Trends

మూడో భార్య కుతంత్రం.. బావిలో శవమై తేలిన భర్త

ఈమధ్య కాలంలో భర్తలను చంపేస్తున్న భార్యల సంఖ్య ఎంతగా పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవస్రం లేదు. ఇక రీసెంట్ గా  మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లా సకారియా గ్రామంలో చోటుచేసుకున్న ఒక దారుణం అందరినీ కుదిపేసింది. భార్యతోపాటు ఆమె ప్రేమికుడు, మరో సహాయకుడు కలిసి ఓ వ్యక్తిని క్రూరంగా హత్య చేసి శవాన్ని బావిలో పడేశారు. ఆ మృతదేహాన్ని గుర్తించింది అతని రెండో భార్య కావడం విషాదాన్ని మరింత పెంచింది.

60 ఏళ్ల భయ్యాలాల్ రాజక్‌కి జీవితంలో మూడు పెళ్లిళ్లు జరిగాయి. మొదటి భార్య వదిలి వెళ్లిపోవడంతో, రెండో భార్య గుడ్డిబాయ్‌తో నివసించాడు. కానీ పిల్లలు లేకపోవడంతో ఆమె చిన్న చెల్లెలు మున్నిని మూడో భార్యగా చేసుకున్నాడు. ఆమెతో ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ మున్ని రహస్యంగా స్థానిక ప్రాపర్టీ డీలర్ నారాయణ్ దాస్ కుష్వాహా అనే వ్యక్తికి దగ్గరైంది. ఇక వారి బంధం కొన్నాళ్లకు మరింత బలపడడంతో ఇద్దరూ భయ్యాలాల్‌ను లేకుండా చేయాలని ప్లాన్ చేశారు.

ఆగస్టు 30 రాత్రి, నిర్మాణంలో ఉన్న తన ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న భయ్యాలాల్‌పై నారాయణ్‌ దాస్, అతడి సహాయకుడు ధీరజ్ కోల్ దాడి చేశారు. ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టి అక్కడికక్కడే చంపేశారు. శవాన్ని గనుక ఎవరూ గుర్తించకూడదని బస్తాలు, దుప్పట్లు కప్పి తాళ్లతో కట్టి బావిలో పడేశారు.

తరువాతి రోజు ఉదయం రెండో భార్య గుడ్డిబాయ్ బావిలో ఏదో తేలుతున్నట్లు గమనించింది. దగ్గరగా చూసేసరికి అది తన భర్త శవమని తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే గ్రామంలో కలకలం రేగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిని ఖాళీ చేసి శవాన్ని బయటకు తీశారు. అక్కడే భయ్యాలాల్ ఫోన్ కూడా దొరికింది.

పోస్ట్‌మార్టం రిపోర్ట్ ప్రకారం తలకు తగిలిన బలమైన గాయాల వల్లే మరణం సంభవించిందని నిర్ధారించారు. 36 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు మూడో భార్య మున్ని, ఆమె ప్రేమికుడు నారాయణ్ దాస్, సహాయకుడు ధీరజ్‌ను అరెస్టు చేశారు.

This post was last modified on September 9, 2025 6:12 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

3 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago