Trends

UAEని జెట్ స్పీడ్ లో మడతపెట్టేసిన టీమిండియా

ఆసియా కప్‌ 2025లో భారత్‌ దుమ్మురేపే విజయంతో ప్రారంభించింది. దుబాయ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో యూఏఈపై 9 వికెట్ల తేడాతో అఖండ విజయం సాధించింది. మొత్తం మ్యాచ్‌ రెండు గంటలకే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ కేవలం 57 పరుగులకే కుప్పకూలగా, భారత్‌ 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

యూఏఈ ఇన్నింగ్స్‌ పవర్‌ప్లేలో కొంత మెరుగ్గా ఆడినట్లు కనిపించినా, ఆరంభం తర్వాత పూర్తిగా కుప్పకూలిపోయింది. అలీషాన్‌ షరాఫు బౌండరీలు కొట్టినా, బుమ్రా వేసిన అద్భుతమైన యార్కర్‌ అతనిని పెవిలియన్‌ పంపింది. తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ మ్యాజిక్‌ స్పిన్‌ తాళలేక ఒక్క ఓవర్‌లోనే మూడు వికెట్లు కోల్పోయింది. తర్వాత శివం దూబే అదనంగా చెలరేగి మూడు వికెట్లు తీసి యూఏఈని 13 ఓవర్లలోనే చిత్తు చేశాడు. చివరకు కుల్దీప్‌ 4/7, దూబే 3/4తో దెబ్బకొట్టారు.

భారత్‌ బౌలర్ల ఆధిపత్యం తర్వాత బ్యాట్స్‌మెన్లు మాత్రం రన్‌ చేజ్‌ను జెట్ స్పీడ్ లో మార్చేశారు. తొలి బంతికే అభిషేక్‌ శర్మ భారీ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. గిల్‌ కూడా నాలుగులు, సిక్స్‌లు బాదడంతో పవర్‌ప్లే దాటకుండానే లక్ష్యం పూర్తి అయింది. అభిషేక్‌ 30 పరుగులు, గిల్‌ 20 నాటౌట్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్క బంతికే సిక్స్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు.

మొత్తం మ్యాచ్‌లో యూఏఈ ప్రదర్శనలో పవర్‌ప్లేలో 41/2 పరుగులు మాత్రమే మెరుగ్గా కనబడ్డాయి. కానీ తర్వాత 16/8 స్కోరు నమోదు చేయడం వాళ్లకు ఘోర పరాభవాన్ని తెచ్చింది. ఇది ఆసియా కప్‌ చరిత్రలో రెండో అత్యల్ప స్కోరుగా నమోదు కావడం యూఏఈకి చేదు రికార్డుగా మిగిలింది. ఇక ఈ గెలుపుతో భారత్‌ టైటిల్‌ డిఫెన్స్‌ను బలంగా ప్రారంభించింది. ఆదివారం జరగబోయే భారత్‌ -పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ముందు ఈ విజయం మోరాల్‌ బూస్టర్‌గా మారింది. మరోవైపు యూఏఈకి తమ తర్వాతి మ్యాచ్‌లో ఒమాన్‌తో ఆడే అవకాశం మాత్రమే వాస్తవిక గెలుపు అవకాశమని నిపుణులు చెబుతున్నారు.

స్కోర్లు:

యూఏఈ – 57/10 (13.1 ఓవర్లు)

భారత్‌ – 60/1 (4.3 ఓవర్లు).

Kumar

Recent Posts

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

1 hour ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

2 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

2 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

3 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

3 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

4 hours ago