బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. ప్రతిపక్ష పార్టీ అయినా..సొంత పార్టీ అయినా..చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన నైజం. పార్టీ బలోపేతం కోసం, పార్టీని అధికారంలోకి తేవడం కోసం తపనతో చేస్తున్నానని చెబుతూ రాజాసింగ్ చేసే పలు కామెంట్లు ఎన్నోసార్లు కాంట్రవర్షియల్ అయ్యాయి. అయినా సరే నేనింతే అంటూ రాజా సింగ్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా మరోసారి రాజా సింగ్ తన మార్కు కామెంట్లతో వార్తల్లో నిలిచారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై రాజాసింగ్ పెదవి విరిచారు. నావాడు, నీవాడు అంటూ అధ్యక్షుడిని నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని రాజా సింగ్ అంటున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, కానీ, ఇలా నియమించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్యనేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని రాజాసింగ్ అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హై కమాండ్ నియమించారని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావు పేరు ఖరారైందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజా సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరి, రాజా సింగ్ కామెంట్లపై బీజేపీ హై కమాండ్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…