అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్లు విధించిన తీరు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించడాన్ని కారణంగా చూపిస్తూ భారత్పై మొత్తం 50 శాతం టారిఫ్లు (సుంకాలు) విధించారు. దీంతో భారత ఉత్పత్తులపై అమెరికాలో ధరలు పెరగడం, ఎగుమతులు మందగించడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ చర్యలను అన్యాయమని అభివర్ణిస్తూ, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఎఫెక్ట్ ఏ స్థాయిలో..
అమెరికా భారత్ ఎగుమతుల్లో షేర్ పెద్దది కాకపోయినా, ముఖ్యమైన కొన్ని రంగాలు మాత్రం గట్టిగా దెబ్బతినే అవకాశముంది. ప్రత్యేకంగా డైమండ్స్, జ్యువెలరీ, టెక్స్టైల్స్, అప్పారెల్స్, కెమికల్స్ రంగాలు అమెరికా మార్కెట్పై ఆధారపడి ఉన్నాయి. UBS లెక్కల ప్రకారం దాదాపు $8 బిలియన్ డాలర్ల విలువైన ఇండియన్ ఎగుమతులు ఈ కొత్త టారిఫ్ల వల్ల ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. వీటిలో ప్రధానంగా రత్నాలు, నగలు, వస్ర్తాలు, కెమికల్స్ ఉన్నాయి.
ఇక స్టాక్ మార్కెట్కు సంబంధించిన విషయానికి వస్తే.. నిఫ్టీ 50 ఇండెక్స్లో అమెరికా డైరెక్ట్ ఎక్స్పోజర్ 9% మాత్రమే ఉండగా, అవి కూడా మెజారిటీగా ఐటీ సర్వీసెస్లోనే ఉన్నాయి. ఐటీ రంగంపై ప్రస్తుత టారిఫ్ల ప్రభావం లేదు. అదే విధంగా, ఫార్మాస్యూటికల్ ఎగుమతులు, సెమికండక్టర్లు, అల్యూమినియం, స్టీల్ రంగాలపై కూడా ఈ టారిఫ్లు ప్రభావం చూపకపోవచ్చు. ఇందువల్ల భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద కాకుండా, కొన్ని ఎగుమతి రంగాల మీద మాత్రమే ప్రధానంగా నష్టాలు పడేలా ఉన్నాయి.
అయినా, రత్నాలు, వస్ర్తాలు, కెమికల్స్ వంటి రంగాలకు ఇది భారీ పోటీ లోటును కలిగించనుంది. వ్యాపారాలు వేరే మార్కెట్లను వెతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది. సరుకుల ధరలు పెరగడం, ఆర్డర్లు తగ్గిపోవడం, ఉద్యోగాల్లో కోతలు వంటి ముప్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టార్గెట్ అయిన రంగాలకు ప్రత్యేక సహాయ ప్యాకేజీలు ప్రకటించే అవకాశముంది.
మొత్తానికి, ట్రంప్ టారిఫ్ల వల్ల భారతీయం జ్యువెలరీ, టెక్స్టైల్స్, కెమికల్స్ రంగాలు తాత్కాలికంగా నష్టాలు చవిచూడవచ్చు. అయితే, ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలకు పెద్దగా ప్రభావం లేకపోవడంతో మార్కెట్లో పెద్ద దెబ్బ మాత్రం తగలకపోవచ్చు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా స్పందిస్తే ఈ సమస్యలను అధిగమించవచ్చు.
This post was last modified on August 7, 2025 6:47 am
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…