Trends

జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో వారెలా చ‌నిపోయారు?

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత పూరీ జ‌గ‌న్నాథుని రథ‌యాత్ర‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏటా ఆషాధ శుద్ధ విదియ తిథి నుంచి 12 రోజులు జ‌రిగే ఈ ర‌థ‌యాత్ర‌కు దేశ విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లి వ‌స్తారు. అశేష జ‌నంతో పూరీ కిట‌కిట‌లాడుతుంది. ఈ ఏడాది కూడా అలానే జ‌రిగింది. అయితే.. గ‌తంలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. కొన్ని ఆంక్ష‌లు విధించేవారు. ఈ సారి బీజేపీ స‌ర్కారు ఎలాంటి ఆంక్ష‌లు లేకుండానే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

దీంతో ల‌క్ష‌ల సంఖ్య‌లో వచ్చిన భక్తుల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తు న్నాయి. ర‌థ‌యాత్ర‌లో కీల‌క ఘ‌ట్ట‌మైన‌.. గుండిచా ఆల‌యం వ‌ద్ద‌కు మూడు ర‌థాలు చేరుకున్న త‌ర్వాత‌.. ఆయా ర‌థాల్లోని మూర్తుల‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా ఎగ‌బ‌డ్డారు. గ‌తంలో దీనిని ఓ క్ర‌మ ప‌ద్ధ‌తిలో చేసేవార‌ని స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ ద‌ఫా ఎలాంటి ఆంక్ష‌లు లేక‌పోవ‌డంతో మూర్తుల‌ను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన వారు ఒక‌రిపై ఒక‌రు తోసుకున్నారు.

దీంతో తీవ్ర తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈఘ‌ట‌న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 100 మందికి పైగానే భ‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ ప్ర‌భుత్వం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. వెంట‌నే బాధిత కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున పరిహారం ప్ర‌క‌టించింది. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు.. ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించింది. ఇదిలావుంటే.. ఏటా జ‌రిగే జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో గ‌తంలో ఎప్పుడూ మ‌ర‌ణాలు చోటు చేసుకోలేద‌ని.. ప్ర‌భుత్వ‌మే జాగ్ర‌త్త‌లు తీసుకుంద‌ని ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేడీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on June 29, 2025 10:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అప్పుల కష్టాల నుండి ఐపీఎల్ హీరో వరకు..

లక్నో సూపర్ జెయింట్స్ కొత్త సెన్సేషన్ ముకుల్ చౌదరి ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. కేకేఆర్ పై అతను…

18 minutes ago

ఆ రెడ్ల మౌనం వెనుక రహస్యం..?

వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత పరిస్థితులు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఒకప్పుడు అధికారం చుట్టూ తిరిగిన కీలక…

23 minutes ago

ఎమ్మెల్సీ సీటుకి 30 కోట్లా?

రాజకీయం ఇప్పుడు డబ్బు చుట్టూ నడుస్తోంది. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా...ఇది పచ్చి నిజం. డబ్బు లేనిది ఏ ఒక్క…

1 hour ago

అతిథి చాలా పెద్ద రిస్కు చేస్తున్నాడు

ఈ మధ్య రీ రిలీజుల ట్రెండ్ కొత్త పోకడలు పోతోంది. మొదలైనప్పుడు కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేయడం దగ్గరి…

2 hours ago

ప్రేక్షకుల పట్ల బాధ్యత లేదా?

గతంలో ఒక సినిమాకు ఓ రిలీజ్ డేట్ ప్రకటించారు అంటే దాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. ఎలాగైనా చెప్పిన డేటుకే…

3 hours ago

జన నాయగన్ పైరసీ వెనుక శత్రువులెవరు

నిన్న సాయంత్రం నుంచి విజయ్ అభిమానులకు నిద్ర రావడం లేదు. ముందు జన నాయకుడు లీక్స్ అంటూ తమిళ వెర్షన్…

3 hours ago