Trends

పోర్షే కారు కేసులో మైనర్‌ బాలుడిని అడల్ట్‌గా ఎందుకు చూడట్లేదు?

2024 పుణేలో ఇద్దరి ప్రాణాలు బలితీసుకున్న పోర్షే కారు ప్రమాదానికి కారకుడైన 17 ఏళ్ల బాలుడిపై తిరిగి చర్చ మొదలైంది. బాలుడిని పెద్దవాడిగా (అడల్ట్) శిక్షించాలన్న డిమాండ్ పెరిగినా, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు మాత్రం తేల్చేసింది. అతడిపై నమోదైన కేసులు ఏదీ ఏడేళ్ల కంటే ఎక్కువ శిక్షను కలిగించేవి కావని పేర్కొంది. అందుకే, అతడిని మైనర్‌గానే విచారించాలని స్పష్టం చేసింది.

ఈ ఘటనలో బాలుడు మద్యం సేవించి దాదాపు 180 కిలోమీటర్ల వేగంతో బైక్‌ను ఢీకొట్టి ఇద్దరిని చంపేశాడు. కేసు నమోదు అయినా, అతడికి 15 గంటల్లో బెయిల్ మంజూరు కావడం పెద్ద దుమారానికి దారి తీసింది. అతడి తండ్రి ప్రఖ్యాత బిల్డర్ కాగా, తల్లి సహా తండ్రిని కూడా సాక్ష్యాల్ని తారుమారు చేసినందుకు అరెస్టు చేశారు.

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ హిరాయ్ మాత్రం గట్టిగా వాదించారు. “ఈ ఘటన ఎంత దారుణంగా జరిగిందో చూడండి. పోలీసులు, వ్యవస్థను ప్రభావితం చేశారు, సాక్ష్యాలను మార్చేశారు. ఇవి బాలుడిలో ఉన్న పరిపక్వతను, క్రిమినల్ మైండ్‌ను సూచిస్తున్నాయి. ఇదే సందేశంగా ఉండాలంటే అతడిని అడల్ట్‌గా ట్రై చేయాలి” అని వాదించారు.

దీనికి బాలుడి తరఫు న్యాయవాది ప్రశాంత్ పాటిల్ వ్యతిరేకంగా స్పందించారు. సుప్రీం కోర్టు 2020లో ఇచ్చిన తీర్పును ఉదహరించి, ఏడేళ్లకంటే తక్కువ శిక్ష ఉన్న కేసులను ‘హీనియస్ క్రైమ్‌’గా పరిగణించలేమని స్పష్టం చేశారు. అలాగే మైనర్‌లను శిక్షించడం కాదు, మార్పు తేవడమే లక్ష్యమని జువెనైల్‌ న్యాయ చట్టం చెప్పిందని గుర్తు చేశారు.

జువెనైల్‌ బోర్డు చివరకు బాలుడిని అడల్ట్‌గా చూడడం సబబు కాదని తేల్చేసింది. అతడిపై నమోదైన సెక్షన్లు కలిపినా, ఏడేళ్ల శిక్ష గడువుకు రాకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఈ తీర్పుపై కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా, చట్టపరంగా మాత్రం ఇదే సరైన దిశగా కనిపిస్తోంది.

ఇకపై బాలుడిని మైనర్‌గానే విచారిస్తారు. అయితే, ఈ విషయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రాసిక్యూషన్ యోచనలో ఉంది. బాంబే హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

This post was last modified on July 16, 2025 6:01 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

2 minutes ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

26 minutes ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

1 hour ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

1 hour ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

4 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

5 hours ago