భారత్ ఐటీ రంగం విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లు. 5.6 మిలియన్ల మందికి పైగా ఉద్యోగాలు ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి. అమెరికాలో ట్రంప్ సర్కారు ఔట్సోర్సింగ్ సేవలపై టారిఫ్లు విధించవచ్చనే ప్రచారం వ్యాపిస్తోన్న వేళ, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంగా స్పందించారు. ఐటీ రంగాన్ని కాపాడేందుకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని అన్నారు.
భారత ఐటీ సేవల రంగం దేశానికి పెద్ద ఎత్తున ఎగుమతి ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో వంటి దిగ్గజ సంస్థలకు 60% వరకు ఆదాయం అమెరికా నుంచే వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో టారిఫ్లు నిజమైతే, సంస్థలు రెండుసార్లు పన్నుపోటు బారిన పడతాయి. వీసా నిబంధనలు, స్థానిక నియామకాలతో కలిపి ఇప్పటికే ఖర్చులు పెరిగిపోతున్నాయి.
మంత్రి వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్ ప్రభుత్వం కేవలం అమెరికాతోనే కాదు, యూరప్, జపాన్, ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరుపుతోంది. అదే సమయంలో గ్లోబల్ కెపాసిటీ సెంటర్లను భారత్లో నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయి. ఇది రంగానికి స్థిరత్వం కల్పించేందుకు తీసుకుంటున్న వ్యూహాత్మక చర్య అని ఆయన తెలిపారు.
అమెరికా నుంచి వచ్చే ముప్పు నిజమైనా, అంత ఈజీ కాదు అని నిపుణులు చెబుతున్నారు. సరుకుల దిగుమతుల మాదిరిగా ఐటీ ఔట్సోర్సింగ్పై టారిఫ్లు విధించడం కష్టం. ఎందుకంటే, అమెరికా దిగ్గజ కంపెనీలకే భారత నిపుణుల సహకారం తప్పనిసరి. హెచ్1బీ వీసాలతో అక్కడికి వెళ్ళినా, లేదా రిమోట్గా పనిచేసినా, భారత నైపుణ్యాన్ని వారు వదులుకోలేరు.
మొత్తం మీద, అమెరికా టారిఫ్ల భయం నిజమే అయినా, ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వైష్ణవ్ హామీ ఇవ్వడం రంగానికి ఊరటనిస్తోంది. అదే సమయంలో, ప్రభుత్వం ఐటీపై మాత్రమే ఆధారపడకుండా, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలను ప్రోత్సహించేందుకు కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సమతుల్యతే భారత టెక్ ఎకానమీకి భవిష్యత్తులో బలమైన పునాదిగా నిలవవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on September 7, 2025 4:30 pm
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…