Trends

జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో వారెలా చ‌నిపోయారు?

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత పూరీ జ‌గ‌న్నాథుని రథ‌యాత్ర‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏటా ఆషాధ శుద్ధ విదియ తిథి నుంచి 12 రోజులు జ‌రిగే ఈ ర‌థ‌యాత్ర‌కు దేశ విదేశాల నుంచి భ‌క్తులు త‌ర‌లి వ‌స్తారు. అశేష జ‌నంతో పూరీ కిట‌కిట‌లాడుతుంది. ఈ ఏడాది కూడా అలానే జ‌రిగింది. అయితే.. గ‌తంలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు.. కొన్ని ఆంక్ష‌లు విధించేవారు. ఈ సారి బీజేపీ స‌ర్కారు ఎలాంటి ఆంక్ష‌లు లేకుండానే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

దీంతో ల‌క్ష‌ల సంఖ్య‌లో వచ్చిన భక్తుల భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం లేకుండా పోయింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తు న్నాయి. ర‌థ‌యాత్ర‌లో కీల‌క ఘ‌ట్ట‌మైన‌.. గుండిచా ఆల‌యం వ‌ద్ద‌కు మూడు ర‌థాలు చేరుకున్న త‌ర్వాత‌.. ఆయా ర‌థాల్లోని మూర్తుల‌ను ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా ఎగ‌బ‌డ్డారు. గ‌తంలో దీనిని ఓ క్ర‌మ ప‌ద్ధ‌తిలో చేసేవార‌ని స్థానికులు మీడియాకు తెలిపారు. ఈ ద‌ఫా ఎలాంటి ఆంక్ష‌లు లేక‌పోవ‌డంతో మూర్తుల‌ను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చిన వారు ఒక‌రిపై ఒక‌రు తోసుకున్నారు.

దీంతో తీవ్ర తొక్కిస‌లాట చోటు చేసుకుంది. ఈఘ‌ట‌న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 100 మందికి పైగానే భ‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారంపై బీజేపీ ప్ర‌భుత్వం ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. వెంట‌నే బాధిత కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున పరిహారం ప్ర‌క‌టించింది. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు.. ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించింది. ఇదిలావుంటే.. ఏటా జ‌రిగే జ‌గ‌న్నాథుని ర‌థ‌యాత్ర‌లో గ‌తంలో ఎప్పుడూ మ‌ర‌ణాలు చోటు చేసుకోలేద‌ని.. ప్ర‌భుత్వ‌మే జాగ్ర‌త్త‌లు తీసుకుంద‌ని ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంగా ఉన్న బీజేడీ నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పించారు.

This post was last modified on June 29, 2025 10:44 pm

Share

Recent Posts

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

47 minutes ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

1 hour ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

2 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

3 hours ago

బుచ్చిబాబు మిస్ చేసుకున్న ఎలిమెంట్స్

ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…

3 hours ago

ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి కుటుంబాల్లో సమస్యలు లేవా…?

పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…

3 hours ago