కొన్ని వారాల క్రితం హేరా ఫేరీ 3 నుంచి తాను తప్పుకుంటున్నట్టు సీనియర్ నటుడు పరేష్ రావల్ ప్రకటించడం బాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది. ఆయన లేకుండా సీక్వెల్ ఏంటని ఆ ఫ్రాంచైజ్ లవర్స్ ఎక్స్ వేదికగా వేలల్లో ట్వీట్లు పెట్టారు. అయితే తాజాగా పరేష్ రావల్ ఇచ్చిన ఒక ప్యాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఈ వివాదం సమిసిపోయిందని, అందరూ కష్టపడి ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే సంకల్పం పెట్టుకోవాలని చెప్పడం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. అంటే హేరా ఫేరీ 3లో నేనున్నాననే సంకేతం ఇచ్చినట్టేగా. అయితే దీని వెనుక పెద్ద మతలబే జరిగిందని బాలీవుడ్ మీడియా వర్గాల కథనం. అదేంటో చూద్దాం.
హేరా ఫేరీ 3 లో పరేష్ రావల్ చేయడం లేదని తెలిశాక హక్కులు కొన్న నిర్మాత కం హీరో అక్షయ్ కుమార్ ఏకంగా పాతిక కోట్ల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ కోర్టుకు వెళ్ళాడు. దానికి పరేష్ లాయర్లు కౌంటర్లు ఇస్తూ కాలం గడిపారు. అయితే ఈ కాంట్రావర్సి కన్నా ముందు ఈ సినిమాలో నటించేందుకు గాను ఇస్తామన్న 15 కోట్ల రెమ్యునరేషన్ లో కేవలం 11 లక్షలు మాత్రమే అడ్వాన్స్ ఇచ్చి మిగిలిన 14 కోట్ల 89 లక్షలను రిలీజైన నెల తర్వాత ఇచ్చేలా ఒప్పందం అడిగారట. దీంతో పరేష్ రావల్ కు ఇది న్యాయంగా అనిపించలేదు. డిమాండ్ చేయడం కన్నా మౌనంగా తప్పుకోవడం మేలని భావించి అదే బయటికి చెప్పేశారు.
న్యాయస్థానం చుట్టూ తిరగడం కన్నా రాజీ పడి సినిమా చేయడం మేలని భావించి అక్షయ్, పరేష్ ఇద్దరూ భావించడం వల్లే కథ క్లైమాక్స్ కు చేరుకుందని అంటున్నారు. అంటే పరేష్ కోరినట్టు రిలీజ్ కు ముందే పారితోషికం ఇచ్చేలా అగ్రిమెంట్ జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా ఇది శుభవార్తే. హేరా ఫేరీ 3ని పెద్దాయన లేకుండా ఊహించుకోవడం అసాధ్యం. మొత్తానికి శుభం కార్డు వేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత అప్పటి కామెడీ మేజిక్ ని మళ్ళీ సృష్టించడం అంత ఈజీ కాదు. ఎంత ప్రియదర్శనే దర్శకుడైనా చాలా పెద్ద సవాలే. మొదటి రెండు భాగాలను మించిన బ్లాక్ బస్టర్ ఇవ్వాలి మరి.
This post was last modified on June 30, 2025 1:18 pm
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…