Trends

సంగారెడ్డిలో భారీ పేలుడు..8 మంది మృతి

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాశమైలారం పారిశ్రామిక వాడలో చాలా కాలం క్రితం కార్యకలాపాలు సాగిస్తున్న సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఉదయం ఉన్నట్లుండి ఓ కెమికల్ రియాక్టర్ పేలింది. ఈ పేలుడు ధాటికి పరిశ్రమల చుట్టుపక్కన ఏకంగా 6 నుంచి 7 కిలో మీటర్ల దాకా ప్రకంపనలు నమోదయ్యాయి. జనం భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడ్డారు.

ఉదయమే కార్మికులంతా విధుల్లోకి చేరిన కొంతసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీంతో రియాక్టర్ కు సమీపంలో ఉన్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఇక గాయపడ్డ వారిని సంగారెడ్డి ఆసుపత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. ఇక మిగిలిన క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పేలుడు ధాటికి రియాక్టర్ సమీపంలోని మూడంతస్తుల భవనం నేలమట్లం అయ్యింది. మరి ఈ భవన శిధిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా?అన్న దిశగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవలి కాలంలో హైదరాబాద్ పరిసరాల్లోని పరిశ్రమల్లో ఇంతటి భారీ ప్రమాదం సంభవించలేదనే చెప్పాలి. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో ఆయా పరిశ్రమలు నగరానికి మరింత దూరంగా తరలిపోతుండటం…ఆయా ప్రాంతాల్లో కొత్తగా నిర్మితం అవుతున్న యూనిట్లలో పరిశ్రమల యాజమాన్యాలు సేఫ్టీ మెజర్లను పాటిస్తున్న నేపథ్యంలో పెద్దగా ప్రమాదాలే చోటుచేసుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ తీవ్ర కలవరపాటుకు గురి చేస్తూ సిగాచీ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ప్రస్తుతం పరిశ్రమలో మంటలు అదుపులోకి వచ్చినా… ఇంకా సహాయక చర్యలు పూర్తి కాలేదు. కార్మికుల్లో మరో 10 మంది కనిపించడం లేదని పరిశ్రమ యాజమాన్యం చెబుతోంది.

ఇదిలా ఉంటే…ఈ ప్రమాదంపై తెలంగాణ సర్కారు వేగంగా స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అధికారులకు ఫోన్ చేసి ప్రమాదంపై వివరాలు తెలుసుకున్నారు. మృతుల గురించి ఆరా తీసిన ఆయన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదం గురించి తెలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనర్సింహ నేరుగా ఘటనా స్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. 

Satya

Recent Posts

తెలుగు కుర్రాడికి రజినీ సినిమాలో ఛాన్స్

తెలుగు సినిమాలకు ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తీసుకురావడం మామూలే. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ల విషయంలో ఎక్కువగా వేరే ఇండస్ట్రీల మీద…

11 hours ago

ఓజీ-2: పవన్ మారాలి… సుజీతూ మారాలి

అవసరమున్నా లేకపోయినా.. సీక్వెల్స్‌కు లీడ్ ఇవ్వడం అన్నది ఈ రోజుల్లో మామూలైపోయింది. అలా హింట్ ఇచ్చిన సినిమాల్లో సెకండ్ పార్ట్…

12 hours ago

రెహమాన్ కంబ్యాక్ జరిగిందా లేదా

పెద్ది థియేటర్ రన్ ముగింపు దిశగా వెళ్తోంది. ఈ వీకెండ్ కాస్త పికపయ్యే అవకాశాలున్నాయి. పాత రీ రిలీజులు తప్ప…

14 hours ago

నా చేతులు నా ఇష్టం అంటే చేతులు విరుగుతాయి

ఇటీవలే సింగర్ సునీత మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్త్రీలు 'నా శరీరం నా ఇష్టం' అన్నప్పుడు అవతలి…

14 hours ago

ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు వీర‌మ‌ర‌ణం

గ‌త ఏడాది మేలో జ‌రిగిన ఆప‌రేష‌న్ సిందూర్‌లో ఆరుగురు సైనికులు వీర‌మ‌ర‌ణం చెందిన‌ట్టు కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. దాదాపు 13…

14 hours ago

వారణాసి మాట మార్చే ఛాన్స్ లేనట్టే

రాజమౌళి సినిమాలకు ఎప్పుడూ వచ్చే సమస్య ఒకటుంది. అదే చెప్పిన రిలీజ్ డేట్ కి కట్టుబడకపోవడం. బాహుబలి రెండు భాగాలు,…

15 hours ago