Trends

పాల క్యాన్‌ మూతతో హెల్మెట్ మాయ.. పెట్రోల్ బంక్‌ సీజ్‌!

ఇండోర్ నగరంలో తాజాగా చోటుచేసుకున్న ఘటన ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అక్కడి బైక్‌ వాహనదారులకు ‘నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌’ నిబంధన తప్పనిసరిగా అమలవుతోంది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంక్‌కు వచ్చిన ఒక పాల వ్యాపారి, పాల క్యాన్ మూతను తలపై పెట్టుకొని హెల్మెట్‌ను మాయ చేశాడు.

పెట్రోల్ బంక్‌ సిబ్బంది కూడా అతని తతంగాన్ని పట్టించుకోకుండా పెట్రోల్ పోశారు. ఈ వీడియో నెటిజన్ల దృష్టిలో పడ్డ వెంటనే అధికారుల కంటపడింది. ఇలాంటి అవగాహనలేని చర్యల వల్ల పెట్రోల్ బంక్‌పై విచారణ ప్రారంభమైంది. అధికారుల పరిశీలన తర్వాత నిబంధనలను ఉల్లంఘించినందుకు సంబంధిత పెట్రోల్ బంక్‌ను తాత్కాలికంగా సీజ్ చేశారు. బంక్ నిర్వాహకులు బాధ్యత కలిగి ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఇండోర్‌లో ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇకపై హెల్మెట్ లేకుండా పెట్రోల్ డిపో వద్దకు వచ్చేవారికి ఇంధనం ఇవ్వకూడదని ఆదేశించారు. ఇలా చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఏడాది జైలు శిక్ష లేదా రూ.5వేల జరిమానా విధించవచ్చని హెచ్చరించారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తాయి. కొంత మంది వినూత్న కామెడిగా చూస్తే, మరికొందరు నిబంధనల దౌర్భాగ్యాన్ని విమర్శించారు.

ప్రజలు ఇలా ఆడుకుంటే ప్రమాదానికి గురవుతారనే విషయాన్ని గుర్తు చేశారు. మొత్తంగా, హెల్మెట్‌కు బదులు పాల క్యాన్ మూత వేసుకొని వచ్చిన వ్యాపారి చేసిన పని పెట్రోల్ బంక్‌ను మూయించేసింది. రూల్స్‌ను ఖచ్చితంగా పాటించకపోతే ఇలాంటి ఫలితాలు తప్పవని ఈ సంఘటన మరోసారి తేల్చిచెప్పింది.

This post was last modified on August 7, 2025 9:18 am

Share
Show comments
Published by
Satya
Tags: HelmetPetrol

Recent Posts

ఉస్తాద్ ఆరా పాట ఔరా అనిపించలేదా

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…

5 minutes ago

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

4 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

9 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

10 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

10 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

10 hours ago