Trends

జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో వారెలా చ‌నిపోయారు?

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత పూరీ జ‌గ‌న్నాథుని రథ‌యాత్ర‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏటా ఆషాధ శుద్ధ విదియ తిథి నుంచి 12 రోజులు జ‌రిగే ఈ ర‌థ‌యాత్ర‌కు దేశ విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లి వ‌స్తారు. అశేష జ‌నంతో పూరీ కిట‌కిట‌లాడుతుంది. ఈ ఏడాది కూడా అలానే జ‌రిగింది. అయితే.. గ‌తంలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. కొన్ని ఆంక్ష‌లు విధించేవారు. ఈ సారి బీజేపీ స‌ర్కారు ఎలాంటి ఆంక్ష‌లు లేకుండానే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

దీంతో ల‌క్ష‌ల సంఖ్య‌లో వచ్చిన భక్తుల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తు న్నాయి. ర‌థ‌యాత్ర‌లో కీల‌క ఘ‌ట్ట‌మైన‌.. గుండిచా ఆల‌యం వ‌ద్ద‌కు మూడు ర‌థాలు చేరుకున్న త‌ర్వాత‌.. ఆయా ర‌థాల్లోని మూర్తుల‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా ఎగ‌బ‌డ్డారు. గ‌తంలో దీనిని ఓ క్ర‌మ ప‌ద్ధ‌తిలో చేసేవార‌ని స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ ద‌ఫా ఎలాంటి ఆంక్ష‌లు లేక‌పోవ‌డంతో మూర్తుల‌ను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన వారు ఒక‌రిపై ఒక‌రు తోసుకున్నారు.

దీంతో తీవ్ర తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈఘ‌ట‌న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 100 మందికి పైగానే భ‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ ప్ర‌భుత్వం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. వెంట‌నే బాధిత కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున పరిహారం ప్ర‌క‌టించింది. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు.. ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించింది. ఇదిలావుంటే.. ఏటా జ‌రిగే జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో గ‌తంలో ఎప్పుడూ మ‌ర‌ణాలు చోటు చేసుకోలేద‌ని.. ప్ర‌భుత్వ‌మే జాగ్ర‌త్త‌లు తీసుకుంద‌ని ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేడీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on June 29, 2025 10:44 pm

Share

Recent Posts

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

56 minutes ago

సైలెంటుగా వ‌చ్చి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టేసింది

నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమ‌మ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన న‌టుడు. ఆ…

6 hours ago

ముఖ్యమంత్రి పదవికి దీప్కే రాజీనామా

అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…

10 hours ago

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

11 hours ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

12 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

13 hours ago