ఆసియా కప్ 2025లో భారత్ దుమ్మురేపే విజయంతో ప్రారంభించింది. దుబాయ్లో జరిగిన తొలి మ్యాచ్లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. మొత్తం మ్యాచ్ రెండు గంటలకే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్కు దిగిన యూఏఈ కేవలం 57 పరుగులకే కుప్పకూలగా, భారత్ 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
యూఏఈ ఇన్నింగ్స్ పవర్ప్లేలో కొంత మెరుగ్గా ఆడినట్లు కనిపించినా, ఆరంభం తర్వాత పూర్తిగా కుప్పకూలిపోయింది. అలీషాన్ షరాఫు బౌండరీలు కొట్టినా, బుమ్రా వేసిన అద్భుతమైన యార్కర్ అతనిని పెవిలియన్ పంపింది. తర్వాత కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ స్పిన్ తాళలేక ఒక్క ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత శివం దూబే అదనంగా చెలరేగి మూడు వికెట్లు తీసి యూఏఈని 13 ఓవర్లలోనే చిత్తు చేశాడు. చివరకు కుల్దీప్ 4/7, దూబే 3/4తో దెబ్బకొట్టారు.
భారత్ బౌలర్ల ఆధిపత్యం తర్వాత బ్యాట్స్మెన్లు మాత్రం రన్ చేజ్ను జెట్ స్పీడ్ లో మార్చేశారు. తొలి బంతికే అభిషేక్ శర్మ భారీ సిక్స్తో ఇన్నింగ్స్ను ఆరంభించాడు. గిల్ కూడా నాలుగులు, సిక్స్లు బాదడంతో పవర్ప్లే దాటకుండానే లక్ష్యం పూర్తి అయింది. అభిషేక్ 30 పరుగులు, గిల్ 20 నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ ఒక్క బంతికే సిక్స్ బాది మ్యాచ్ను ముగించాడు.
మొత్తం మ్యాచ్లో యూఏఈ ప్రదర్శనలో పవర్ప్లేలో 41/2 పరుగులు మాత్రమే మెరుగ్గా కనబడ్డాయి. కానీ తర్వాత 16/8 స్కోరు నమోదు చేయడం వాళ్లకు ఘోర పరాభవాన్ని తెచ్చింది. ఇది ఆసియా కప్ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుగా నమోదు కావడం యూఏఈకి చేదు రికార్డుగా మిగిలింది. ఇక ఈ గెలుపుతో భారత్ టైటిల్ డిఫెన్స్ను బలంగా ప్రారంభించింది. ఆదివారం జరగబోయే భారత్ -పాకిస్థాన్ మ్యాచ్కు ముందు ఈ విజయం మోరాల్ బూస్టర్గా మారింది. మరోవైపు యూఏఈకి తమ తర్వాతి మ్యాచ్లో ఒమాన్తో ఆడే అవకాశం మాత్రమే వాస్తవిక గెలుపు అవకాశమని నిపుణులు చెబుతున్నారు.
స్కోర్లు:
యూఏఈ – 57/10 (13.1 ఓవర్లు)
భారత్ – 60/1 (4.3 ఓవర్లు).
This post was last modified on September 11, 2025 6:43 am
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…