డాలస్లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్య దారుణ హత్యకు గురైన ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు నిందితుడని తేలింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై అక్రమ వలసలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేశారు. అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.
చంద్ర నాగమల్లయ్యను నిందితుడు మార్టినెజ్ తన భార్య, కుమారుడి ఎదుటే హత్య చేయడం ఘటనను మరింత దారుణంగా మార్చింది. ఆయన తలను నరికి చెత్తబుట్టలో పడేయడం అమెరికా వ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది. వెంటనే పోలీసులు మార్టినెజ్ను అదుపులోకి తీసుకుని ఫస్ట్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో అక్కడి భారతీయ కమ్యూనిటీ కూడా షాక్లో మునిగిపోయింది.
ట్రంప్ ఈ కేసుపై స్పందిస్తూ, “నాగమల్లయ్యకు డాలస్లో మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తిని అక్రమ వలసదారుడు చంపేశాడు. ఈ ఘటన వెనుక సంచలన విషయాలు నా దృష్టికి వచ్చాయి” అని పేర్కొన్నారు. గతంలోనే మార్టినెజ్పై లైంగిక దాడి, దొంగతనం వంటి అనేక నేరాలు నమోదయ్యాయని, అయినప్పటికీ బైడెన్ ప్రభుత్వం అతడిని అమెరికాలో ఉంచిందని ఆయన ధ్వజమెత్తారు. క్యూబా కూడా అలాంటి నేరస్తులను వద్దనుకోవడంతో అమెరికా తలుపులు తెరవడం తప్పు అని ట్రంప్ విమర్శించారు.
“ఇకపై అక్రమ వలసదారులపై మృదువైన వైఖరి ఉండదు. అమెరికా ప్రజల భద్రత కోసం కఠిన చర్యలు తప్పవు” అని ఆయన ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ట్రంప్ గతంలో కూడా వలస విధానాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మళ్లీ అదే దిశగా అడుగులు వేయబోతున్న సంకేతాలు ఇచ్చారు.
This post was last modified on September 15, 2025 10:42 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…