అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఎప్పటికప్పుడు ఊహించని వార్తలు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో రీసెంట్ గా #TrumpIsDead అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవ్వడంతో ఆయన ఆరోగ్యంపై అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాషింగ్టన్ డీసీలో గత వారం వైట్ హౌస్ షెడ్యూల్ ఖాళీగా ప్రకటించడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. అయితే ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి, తాను ఎప్పుడూ లేనంత ఆరోగ్యంగా ఉన్నానని వ్యాఖ్యానిస్తూ అన్ని వదంతులను కొట్టిపారేశారు.
ట్రంప్ ట్రూత్ సోషిల్ మీడియాలో స్పందిస్తూ “నేను జీవితంలో ఎప్పుడూ కూడా ఇంత బాగోలేదు” అని రాసి చల్లటి కబురు చెప్పారు. దీంతో ఆయనపై వస్తున్న ఆరోగ్య వదంతులు ఒక్కసారిగా తగ్గిపోయాయి. అంతేకాకుండా వాషింగ్టన్ ఇప్పుడు ‘క్రైమ్ ఫ్రీ జోన్’ అయిందని కూడా తన స్టైల్లో వ్యాఖ్యానించారు. తనను 24 గంటలు చూడకపోతేనే మీడియా గందరగోళానికి గురయ్యిందని, అయితే బైడెన్ లాంటి నాయకులు కొన్నిరోజులు కన్పించకపోయినా “షార్ప్గా ఉన్నారు” అని చెప్పడం డబుల్ స్టాండర్డ్ అని వ్యాఖ్యించిన రాజకీయ వ్యాఖ్యాత్త రోగన్ వ్యాఖ్యలను సమర్థించారు.
ఈ రూమర్స్ మధ్యే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా వ్యాఖ్యానించారు. ట్రంప్ చాలా ఫిట్గా, ఉత్సాహంగా ఉన్నారని, కాని “భయంకరమైన విషాదం జరిగితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి తాను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు వదంతులకు మరింత ఊతమిచ్చినా, ట్రంప్ బలంగా ఉన్నారని చెప్పడం కూడా ఆ హ్యాష్ట్యాగ్ రచ్చను మరింత వైరల్ గా మార్చింది.
మొత్తానికి సోషల్ మీడియాలో ఎంత గాసిప్ రచ్చ జరిగినా, ట్రంప్ తనదైన శైలిలో ప్రతిస్పందిస్తూ వాటిని తేలిగ్గా తీసుకున్నట్లు కన్పిస్తోంది. తన ఫొటోలను షేర్ చేస్తూ, గోల్ఫ్ ఆడుతున్న దృశ్యాలను చూపించి తాను ఆరోగ్యంగానే ఉన్నానని మరోసారి నిరూపించారు. అలాగే ఆఖరికి చావు వార్తలు వచ్చినా వాటికి తన స్టైల్లో సమాధానం చెబుతూ ప్రజలను ఎట్రాక్ట్ చేయడంలో ట్రంప్ సో డిఫరెంట్ అని మరోసారి నిరూపించాడు.
This post was last modified on September 1, 2025 9:16 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…