరయ్యాడు. టోక్యోలో స్టేడియానికి వచ్చి 100 మీటర్ల పరుగు ఈవెంట్ను వీక్షించాడు. ఆ సందర్భంగా అతను అంత ఫిట్గా కనిపించలేదు. కొంచెం పొట్ట కూడా వచ్చినట్లు కనిపించింది.
ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడుతూ.. తాను పరుగుకు పూర్తిగా దూరం కావడంతో మెట్లు ఎక్కుతున్నపుడు శ్వాస తీసుకోవడం కష్టమవుతున్న విషయాన్ని వెల్లడించాడు. తాను జిమ్లో వర్కవుట్లు చేస్తున్నా కానీ.. పరుగు మాత్రం తీయట్లేదని.. మళ్లీ ఆ పని చేయాలనుకుంటున్నానని బోల్ట్ తెలిపాడు. ఇంట్లో పిల్లల్ని రెడీ చేసి స్కూలుకు పంపడం, టీవీలో వెబ్ సిరీస్లు చూడడం, గేమ్స్ ఆడడం, కుటుంబంతో గడపడమే ప్రస్తుతం తన వ్యాఫకాలుగా ఉన్నాయని ఉసేన్ వెల్లడించాడు.
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…