Political News

జ‌గ‌న్‌తో క‌లిసి కేసీఆర్ ఆ త‌ప్పులు చేయ‌క‌పోతే.. : రేవంత్

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య‌లు చేశారు. నీటి వినియోగానికి సంబంధించి కేసీఆర్ హ‌యాంలో అనేక త‌ప్పులు జ‌రిగాయ‌ని చెప్పారు. ఆ త‌ప్పులు జ‌రిగి ఉండ‌క‌పోతే.. ఇప్పుడు తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం అయ్యేద‌ని తెలిపారు. జ‌గ‌న్‌తో క‌లిసి మిలాఖ‌త్ అయిన కేసీఆర్‌.. తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాల‌ను ఏపీకి తాక‌ట్టు పెట్టార‌ని చెప్పారు. ఒక‌ర‌కంగా తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌ను ధారాద‌త్తం చేశారని తెలిపారు. దీనివ‌ల్ల ఇరు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాలు మ‌రింత‌గా ముదిరాయ‌ని, వీటిని ప‌రిష్క‌రించేందుకు తాము అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి వివ‌రించారు..

తాజాగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు, ఇత‌ర మంత్రులు భేటీ అయ్యారు. ఈ స‌మావేశంపై మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి బ‌న‌క‌చ‌ర్ల వ్య‌వ‌హారం అస‌లు చ‌ర్చ‌కు రాలేద‌న్నారు. తాము అజెండాలో పేర్కొన్న అంశాల‌నే ప్ర‌స్తావించార‌ని.. ఏపీ చెప్పిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యం అస‌లు అజెండాలో లేన‌ప్పుడు.. దానిపై చ‌ర్చ ఊసుఎక్క‌డ ఉంటుంద‌ని..ప్ర‌శ్నించారు. దీనిపై ఏపీ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు చేసిన ప్ర‌క‌ట‌న విష‌యాన్ని ప్ర‌స్తావించ‌గా..(బ‌న‌క‌చ‌ర్ల‌పై క‌మిటీ ఏర్పాటు) అది ఆయ‌న‌నే అడ‌గాల‌ని.. ఆ విష‌యం త‌మ‌కు తెలియ‌ద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తాము గోదావ‌రి జలాల వినియోగం.. నీటి ల‌భ్య‌త‌, త‌మ రాష్ట్రానికి చెందిన వాటాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించిన‌ట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిపైనే స‌మావేశం జ‌రిగింద‌న్నారు. ఇదేమీ అపెక్స్‌(వివాదాల ప‌రిష్కారం) క‌మిటీ భేటీ కాద‌న్నారు. దీంతో బ‌న‌క‌చ‌ర్ల ఊసు ఎక్క‌డా రాలేద‌ని చెప్పారు.కేవ‌లం పెండింగు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే ఈ స‌మావేశం జ‌రిగింద‌ని వివ‌రించారు. తాము కేసీఆర్ మాదిరిగా ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయాల‌ని భావించ‌డం లేద‌ని చెప్పారు. అందుకే స‌ర్దుబాటు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌న్నారు.

త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. ప్ర‌య‌త్నిస్తున్నామ‌న్న రేవంత్ రెడ్డి.. వీటిని స‌రిదిద్దేందుకు కేంద్రం కూడా అంగీక‌రించింద న్నారు. ఈ విష‌యంలో తాము విజ‌యం సాధించామ‌న్నారు. కేంద్రం పెద్ద‌న్న పాత్ర మాత్ర‌మే పోషిస్తోంద‌ని.. ఎవ‌రి వైపు మొగ్గు చూప‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. కానీ.. కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా కేంద్రం మొగ్గు చూపిన‌ట్టు ప్ర‌చారం చేసుకుంటున్నా ర‌ని.. దీనిని వారి అభిప్రాయానికే వ‌దిలివేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

This post was last modified on July 17, 2025 1:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

2 hours ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

3 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

3 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

4 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

6 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

6 hours ago