ఇండోర్ నగరంలో తాజాగా చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అక్కడి బైక్ వాహనదారులకు ‘నో హెల్మెట్.. నో పెట్రోల్’ నిబంధన తప్పనిసరిగా అమలవుతోంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్కు వచ్చిన ఒక పాల వ్యాపారి, పాల క్యాన్ మూతను తలపై పెట్టుకొని హెల్మెట్ను మాయ చేశాడు.
పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా అతని తతంగాన్ని పట్టించుకోకుండా పెట్రోల్ పోశారు. ఈ వీడియో నెటిజన్ల దృష్టిలో పడ్డ వెంటనే అధికారుల కంటపడింది. ఇలాంటి అవగాహనలేని చర్యల వల్ల పెట్రోల్ బంక్పై విచారణ ప్రారంభమైంది. అధికారుల పరిశీలన తర్వాత నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత పెట్రోల్ బంక్ను తాత్కాలికంగా సీజ్ చేశారు. బంక్ నిర్వాహకులు బాధ్యత కలిగి ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇండోర్లో ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకపై హెల్మెట్ లేకుండా పెట్రోల్ డిపో వద్దకు వచ్చేవారికి ఇంధనం ఇవ్వకూడదని ఆదేశించారు. ఇలా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏడాది జైలు శిక్ష లేదా రూ.5వేల జరిమానా విధించవచ్చని హెచ్చరించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తాయి. కొంత మంది వినూత్న కామెడిగా చూస్తే, మరికొందరు నిబంధనల దౌర్భాగ్యాన్ని విమర్శించారు.
ప్రజలు ఇలా ఆడుకుంటే ప్రమాదానికి గురవుతారనే విషయాన్ని గుర్తు చేశారు. మొత్తంగా, హెల్మెట్కు బదులు పాల క్యాన్ మూత వేసుకొని వచ్చిన వ్యాపారి చేసిన పని పెట్రోల్ బంక్ను మూయించేసింది. రూల్స్ను ఖచ్చితంగా పాటించకపోతే ఇలాంటి ఫలితాలు తప్పవని ఈ సంఘటన మరోసారి తేల్చిచెప్పింది.
This post was last modified on August 7, 2025 9:18 am
ఉప్పెనతో డెబ్యూ చేసిన హీరోయిన్ కృతి శెట్టి వరసగా సినిమాలైతే చేస్తోంది కానీ విజయ లక్ష్మి మాత్రం రానని మొండికేస్తోంది.…
పెద్ది విషయంలో జరుగుతున్న జాప్యం ఇతర సినిమాలను అలర్ట్ చేస్తోంది. రెండుసార్లు రిలీజ్ డేట్ మార్చాక కూడా దానికి కట్టుబడలేని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తోంది. ముఖ్యంగా దళపతి విజయ్ తన సొంత పార్టీతో నేరుగా…
ప్రపంచానికి పెద్దన్న.. అగ్రరాజ్యమైన అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీ. ఈ మహానగర మేయర్ ఎన్నిక ఇప్పుడు జరుగుతోంది. విశేషం…
బీఆర్ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తన దూకుడు మరింత పెంచినట్టు తెలుస్తోంది. త్వరలోనే…
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన కథానాయికల్లో భానుప్రియ ఒకరు. 80వ దశకంలో తెలుగులో ఉన్న అందరు అగ్రకథానాయికులతోనూ ఆమె…