ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏటా ఆషాధ శుద్ధ విదియ తిథి నుంచి 12 రోజులు జరిగే ఈ రథయాత్రకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు. అశేష జనంతో పూరీ కిటకిటలాడుతుంది. ఈ ఏడాది కూడా అలానే జరిగింది. అయితే.. గతంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఉన్నప్పుడు.. కొన్ని ఆంక్షలు విధించేవారు. ఈ సారి బీజేపీ సర్కారు ఎలాంటి ఆంక్షలు లేకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో లక్షల సంఖ్యలో వచ్చిన భక్తుల భద్రతకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. రథయాత్రలో కీలక ఘట్టమైన.. గుండిచా ఆలయం వద్దకు మూడు రథాలు చేరుకున్న తర్వాత.. ఆయా రథాల్లోని మూర్తులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా ఎగబడ్డారు. గతంలో దీనిని ఓ క్రమ పద్ధతిలో చేసేవారని స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ దఫా ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో మూర్తులను దర్శించుకునేందుకు వచ్చిన వారు ఒకరిపై ఒకరు తోసుకున్నారు.
దీంతో తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈఘటన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగానే భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ వ్యవహారంపై బీజేపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. వెంటనే బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు.. ఆసుపత్రులకు తరలించింది. ఇదిలావుంటే.. ఏటా జరిగే జగన్నాథుని రథయాత్రలో గతంలో ఎప్పుడూ మరణాలు చోటు చేసుకోలేదని.. ప్రభుత్వమే జాగ్రత్తలు తీసుకుందని ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న బీజేడీ నాయకులు విమర్శలు గుప్పించారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…