Trends

15 వేళ మందిని తొలగించిన మైక్రోసాఫ్ట్.. ఇది మరో హెచ్చరిక

ఏఐ వచ్చిన తర్వాత ఉద్యోగాలు పోతాయని చాలామందికి భయం. ఇప్పుడు అదే నిజం చేస్తూ మైక్రోసాఫ్ట్ ఒక కీలక హెచ్చరిక జారీ చేసింది. కేవలం ఈ ఏడాదిలోనే 15 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించిన ఈ టెక్ దిగ్గజం… మిగిలిన ఉద్యోగులకు కూడా ఒక్క క్లియర్ సూచన ఇచ్చింది “AI లో నైపుణ్యం పెంచుకోండి, లేదంటే బయటకు వెళ్లండి.”

2025 నాటికి కంపెనీ ఏఐ కోసం 80 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. ఇదే క్రమంలో “మైక్రోసాఫ్ట్ ఎలెవేట్” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీని ద్వారా 5 ఏళ్లలో 2 కోట్ల మందికి ఏఐ శిక్షణ ఇవ్వాలన్నది వారి లక్ష్యం. ఈ మధ్యే మైక్రోసాఫ్ట్ గేమింగ్, ఎక్స్‌బాక్స్, సేల్స్ విభాగాల్లో దాదాపు 9 వేల మందిని తొలగించింది. మే నెలలో 6 వేల మందిని, జూన్‌లో మరో వందల మందిని ఉద్యోగాల నుంచి తప్పించింది.

కంపెనీకి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ ఖర్చుల్ని తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ తీవ్రంగా చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో, ఏఐ పై భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల, అందరూ దాని సామర్థ్యాన్ని వినియోగించాల్సిందేనని హెచ్చరిస్తోంది. డెవలపర్ డివిజన్ హెడ్ జూలియా లియుసన్ మేనేజర్లతో నిర్వహించిన సమావేశంలో, ఇకపై ఏఐ వినియోగం ఎక్కువగా ఉంటుందని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.

మైక్రోసాఫ్ట్ కోపిలాట్, అజూర్ ఏఐ, గిట్‌హబ్ కోపిలాట్ లాంటి టూల్స్ ఎలా ఉపయోగించాలో తెలిసేంతవరకూ ఉద్యోగంలో భద్రత ఉండదని హెచ్చరించారు. ఏఐ స్కిల్స్‌ను బట్టి ఉద్యోగుల్లో పనితీరు అంచనా వేస్తామని తెలియజేశారు. ఈ చర్యలతో మైక్రోసాఫ్ట్ ఇప్పటికే 500 మిలియన్ డాలర్ల వరకు ఖర్చులు తగ్గించిందట. టెక్నాలజీ మారుతున్న వేగాన్ని దృష్టిలో పెట్టుకుంటే, ఉద్యోగాలు కోల్పోకుండా ఉండాలంటే ఇప్పటినుంచే ఏఐపై దృష్టి పెట్టాల్సిందేననే సందేశాన్ని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఇది భారత్‌లోని ఐటీ ఉద్యోగులకు కూడా హెచ్చరికే కావచ్చు.

This post was last modified on July 12, 2025 12:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పుల కష్టాల నుండి ఐపీఎల్ హీరో వరకు..

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సెన్సేషన్ ముకుల్ చౌదరి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. కేకేఆర్ పై అతను…

36 minutes ago

ఆ రెడ్ల మౌనం వెనుక రహస్యం..?

వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక…

41 minutes ago

ఎమ్మెల్సీ సీటుకి 30 కోట్లా?

రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా...ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క…

1 hour ago

అతిథి చాలా పెద్ద రిస్కు చేస్తున్నాడు

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి…

2 hours ago

ప్రేక్షకుల పట్ల బాధ్యత లేదా?

గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే…

3 hours ago

జన నాయగన్ పైరసీ వెనుక శత్రువులెవరు

నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్…

4 hours ago