Trends

సంగారెడ్డిలో భారీ పేలుడు..8 మంది మృతి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలో చాలా కాలం క్రితం కార్యకలాపాలు సాగిస్తున్న సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఉదయం ఉన్నట్లుండి ఓ కెమికల్ రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి పరిశ్రమల చుట్టుపక్కన ఏకంగా 6 నుంచి 7 కిలో మీటర్ల దాకా ప్రకంపనలు నమోదయ్యాయి. జనం భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు.

ఉదయమే కార్మికులంతా విధుల్లోకి చేరిన కొంతసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీంతో రియాక్టర్ కు సమీపంలో ఉన్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇక గాయపడ్డ వారిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. ఇక మిగిలిన క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పేలుడు ధాటికి రియాక్టర్ సమీపంలోని మూడంతస్తుల భవనం నేలమట్లం అయ్యింది. మరి ఈ భవన శిధిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా?అన్న దిశగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిసరాల్లోని పరిశ్రమల్లో ఇంతటి భారీ ప్రమాదం సంభవించలేదనే చెప్పాలి. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా పరిశ్రమలు నగరానికి మరింత దూరంగా తరలిపోతుండటం…ఆయా ప్రాంతాల్లో కొత్తగా నిర్మితం అవుతున్న యూనిట్లలో పరిశ్రమల యాజమాన్యాలు సేఫ్టీ మెజర్లను పాటిస్తున్న నేపథ్యంలో పెద్దగా ప్రమాదాలే చోటుచేసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ తీవ్ర కలవరపాటుకు గురి చేస్తూ సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ప్రస్తుతం పరిశ్రమలో మంటలు అదుపులోకి వచ్చినా… ఇంకా సహాయక చర్యలు పూర్తి కాలేదు. కార్మికుల్లో మరో 10 మంది కనిపించడం లేదని పరిశ్రమ యాజమాన్యం చెబుతోంది.

ఇదిలా ఉంటే…ఈ ప్రమాదంపై తెలంగాణ సర్కారు వేగంగా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అధికారులకు ఫోన్ చేసి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. మృతుల గురించి ఆరా తీసిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం గురించి తెలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ నేరుగా ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. 

This post was last modified on June 30, 2025 1:43 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sangareddy

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

8 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

8 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

11 hours ago