Political News

జ‌గ‌న్‌తో క‌లిసి కేసీఆర్ ఆ త‌ప్పులు చేయ‌క‌పోతే.. : రేవంత్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య‌లు చేశారు. నీటి వినియోగానికి సంబంధించి కేసీఆర్ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయ‌ని చెప్పారు. ఆ త‌ప్పులు జ‌రిగి ఉండ‌క‌పోతే.. ఇప్పుడు తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం అయ్యేద‌ని తెలిపారు. జ‌గ‌న్‌తో క‌లిసి మిలాఖ‌త్ అయిన కేసీఆర్‌.. తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాల‌ను ఏపీకి తాక‌ట్టు పెట్టార‌ని చెప్పారు. ఒక‌ర‌కంగా తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను ధారాద‌త్తం చేశారని తెలిపారు. దీనివ‌ల్ల ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాలు మ‌రింత‌గా ముదిరాయ‌ని, వీటిని ప‌రిష్క‌రించేందుకు తాము అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి వివ‌రించారు..

తాజాగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు, ఇత‌ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ స‌మావేశంపై మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి బ‌న‌క‌చ‌ర్ల వ్య‌వ‌హారం అస‌లు చ‌ర్చ‌కు రాలేద‌న్నారు. తాము అజెండాలో పేర్కొన్న అంశాల‌నే ప్ర‌స్తావించార‌ని.. ఏపీ చెప్పిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యం అస‌లు అజెండాలో లేన‌ప్పుడు.. దానిపై చ‌ర్చ ఊసుఎక్క‌డ ఉంటుంద‌ని..ప్ర‌శ్నించారు. దీనిపై ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు చేసిన ప్ర‌క‌ట‌న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా..(బ‌న‌క‌చ‌ర్ల‌పై క‌మిటీ ఏర్పాటు) అది ఆయ‌న‌నే అడ‌గాల‌ని.. ఆ విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తాము గోదావ‌రి జలాల వినియోగం.. నీటి ల‌భ్య‌త‌, త‌మ రాష్ట్రానికి చెందిన వాటాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించిన‌ట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిపైనే స‌మావేశం జ‌రిగింద‌న్నారు. ఇదేమీ అపెక్స్‌(వివాదాల ప‌రిష్కారం) క‌మిటీ భేటీ కాద‌న్నారు. దీంతో బ‌న‌క‌చ‌ర్ల ఊసు ఎక్క‌డా రాలేద‌ని చెప్పారు.కేవ‌లం పెండింగు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే ఈ స‌మావేశం జ‌రిగింద‌ని వివ‌రించారు. తాము కేసీఆర్ మాదిరిగా ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయాల‌ని భావించ‌డం లేద‌ని చెప్పారు. అందుకే స‌ర్దుబాటు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌న్నారు.

త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్న రేవంత్ రెడ్డి.. వీటిని స‌రిదిద్దేందుకు కేంద్రం కూడా అంగీక‌రించింద న్నారు. ఈ విష‌యంలో తాము విజ‌యం సాధించామ‌న్నారు. కేంద్రం పెద్ద‌న్న పాత్ర మాత్ర‌మే పోషిస్తోంద‌ని.. ఎవ‌రి వైపు మొగ్గు చూప‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. కానీ.. కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా కేంద్రం మొగ్గు చూపిన‌ట్టు ప్ర‌చారం చేసుకుంటున్నా ర‌ని.. దీనిని వారి అభిప్రాయానికే వ‌దిలివేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

This post was last modified on July 17, 2025 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెయిడ్ ట్వీట్లతో ప్రయోజనమేమి?

చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…

22 minutes ago

LSG: ఓనర్ గోయెంకా కోపంలో తప్పు లేదు!

ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…

24 minutes ago

తెలుగు టైటిల్స్ నిర్లక్ష్యం చేయకండి

ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…

48 minutes ago

క‌విత దూకుడు మామూలుగా లేదు

క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. మాజీసీఎం కేసీఆర్ త‌న‌య‌గా.. రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఆ పార్టీతో…

48 minutes ago

మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో నిర్మాత?

టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…

3 hours ago

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

5 hours ago